Andhra Pradesh

News June 5, 2024

ఉమ్మడి కృష్ణాలో కూటమి క్లీన్ స్వీప్

image

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 16 మంది MLA అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. కేశినేని చిన్నికి 2,82,085, బాలశౌరికి 2,16,938 మెజార్టీ వచ్చింది. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసిన మాజీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి 47,032 మెజార్టీతో గెలిచారు.

News June 5, 2024

ప.గో.: పోలవరం టెన్షన్.. టెన్షన్

image

పోలవరం ఓట్ల లెక్కింపులో వైసీపీ, కూటమి అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది. తొలిరౌండ్లో ఆధిక్యం కనబర్చిన వైసీపీ అభ్యర్థి రాజ్యలక్ష్మి తిరిగి 4వ రౌండులో ఆధిక్యం అందిపుచ్చుకున్నారు. ఆ తర్వాత రౌండ్లలో జనసేన అభ్యర్థి పోలవరం బాలరాజు జోరందుకోగా 8, 9, 10, 11 రౌండ్లలో తిరిగి వైసీపీ అభ్యర్థి ఆధిక్యతను నిలుపుకొనే ప్రయత్నం చేశారు. 14- 20వ రౌండ్ వరకు బాలరాజు మళ్లీ జోరు చూపి 7935 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

News June 5, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో నోటాకు వేలల్లో ఓట్లు

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు కూడా వేలల్లో ఓట్లు వచ్చాయి. పాలకొల్లులో నోటాకు 900 ఓట్లు, నరసాపురం నియోజకవర్గంలో 1,216, పోలవరంలో 5,172, చింతలపూడిలో 4,121, ఉంగుటూరులో 2,088, దెందులూరులో 1,713, ఆచంటలో 1,673, ఉండిలో 1,670, భీమవరంలో 1,210, ఏలూరులో 1,212, తణుకులో 1,722, తాడేపల్లిగూడెం 1,522 ఓట్లు నోటాకు దక్కాయి.

News June 5, 2024

విజయనగరం: అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య

image

అన్న చేతిలో తమ్ముడు దారుణ హత్యకు గురైన ఘటన సీతానగరం మండలంలో తీవ్ర కలకలం రేపింది. రూరల్ సీఐ రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదభోగిలికి చెందిన గుజ్జల రవీంద్ర, హేమంత్ అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం వారి మధ్య గొడవ రావడంతో హేమంత్‌ని అన్న రవీంద్ర కత్తెరతో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు.

News June 5, 2024

ఫలించిన ‘శింగనమల’ సెంటిమెంట్.. ఉరవకొండ బద్దలు

image

రాష్ట్ర రాజీకీయాల్లో శింగనమల నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుంది. 1978 నుంచి వస్తున్న ఈ సెంటిమెంటును టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి గెలిచి నిరూపించారు. మరోవైపు ఉరవకొండలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటుందని.. 20 ఏళ్లగా వస్తున్న సెంటిమెంటును పయ్యావుల కేశవ్ మరోసారి గెలిచి దానిని రూపుమాపారు.

News June 5, 2024

కర్నూలు: ముగ్గురు అన్నదమ్ముల పోటీ.. ఒక్కరే గెలుపు

image

రాంపురం సోదరులుగా పిలువబడే ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులకు ఈ ఎన్నికల్లో పరాభవం ఎదురైంది. గత ఎన్నికల్లో ఆదోని, మంత్రాలయం, అనంతపురం జిల్లా గుంతకల్లులో వైసీపీ నుంచి పోటీ చేసి వై.సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకటరామిరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ అదే పార్టీ, అవే స్థానాల్లో పోటీకి దిగారు. వీరిలో మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి ఒక్కరే గెలవగా.. వెంటకరామిరెడ్డి, సాయిప్రసాద్ రెడ్డి ఓటమి చెందారు.

News June 5, 2024

కందుకూరును ప్రకాశంలో కలుపుతా: ఇంటూరి

image

కందుకూరు టీడీపీ నుంచి గెలిచిన అభ్యర్థి సంచలన ప్రకటన చేశారు. ‘వైసీపీ ప్రభుత్వం కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి అన్యాయం చేసింది. దానిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపడానికి ప్రయత్నం చేస్తా. అలాగే నారా లోకేశ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా’ అని కందుకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు మళ్లీ ప్రకాశం జిల్లాలో కలవడంపై మీ అభిప్రాయం ఏంటి?

News June 5, 2024

కడప: అతిచిన్న ఎమ్మెల్యే.. అతిపెద్ద ఎమ్మెల్యే

image

కడప జిల్లాలో కూటమి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. జిల్లాలో కూటమికి 7 స్థానాలు, YCPకి 3స్థానాలు వచ్చాయి. వీరిలో కోడూరు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన అరవ శ్రీధర్ జిల్లాలో అతి చిన్న ఎమ్మెల్యే (27)గా నిలిచారు. అలాగే ప్రొద్దుటూరు TDP ఎమ్మెల్యేగా గెలిచిన నంద్యాల వరద రాజుల రెడ్డి అత్యంత పెద్ద వయస్సుగల ఎమ్మెల్యే (82)గా నిలిచారు. ఈయన రాష్ట్రంలో గెలుపొందిన ఎమ్మెల్యేల్లో అత్యంత పెద్ద వారు కావడం గమనార్హం.

News June 5, 2024

వంగా గీతకు తొలి ఓటమి ‘పిఠాపురమే’

image

వంగా గీత తొలిసారి ఓటమి చెందారు. 1983లో రాజకీయాల్లో ప్రవేశించి 1985-87 వరకు మహిళా శిశు రీజినల్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1995లో కొత్తపేట ZPTCగా గెలిచారు. 1995-2000 వరకు తూ.గో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. టీడీపీ హయాంలో రాజ్యసభ సభ్యురాలిగా పని చేశారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున MLAగా, 2019లో YCP నుంచి కాకినాడ MPగా గెలిచారు. ఈ ఎన్నికల్లో పవన్‌ చేతిలో 70,279 ఓట్ల తేడాతో ఓడారు.

News June 5, 2024

జిల్లా మారినా.. గుమ్మనూరుకే పట్టం

image

గుమ్మనూరు జయరామ్‌కు అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రజలు పట్టం కట్టారు. వైసీపీ అభ్యర్థిపై 6,826 ఓట్ల మెజార్టీ సాధించారు. 2019లో ఆలూరు నుంచి YCP తరఫున గెలిచి మంత్రిగా పనిచేశారు. 2024లో ఆలూరు నుంచి టికెట్ దక్కకపోవడంతో TDPలో చేరి గుంతకల్లు సీటు దక్కించుకున్నారు. గుమ్మనూరు బ్రదర్స్ నియోజవకవర్గంలో మకాం వేసి గెలుపునకు కష్టపడ్డారు. జిల్లా ఏదైనా విజయం తమదే అంటూ గుమ్మనూరు అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.