India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 9.30 నుంచి మినీ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ప్రిన్సిపల్ p. సురేఖ తెలిపారు. సుమారు 20 కార్పొరేట్ సంస్థలు పాల్గొంటాయని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి మీడియా ప్రతినిధులు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీ కప్ను ఆవిష్కరించారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో ‘అమరావతి జర్నలిస్టు క్రికెట్ లీగ్’ పోటీలు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు ఏసీఏ స్టేడియంలో జరగనున్నాయి. టోర్నీలో 10 మీడియా జట్లు పాల్గొంటున్నాయి. ఏర్పాట్లు పూర్తి చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
భీమిలిలో మంగళవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కూతురి పట్ల కీచకుడిగా మారాడు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన అప్పన్న మద్యం మత్తులో తగరపువలసలో ఉన్న షాపులో కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అడ్డుపడి భీమిలి పోలీసులకు అప్పగించారు. బాలికను చికిత్స నిమిత్తం KGHకి తరలించారు. మహిళా స్టేషన్ ACP పెంటారావు సంఘటనా స్థలాన్ని బుధవారం పరిశీలించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాకు మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా 8 మందిని ప్రభుత్వం బుధవారం నియమించింది. వీరిలో 7 టీడీపీకి, 1 మాత్రమే జనసేనకు చెందడం ఆసక్తికర చర్చలకు దారి తీసింది. అధికార కూటమిలో భాగమైనా జనసేనకు తక్కువ ప్రాధాన్యం ఎందుకు కలిగిందన్న దానిపై రాజకీయ వర్గాల్లో గట్టిగా చర్చలు సాగుతోందన్నారు. ఇదిలా ఉండగా బీజేపీకి అసలు ఏమి అవకాశం లభించలేదు. 2 పార్టీల సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసికి కీలక పదవి లభించింది. చంద్రగిరికి చెందిన టీడీపీ మహిళా నేత లంకెళ్ల లలిత, శ్రీరాముల కుమారుడు బద్రి 25 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. అక్కడి విస్కాన్ సిన్ స్టేట్లోని మాడిసన్ డిస్ట్రిక్ట్-7లో అల్డర్ పర్సన్గా 53.8 శాతం ఓట్లతో గెలిచారు. తాజాగా ఆయన నాలుగు శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ఈనెల 17 గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్డిఎఫ్సి ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి బ్యాంకింగ్, ఐటి, నాన్ ఐటీ సంస్థలకు చెందిన వారు 470 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
పిడుగురాళ్ల (M) బ్రాహ్మణపల్లి ZP స్కూల్ ఇంగ్లిష్ టీచర్ వెంకటరెడ్డి గుంటూరు DEO ఆఫీస్ వద్ద గుండెపోటుతో కుప్పకూలిపోయారు. DEO సి.వి రేణుక సత్వరమే స్పందించడంతో ఉర్దూ DI ఖాశీం, DEO ఆఫీస్ సిబ్బంది హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. తూర్పు MEO ఖుద్దూస్, APTF అధ్యక్షుడు బసవలింగారావు వెంకటరెడ్డికి నివాళులర్పించారు. ఈయన 2 నెలల్లో రిటైర్ కానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
శ్రీకాకుళం డీఎంహెచ్ఓ టి. బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడో తేదీన ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్కు రిమాండ్ పొడిగిస్తూ నరసారావుపేటలోని రెండో అదనపు న్యాయాధికారి గాయ్రతి ఉత్తర్వులు ఇవ్వడంతో అతడిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. సీఎం, Dy.CM, లోకేశ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 28 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
నెల్లూరులోని వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన మహిళ నెల్లూరు హరనాథపురం శివారులోని ఓ అపార్ట్మెంట్లో ఇంటిని రెంట్కు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు దాడి చేశారు. ఆమెతో పాటు విటుడు మహేశ్ను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.