India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన నంద్యాల వరదరాజులరెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని మండలం కామనూరుకు చెందిన యువకులు అహోబిలం క్షేత్రంలోని నరసింహ స్వామి సన్నిధిలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. కామనూరు చెందిన మల్లికార్జున్ రెడ్డి, సునీల్ కుమార్, సురేంద్ర యాదవ్, దస్తగిరి యాదవ్, శివచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో పూజలు చేశారు.
ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని, పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఎన్నికల జాబితా రూపకల్పన, సవరణ ప్రక్రియకు సంబంధించి అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శకం చేశారన్నారు. వివిధ మార్గాల్లో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.
విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ‘X’ లో చేసిన ఓ ట్వీట్కు అతని అభిమాని ‘అన్నా నీకు టిక్కెట్ రానందుకు ప్రతి కార్యకర్త బాధపడ్డాడు. భవిష్యత్తులో మీకు మంచి పదవి రావాలని కోరుకుంటున్నాను. బాబు గారు సరైన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అన్న’ అంటూ కామెంట్ చేశాడు. దీనికి నాగార్జున ‘164లో భాగం కాలేకపోయాను అన్న బాధ నాకు కూడా ఉంది బ్రదర్’ అంటూ రిప్లే ఇచ్చారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ పరాజయం చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ శనివారం సురుటుపల్లి ఆలయ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఏవీఎం బాలాజీ రెడ్డి తెలిపారు. తనతో పాటు పాలకమండలి సభ్యులు సైతం రాజీనామా చేయనున్నారని తెలిపారు. ఆలయ ఛైర్మన్గా పనిచేసిన పదవీకాలంలో తనకు సహకరించిన రాజకీయ ప్రతినిధులకు, ఆలయ సిబ్బందికి, అధికారులకు, ధన్యవాదాలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్తో సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసంలో ఈ మర్యాదపూర్వక భేటీ జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించిన లోకేశ్కు సోమిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లిలో కాకాణిని ఓడించిన సోమిరెడ్డితో పాటు తండ్రి విజయంలో కీలకపాత్ర పోషించిన రాజగోపాల్ రెడ్డిని లోకేశ్ అభినందించారు.
విభజన సందర్భంగా ప్రకటించిన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికైనా ఏర్పాటయ్యేనా.. అని ఏపీసీసీ మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్లుంది కడప జిల్లాలోని నిరుద్యోగ యువత పరిస్థితి అన్నారు. నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలన్న సత్సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2014, సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మంజూరయిందన్నారు.
మే 16వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలను నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు శుక్రవారం ప్రకటించారు. 16వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు.. తదుపరి 48 గంటల వరకు ఈ నియమావళి అమలులో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెక్షన్ 144 అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రక్రియను సజావుగా కొనసాగేందుకు ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
టీటీడీని అప్రతిష్ఠ పాలు చేసిన ఈఓ ధర్మారెడ్డికి శిక్ష తప్పదని టీడీపీ నేత వినుకొండ సుబ్రహ్మణ్యం అన్నారు. తిరుపతి ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో జగన్ రెడ్డి తన సామాజికవర్గ అధికారులను కీలక స్థానాల్లో నియమించారని చెప్పారు. అవినీతికి పాల్పడటానికి జగన్ ఇలా చేశారని ఆరోపించారు. అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నాయకులు మురళీకృష్ణ, వినుకొండ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు.
సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణలో ఉపయోగించిన ఈవీఎం, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతతో గోదాములో భద్రపరిచినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్ డిల్లీరావు వెల్లడించారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయినందున.. గొల్లపూడిలోని గోదాములో ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరిచి శుక్రవారం సీల్ వేశారు.
భారత రక్షణ మంత్రికి మాజీ సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ జి. సతీష్ రెడ్డికి ఇస్రో ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ జీవితకాల సభ్యత్వంతో సత్కరించింది. అహ్మదాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్, అసోసియేట్ డైరెక్టర్ సింగ్ తదితర శాస్త్రవేత్తల బృందం సతీష్ రెడ్డి సేవలను ప్రశంసించారు.
Sorry, no posts matched your criteria.