Andhra Pradesh

News September 25, 2024

కడప: నిర్లక్ష్యంగా వాహనం నడిపిన వారిపై SP సీరియస్

image

కడప నగరంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన యువకులపై<<14190089>> జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తీవ్రంగా స్పందించారు.<<>> యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కడప నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులను అప్రమత్తం చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం ఇద్దరు యువకులను కడప రిమ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి చర్యలపై ఉపేక్షించేది లేదన్నారు.

News September 25, 2024

విశాఖ: EVM గోదాములు తనిఖీ చేసిన కలెక్టర్

image

విశాఖ ప‌రిధిలోని చిన‌గ‌దిలి వ‌ద్ద‌ గల EVM గోదాముల‌ను క‌లెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అఖిల పక్షాల సమక్షంలో బుధవారం త‌నిఖీ చేశారు. త్రైమాసిక త‌నిఖీలో భాగంగా ఆయ‌న గోదాముల‌ను సంద‌ర్శించి అక్క‌డి పరిస్థితిని గ‌మ‌నించారు. వివిధ పార్టీల ప్రతినిధుల‌తో క‌లిసి గోదాముల లోప‌ల ఉన్న వీవీ ప్యాట్ల‌ను పరిశీలించారు.

News September 25, 2024

విజయవాడలో 25న హ్యాండ్ బాల్, చెస్ జట్ల ఎంపికలు

image

విజయవాడలోని కేబీఎన్ కళాశాలలోని క్రీడా మైదానంలో సెప్టెంబర్ 26న ఎస్జీఎఫ్ అండర్ 19 ఉమ్మడి కృష్ణా జిల్లా హ్యాండ్ బాల్, చెస్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అండర్ 19 ఎస్జీఎఫ్ కార్యదర్శి రతికాంత బుధవారం తెలిపారు. ఈ పోటీలకు 01-01-2006 తరువాత పుట్టినవారు అర్హులన్నారు. జిల్లాలో ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ, స్టడీ, ఆధార్ పత్రాలతో హాజరుకావాలన్నారు.

News September 25, 2024

ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక

image

నూజివీడు పట్టణంలోని విక్టోరియా టౌన్ హాల్ క్రీడా మైదానంలో బుధవారం హోరా హోరీగా ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం అండర్ 14,17 విభాగాలలో బాలికలు, బాలుర ఉమ్మడి కృష్ణాజిల్లా బాస్కెట్ బాల్ జట్లను ఎంపిక చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో ఈ జట్లు పాల్గొంటాయని సీనియర్ పీడీ, కోచ్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News September 25, 2024

ప్రభుత్వ లాంఛనాలతో మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు: ఆనం

image

మాజీ ఎంపీ, కావలి మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి బుధవారం సంతాపం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంత్యక్రియల ఏర్పాట్ల కోసం నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చర్చించారు.

News September 25, 2024

ఎమ్మెల్యే ఆదిమూలం తమ్ముడు గుండెపోటుతో మృతి

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమ్ముడు కోనేటి పాండురంగం (68) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. నారాయణవనం మండలం భీముని చెరువుకు చెందిన కోనేటి పాండురంగంను రెండు రోజులక్రితం అస్వస్థతకు గురికావడంతో తిరుపతిలోని స్వీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 25, 2024

ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకులు.. ప్రభుత్వం సీరియస్

image

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వినియోగంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దేవాదాయ శాఖ అంతర్గత విచారణలో భాగంగా జరిపిన 2 రోజుల తనిఖీల్లో రూ.15 లక్షల విలువైన నాసిరకం సరుకులను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. నిర్ణీత ప్రమాణాలు పాటించకపోవడంపై జరిపిన దర్యాప్తులో అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక సిద్ధమైనట్లు సమాచారం.

News September 25, 2024

బీసీలు కృష్ణయ్యను క్షమించరు: కారుమూరి

image

మాజీ ఎంపీ కృష్ణయ్యను బీసీలు క్షమించరని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. బుధవారం విశాఖ వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలతోనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలకు జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత పదవులలో వారికి అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోలా గురువులు, తదితరులు పాల్గొన

News September 25, 2024

ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై హైకోర్టు ఆదేశాలు

image

భీమిలీ ఎర్రమట్టి దిబ్బల్లో పనుల నిలిపేయాలని హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఇక్కడి తవ్వకాలపై ఉన్నత న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్, మత్స్యకార నాయకుడు శంకర్ ఇందుకు సంబంధించి పిల్ దాఖలు చేశారు. దిబ్బలు తవ్వుతున్న ప్రదేశం వారసత్వ సంపద పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సొసైటీ పనులు చేస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

image

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతికి సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. మాజీ ఎంపీ పార్వతమ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతిచెందడం బాధాకరమన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా విశేషసేవలందించారని కొనియాడారు. ఒంగోలు, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ స్థానిక ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు.