India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎడ్సెట్-24 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని పరిశీలకులు ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలోని సీతం ఇంజినీరింగ్ కళాశాల, అయాన్ డిజిటల్ జోన్, ఎంవీజీఆర్ కళాశాల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని, ఉ 9 గంటల నుంచి 11 వరకు జరుగుతుందని, 850 మంది పరీక్ష రాస్తున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లలో నిర్దేశించిన విధంగా అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు.
నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం గుంటూరు పార్టీ కార్యాలయంలో సత్యవేడు కూటమి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతూ ‘మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను’ అంటూ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని నాయకులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదిమూలానికి సూచించారు.
అనంతపురం JNTU ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు(ఎంఓఓసీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కేశవ రెడ్డి, సీఈ చంద్రమోహన్రెడ్డి తెలిపారు. మే నెలలో తృతీయ సంవత్సరం 2వ సెమిస్టర్, నాల్గవ సంవత్సరం 1వ సెమిస్టర్ (ఆర్20) ఎంఓఓసీ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించారు. ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రతినిధులు గురువారం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సత్కరించి అభినందించారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెడతానన్నారు. ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్కు రాజకీయాలు కలిసిరాలేదనడానికి తాజా ఓటమి బలం చేకూరుస్తోంది. తొలిసారి 2009లో కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి పరాజయం పొందారు. తాజా ఎన్నికల్లో YCP నుంచి బరిలో నిలవగా..37.06 శాతం ఓటింగ్తో మళ్లీ ఓటమి తప్పలేదు. ఈయన మొత్తం 4 సార్లు పోటీ చేయగా.. 3 పార్టీల నుంచి బరిలో నిలవడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్ సెట్ కన్వీనర్ టీవీ కృష్ణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. నిర్దిష్ట సమయానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు అనురాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన 60 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అవకాశం ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు శ్రీకాకుళంలో 80 అడుగుల రోడ్డులో గల స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలని సూచించారు.
తణుకు నియోజకవర్గంలో కూటమికి భారీగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్లు 2,34,575 ఉండగా.. 1,93,046 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 82.16 శాతం పోలింగ్ నమోదైంది. కాగా TDPకి 66.39 శాతం ఓట్లు రాగా.. వైసీపీ 29.52 శాతానికి పరిమితమైంది. వెరసి ఇక్కడ గెలుపొందిన కూటమి MLA అభ్యర్థి ఆరిమిల్లి మెజారిటీ పరంగా రాష్ట్రంలోనే 6వ స్థానంలో జిల్లాలో మొదటిస్థానంలో నిలిచారు. 72121 ఓట్ల మెజారిటీ వచ్చిన విషయం తెలిసిందే.
నూజివీడులో నిన్న <<13390738>>కత్తిపోట్ల ఘటన<<>> కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు.. నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయి, సుధీర్ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్ వచ్చి గిరీష్ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.
ఎన్నికల్లో ఫలితాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. గురువారం పిఠాపురం రాజుగారి కోటలోని వైసీపీ కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన YS.జగన్కు ధన్యవాదాలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.