Andhra Pradesh

News March 23, 2024

VZM: ‘సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గింపు’

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం సేల్స్ తగ్గిస్తామని జిల్లా ఐఎంఎల్ డిపో మేనేజర్ ఎన్ వి రమణ వెల్లడించారు. నెల్లిమర్ల ఐఎంఎల్ డిపోలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిపో పరిధిలో ఉన్న 279 మద్యం షాపులకు సంబంధించి గత ఏడాది కన్నా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి సేల్స్ తగ్గిస్తామని చెప్పారు. డిపో పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించనున్నట్లు చెప్పారు.

News March 23, 2024

విశాఖ: ‘సీఎం, మంత్రుల ఫోటోలు ఉండకూడదు’

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయాలని జిల్లా ఎన్నికల అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆర్.ఓలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి జారీ చేయబడే విద్యుత్, తాగునీరు, ఇతర బిల్లులపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ ప్రతినిధుల ఫొటోలు గాని, వారి సందేశాలు గాని ఉండకూడదని స్పష్టం చేశారు.

News March 23, 2024

‘ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత పరచండి’

image

ఏప్రిల్ మూడో తేదీ సీజర్స్ అంశంపై సిఎస్, డిజిపి లతో భారత్ ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్ సీజర్స్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృతస్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా సత్యసాయి జిల్లా అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని, జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచాలన్నారు.

News March 23, 2024

శ్రీకాకుళం: ప్రచారాలకు అనుమతులు తప్పనిసరి

image

జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీల ప్రచారాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న సమావేశాలకు, లౌడ్‌స్పీకర్లకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. అభ్యర్థులు ఒక వాహనానికి నియోజకవర్గంలో తిరగడానికి తీసుకున్న అనుమతి ఆ నియోజకవర్గంలో మాత్రమే ఆ వాహనాన్ని వినియోగించాలన్నారు.

News March 23, 2024

ఎన్నికలు ముగిసే వరకు నాయకులు సత్ప్రవర్తనతో నడుచుకోవాలి: ఎస్పీ

image

నంద్యాల: ఎన్నికలు ముగిసే వరకు నాయకులు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుటకు పోలీస్ శాఖ వారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు అభ్యర్థులు, నాయకులు సహకరించాలన కోరారు.

News March 23, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైంటేబుల్ విడుదల

image

కృష్ణా వర్సిటీ పరిధిలోని డిగ్రీ(2019- 20 బ్యాచ్) విద్యార్థులు రాయాల్సిన 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 2 నుంచి 20 వరకు ఈ పరీక్షలు ఆయా తేదీల్లో జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షల టైం టేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది.

News March 23, 2024

కడప: ప్రశాంత ఎన్నికల కోసం పటిష్టమైన నియంత్రణ

image

ప్రశాంత ఎన్నికల కోసం.. పటిష్టమైన నియంత్రణ చేస్తున్నామని, కడప కలెక్టరేట్ లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నుంచి పకడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నట్లు కంట్రోల్ రూమ్ అధికారి సూర్యసాయి ప్రవీణ్ చంద్ పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘన సహితమైన 17,517 (పబ్లిక్), 12,532 (ప్రైవేటు) అంశాలపై చర్యలు తీసుకున్నామన్నారు. రూ.80వేలు నగదు, రూ.14,76,830 విలువైన లిక్కర్, ఇతర సామగ్రి సీజ్ చేసినట్లు తెలిపారు.

News March 23, 2024

ప్రకాశం: ఏప్రిల్ 18 నుంచి నామినేషన్లు: ఎన్నికల అధికారి

image

ఏప్రిల్ 18 నుంచి జరిగే నామినేషన్లు జరగనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ట్రైల్ రన్ నిర్వహించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రత్యేక అధికారుల నియామకం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

News March 23, 2024

27వ తేదీ నుంచి పిఠాపురంలో పవన్ ఎన్నికల ప్రచారం

image

ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజులపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. వారాహి వాహనంపై పర్యటన ఉండేలా ఏర్పాట్లకు సిద్ధం కావాలన్నారు. టూర్ మేనేజ్మెంట్, టీం కన్వీనర్లు, కో కన్వీనర్లతో ఎన్నికల ప్రచారంపై చర్చించారు. ఈ మేరకు గొల్లప్రోలులో అనుమతి సైతం తీసుకున్నారు.

News March 22, 2024

జిల్లాలో పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

image

పది పరీక్షల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా తెలిపారు. జిల్లాలో మొత్తం 151 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా గణితం పరీక్షకు 21,539 మంది విద్యార్థులకు గానూ 391 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 30 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని డీఈఓ తెలిపారు.