Andhra Pradesh

News June 6, 2024

అలిపిరి బస్టాండు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

తిరుపతిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ గుంతలో పడి మృతి చెందినట్లు అలిపిరి SI రామస్వామి తెలిపారు. అలిపిరి బాలాజీ బస్టాండ్ వద్ద మద్యం మత్తులో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ కోసం తీసిన గోతిలో పడ్డాడు. ఎవరు చూడకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రుయాలోని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News June 6, 2024

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాం: ఢిల్లీరావు

image

ప్రశాంత వాతావరణంలో నిర్వ‌హించ‌డంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డిల్లీరావు పేర్కొన్నారు. నేడు విజయవాడలో అధికారుల‌తో స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికారులు, సిబ్బంది నిబద్దతతో వ్యవహరిస్తూ.. విధులు నిర్వర్తించారని తెలిపారు. అన్ని విధాలా సహకరించిన జిల్లా ప్రజలకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

News June 6, 2024

శ్రీకాకుళం: బీఈడీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో రెండేళ్ల బీఈడీ కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని AU పరీక్షల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

News June 6, 2024

కృష్ణా: బీ- ఫార్మసీ పరీక్షల ఫలితాల విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీ- ఫార్మసీ ఎనిమిదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News June 6, 2024

తణుకులో సైకిల్‌ను ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి

image

ప.గో జిల్లా తణుకు మండలం తేతలి హైవేపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తణుకు రూరల్‌ పోలీసుల వివరాల ప్రకారం.. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన నక్కా వెంకటేశ్వరరావు(59) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం సైకిల్‌పై తణుకు వైపు వస్తుండగా లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ మృతి చెందాడు.

News June 6, 2024

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి.?

image

నెల్లూరు TDP ఎంపీగా భారీ మెజార్టీ (2,45,902)తో గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న వేమిరెడ్డి కేంద్ర మంత్రి అయితే, రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని వస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ అన్నీ స్థానాలు గెలవడానికి కూడా ఆయన కృషి ఉంది.

News June 6, 2024

ప్రొద్దుటూరు: అగస్త్యేశ్వరునికి భస్మ హారతి

image

ప్రొద్దుటూరు ఆగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్త్యేశ్వర స్వామికి రుద్రాభిషేకం, రాజరాజేశ్వరికి పంచామృతాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. సాయంత్రం ఆగస్త్యేశ్వర స్వామి మూలవిరాట్‌కు వేద పండితులు మంత్రోచ్ఛారణలతో భస్మాభిషేకం నిర్వహించి భస్మ హారతి ఇచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

News June 6, 2024

తిరుపతిలో దొంగలు హల్‌చల్

image

తిరుపతి వినాయక నగర్లో దొంగలు చొరబడి షకీల ఇంట్లో 46 గ్రాముల బంగారం, రూ.80 వేల నగదును ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. వినాయక నగర్లో ఉండే షకీల బుధవారం రాత్రి పనిపై తాళం వేసుకొని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు తలుపులు పగల గొట్టి చోరీ చేయడాన్ని గురువారం గుర్తించింది. ఫిర్యాదుపై స్పందించి క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

News June 6, 2024

సంతమాగులూరు: తంగేడిమల్లిలో YSR విగ్రహం ధ్వంసం

image

సంతమాగులూరు మండలంలోని తంగేడిమల్లిలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం పాక్షికంగా ధ్వంసం చేశారు. గ్రామం సమీపాన ఉన్న వైఎస్సార్ విగ్రహం చేతిని దుండగులు విరగగొట్టారు. అలాగే గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు.

News June 6, 2024

వివాదాస్పద పోస్టులు పెడితే ఊరుకోం: ఎస్పీ శ్రీధర్

image

సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లికి చెందిన వరసల ముత్యాలరావు సోషల్ మీడియాలో కులాలను రెచ్చగొట్టే విధంగా వాయిస్ మెసేజ్ పెట్టాడని, అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. ఈ విధమైన నేరాలకు ఎవరు పాల్పడినా కఠినమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.