Andhra Pradesh

News June 5, 2024

చిత్తూరులో బుల్లెట్ సురేశ్ రాజీనామా

image

మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి బుల్లెట్ సురేశ్ రాజీనామా చేశారు. చిత్తూరుకు చెందిన ఆయన మొదటి రెండేళ్లు ఆ పదవిలో ఉన్నారు. ఇటీవల మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. నిన్న టీడీపీ గెలవడంతో రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీకి పంపించారు. నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో పలువురు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News June 5, 2024

కడప జిల్లాలో అత్యల్ప, అత్యధిక మెజార్టీలు వీరికే

image

ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 7 స్థానాల్లో కూటమి, 3 స్థానాల్లో వైసీపీ గెలిచింది. వీరిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (61687) అత్యధిక మెజార్టీ ఓట్లు లభిస్తే.. రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి(2495) అత్యల్ప మెజార్టీ ఓట్లతో గెలిచారు. జగన్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కాగా.. మండిపల్లికి ఇది మొదటి గెలుపు.

News June 5, 2024

పవన్‌ను కలిసిన ఉమ్మడి ప.గో. జనసేన MLAలు

image

గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన MLAలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు విజయం సాధించిన వారందరినీ అభినందించారు.

News June 5, 2024

నరసరావుపేటలో పనిచేయని నెల్లూరు సెంటిమెంట్

image

నరసరావుపేట లోక్ సభ ఎన్నికలలో ఈసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేయలేదు. 1999, 2004లో నెల్లూరుకు చెందిన నేదురమల్లి జనార్దన్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి నరసరావుపేట నుంచి ఎంపీలుగా గెలిచారు. అదే సెంటిమెంట్‌తో నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ అభ్యర్థిగా రంగంలోనికి దించింది. అయితే సిట్టింగ్ ఎంపీగా ఉన్న కృష్ణ దేవరాయలు ఈ దఫా ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరోసారి విజయం సాధించారు.

News June 5, 2024

నంద్యాల: బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి?

image

ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక నేత TDP నేతగా బీసీ జనార్దన్ రెడ్డి పేరొందారు. 2014-19 వరకు అప్పటి TDP ప్రభుత్వంలో ఆయన తొలిసారి బనగానపల్లె MLAగా గెలుపొందారు. 2019లో ఓటమిని చవిచూసిన ఆయన.. 2024లో అదే స్థానం నుంచి మరోసారి MLAగా గెలిచారు. దీంతో ఈసారి CM చంద్రబాబు కేబినెట్‌లో బీసీ జనార్దన్ రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని TDP శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

News June 5, 2024

ప్రకాశం: టీడీపీ ఓటమి.. కార్యకర్తకు గుండెపోటు

image

యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకొని దోర్నాల మండలం రామచంద్రకోట గ్రామంలో టీడీపీ కార్యకర్త దర్శనం దేవయ్య బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. కష్టపడి పనిచేసిన ఎరిక్షన్ బాబు ఓటమిని దేవయ్య జీర్ణించుకోలేక పోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. దేవయ్యకు పలువురు టీడీపీ నాయకులు నివాళులు అర్పించారు.

News June 5, 2024

ప.గో.: మహిళలకు దక్కని అధికారం

image

ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో ప్రధాన పార్టీల నుంచి నలుగురు పోటీచేయగా అందరూ ఓడిపోయారు.
☛ అసెంబ్లీ స్థానం
✦ పోలవరంలో వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి
✦ గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఓడిపోయారు.
☛ పార్లమెంట్
✦ ఏలూరులో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కె.లావణ్య 20826ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు.
✦నరసాపురంలో వైసీపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల 4,30,541 ఓట్లతో 2వ స్థానంలో నిలిచింది.

News June 5, 2024

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది: ఎస్పీ

image

శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ శాఖ సిబ్బంది సమిష్టిగా పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించిన జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయడం హర్షనీయమన్నారు.

News June 5, 2024

సిరిపురం జంక్షన్‌లో స్టాపర్లు తొలగించాలని నిరసన

image

విశాఖ సిరిపురం టైక్వాన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణాలకు అనుకూలంగా స్టాప్‌బోర్డులను ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. వారే స్వయంగా వీటిని తొలగించడానికి ప్రయత్నించారు. ఈలోపు అక్కడకు పోలీసులు చేరుకున్నారు. కాగా..సిరిపురం నుంచి రేసపువానిపాలెం వైపు వెళ్లే మార్గానికి మధ్యలో స్టాపర్లను గతంలో ఏర్పాటు చేశారు.

News June 5, 2024

పామర్రు: నాడు తండ్రిని ఓడించారు.. నేడు కొడుకును గెలిపించారు

image

2009లో ఏర్పడ్డ పామర్రు నియోజకవర్గంలో 2024లో తొలిసారి టీడీపీ గెలిచింది. గత 3 ఎన్నికల్లో ఇక్కడ ఓడిన టీడీపీకి తాజా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా తొలి విజయాన్ని అందించారు. 2014లో పామర్రులో టీడీపీ తరపున పోటీ చేసిన వర్ల కుమార్ రాజా తండ్రి రామయ్య 1,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు రామయ్యను ఓడించిన పామర్రు ఓటర్లు.. నేడు అతని కుమారుడు కుమార్ రాజాను 29,690 ఓట్ల మెజారిటీతో గెలిపించారు.