India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు జేసీ బి.నవ్య తెలిపారు. కొత్తగా 4,056 మంది కార్డుదారులు చేరడంతో మొత్తం 6,68,944 డిజిటల్ రేషన్ కార్డులు ATM సైజు, ఫొటో, రేషన్ షాప్ వివరాలు, క్యూఆర్ కోడ్, E-KYC వివరాలతో ఉంటాయన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్ద పంపిణీ చేస్తారన్నారు. అక్టోబర్ 2 నుంచి రేషన్ షాప్ల ద్వారా పొందవచ్చు అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ‘నవరాత్రి పోషణ్ మహా ప్రోగ్రాం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం వన్ స్టాప్ సెంటర్ను సందర్శించనున్నారని చెప్పారు.
జిల్లాలో ఈనెల 25, 26, 27 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని గుంటూరు కలెక్టర్ తమిమ్ అన్సారియా గురువారం తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పిల్లలు, పశువులను నీటి ప్రవాహాల వద్దకు పంపకూడదని సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని పేర్కొన్నారు. మండల, డివిజినల్ అధికారులు స్థానిక స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కంట్రోల్ రూమ్ నం. 0863-2234014 కి సమాచారమివ్వాలని తెలిపారు.
విద్యుత్ రంగంలో ఆధునీకరణకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్, క్లైమేట్ కలెక్టివ్ ఫౌండేషన్లతో విశాఖలో ఏపీఈపీడీసీఎల్ ఒప్పందం చేసుకుంది. విద్యుత్ పంపిణీ నెట్వర్క్ ఆధునీకరణ, డీ కార్బనైజేషన్కు ఈ సంస్థలు కలిసి పనిచేస్తాయి. స్మార్ట్ గ్రిడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖ కమీషనరేట్ పరిధిలో 12 మంది పోలీస్ సిబ్బందికి పదోన్నతలు లభించాయి. సీపీ శంఖబ్రత బాగ్చి వారిని గురువారం సత్కరించి, పదోన్నతి ర్యాంకులతో పాటుగా పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని సీపీ సూచించారు. వీరిలో ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు.. ఏఎస్ఐలుగా, ఏడుగురు కానిస్టేబుళ్లు.. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు.
విశాఖ పరిధిలో ప్రతిభ కనబర్చిన 113 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి గురువారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారులు రివార్డులు అందుకున్నారు. గంజాయి సీజ్, పలు కేసుల్లో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువుల రికవరీ, సైబర్ క్రైమ్ కేసుల్లో ఉత్తమ ప్రతిభ, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెలా రివార్డులను అందజేస్తున్నారు.
జీఎస్టీ సంస్కరణలు, మారిన ధరలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సూచించారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో జరిగిన జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనల ఉల్లంఘన జరగకుండా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లైస్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులకు హితవు పలికారు.
జిల్లా యువజన సంక్షేమ శాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(VBYLD) క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సిరి తెలిపారు. ఈ క్విజ్లో 15-29 ఏళ్ల యువత ఉచితంగా పాల్గొనవచ్చన్నారు. జాతీయ యువజన ఉత్సవం-2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్ 15 వరకు ఆన్లైన్లో జరుగుతాయన్నారు. తెలుగు సహా 12 భాషల్లో బహుళైచిక ప్రశ్నల రూపంలో నిర్వహించనున్నట్లు వివరించారు.
సీసీఆర్సీ కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణాల మంజూరులో బ్యాంకులు రైతులకు ఇచ్చే పాస్బుక్లలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌలు రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు.
రాజమండ్రిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ఎండి. అబ్దుల్ నబీ సారధ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 కేసులను నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 51 మందికి జరిమానా విధించగా, ఆరుగురికి రెండు రోజులు, ముగ్గురికి మూడు రోజులు చొప్పున మొత్తం 9 మందికి కోర్టులో జైలు శిక్ష పడింది.
Sorry, no posts matched your criteria.