Andhra Pradesh

News September 25, 2024

ఎర్రగుంట్ల: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

image

ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం రాజగోపాల్ రెడ్డి అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని శ్రీరాములు పేటకు చెందిన వ్యక్తిగా ఇతనిని గుర్తించారు. మృతుడు ప్రొద్దుటూరు శ్రీరామ్ ఫైనాన్స్‌లో రికవరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతికి గల వివరాలు తెలియాల్సిఉంది.

News September 25, 2024

భీమవరం: నూతన కార్పొరేషన్ ఛైర్మన్లతో చంద్రబాబు భేటీ

image

జిల్లాలోని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లతో బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వంలో పదవి అనేది ఒక బాధ్యత. మనలో ఎక్కడా అహంకారం కనిపించకూడదన్నారు. ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులు అని గుర్తు పెట్టుకోవాలని వారికి సూచించారు. బాధ్యతగా పనిచేయాలన్నారు.

News September 25, 2024

SVU : బీ.ఫార్మసీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో (B.Pharmacy) బీఫార్మసీ ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News September 25, 2024

కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా కృష్ణకుమారి

image

ప్రభుత్వ సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఎం.కృష్ణ కుమారి నియమితులయ్యారు. విశాఖపట్నంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ షాన్ మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలు సూచనలు చేశారు.

News September 25, 2024

గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా?: మాజీ ఎమ్మెల్యే అనంత

image

‘గ్రామాలలోని గ్రూపు తగాదాలను పార్టీలకు ఆపాదిస్తారా’ అని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. రాముల వారి రథం దగ్ధం ఘటన బాధాకరమని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనను వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అధికార పార్టీకి జిల్లా ఎస్పీ ఊడిగం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.

News September 25, 2024

శ్రీకాకుళం ఘటనపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి

image

శ్రీకాకుళం జిల్లా పాతర్లపల్లి హైస్కూల్లో జరిగిన ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘వైసీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి విద్యార్థి కృష్ణంరాజు మృతి, మరో విద్యార్థి గాయపడటం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పాఠశాలల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం’ అని ఆయన ట్వీట్ చేశారు.

News September 25, 2024

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబు

image

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా అంబటి రాంబాబును నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా మందపాటి శేషగిరిరావు ఉన్నారు. కాగా గుంటూరు జిల్లా వైసీపీ ముఖ్యనేతలతో జగన్ తాడేపల్లిలో నేడు సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

News September 25, 2024

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల YCP నూతన అధ్యక్షులు వీరే

image

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ నాయకులతో బుధవారం మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం కృష్ణా జిల్లాకు పేర్నినానిని, ఎన్టీఆర్ జిల్లాకు దేవినేని అవినాశ్‌ను.. జగన్ వైసీపీ జిల్లా అధ్యక్షులుగా నియమించారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

News September 25, 2024

VZM: ఘాటెక్కిన ఉల్లి.. కిలో రూ.70కి పైనే

image

విజయనగరం జిల్లాలో ఉల్లి ధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 పలుకుతున్నాయి. దసరా సమీపిస్తుండగా పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పక్షం రోజుల నుంచి క్రమంగా ఉల్లి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. నెల క్రితం కిలో సుమారు రూ.35 లోపే ఉండేవి. పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

News September 25, 2024

శ్రీకాకుళం జిల్లాలో విషాదం

image

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. రణస్థలం మండలంలోని పాతర్లపల్లి జడ్పీ పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థి మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.