Andhra Pradesh

News March 24, 2024

ఏలూరు జిల్లాలో ముగ్గురు వాలంటీర్ల తొలగింపు

image

ఎన్నికల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఇద్దరు మహిళా వాలంటీర్లను, ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మరో వాలంటర్‌ను విధుల నుండి తొలగించామని తెలిపారు.

News March 24, 2024

చిత్తూరు : కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన

image

చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో కేంద్ర బలగాల కవాతు ప్రదర్శన నిర్వహించారు. వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్సై షేక్షావల్లి, టూ టౌన్ సిఐ ఉలసయ్య , ఎస్సై ప్రసాద్ పోలీసు సిబ్బంది నగరంలోని పలు ప్రధాన క్రీడలలో కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల్లో గొడవలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News March 24, 2024

కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల గ్రీవెన్స్ కేంద్రం ఏర్పాటు

image

అనకాపల్లి జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఎన్నికల గ్రీవెన్స్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కమాండ్ కంట్రోల్ కేంద్రం నోడల్ అధికారి, మత్సశాఖ డి.డి పి.ప్రసాదు తెలిపారు. అలాగే ఇప్పటికే అందుబాటులో వున్న టోల్ ఫ్రీ నం.1950 కూడా అందుబాటులో వుంటుందని చెప్పారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి గ్రీవెన్స్ తెలియజేయడానికి 24 గంటలు అందుబాటులో వుంటుందని తెలిపారు.

News March 24, 2024

నెల్లూరు: గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కన్వీనర్ జి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గండిపాలెం(బాలురు), నెల్లూరు(బాలురు), ఆత్మకూరు(బాలికలు), తుమ్మలపెంట (బాలికలు) లో 5 వ తరగతి, 6,7,8 తరగతులలో మిగిలిన ఉన్న ఖాళీలభర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీలోపు https://aprs.apcfss.in లో దరఖాస్తుచేసుకోవాలన్నారు.

News March 24, 2024

ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా శనివారం గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో, భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిరంగిపురంలో వీవీ ప్యాట్‌లను కూడా పరిశీలించారు.

News March 24, 2024

కోనసీమ: ‘ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి’

image

ఎన్నికలలో విజయమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని అమలాపురం ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు పిలుపు నిచ్చారు. సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం గ్రామంలో శనివారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయాలని సూచించారు.

News March 23, 2024

విశాఖ: 24 నుంచి ఐపీఎల్ టికెట్లు విక్రయాలు

image

విశాఖ వైఎస్సార్ స్టేడియంలో ఈనెల 31, వచ్చేనెల 3న నిర్వహించనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు టికెట్లను ఈనెల 24 నుంచి ఆన్ లైన్‌లో విక్రయించనున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తెలిపింది. 27 నుంచి పేటీఎం, పేటీఎం ఇన్సైడర్ ఢిల్లీ క్యాపిటల్స్ వెబ్సైట్లో ద్వారా ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. పీఎం పాలెం స్టేడియం బి గ్రౌండ్, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో రెడీమ్ చేసుకోవచ్చునని చెప్పింది.

News March 23, 2024

అల్లవరం: వడదెబ్బతో టాటా ఉద్యోగి మృతి 

image

అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ అన్‌షోర్ టెర్మినల్‌లో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటరమణారావు(55) శనివారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబీకులు పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. టాటా సంస్థలో స్టోర్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న రమణారావు కి.మీ దూరం నడిచి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్నారు. బెండమూర్లంక పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందారన్నారు.

News March 23, 2024

కోనసీమ: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

ఆలమూరు మండలం జొన్నాడలో అనంతపురం జిల్లాకు చెందిన ఊదపల్లి రమేష్ బాబు (45) శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీనునాయక్ తెలిపారు. ఆలమూరులో నివాసముంటున్న సోదరుడు రామకృష్ణ ఇంటికి గత నెల 19వ తేదీన రమేష్ బాబు డబ్బుల కోసం వచ్చాడన్నారు. చెడు వ్యసనాలకు, మద్యానికి బానిస కావడం, అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.

News March 23, 2024

పలాస: బొడ్డపాడు ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

image

బొడ్డపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పోతనపల్లి సరోజవర్మ విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకులు జి.వి.చిట్టి రాజు తెలిపారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. దీంతో అతని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.