India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు భారీ మెజారిటీతో గెలుపొందారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యపై 1,02,822 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్లోనూ నాగరాజు ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
గుంటూరు టీడీపీ ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపొందారు. ఆయన తన ప్రత్యర్థి కిలారు వెంకట రోశయ్యపై 3,44,695 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయనకి 8,64,948 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 5,20,253 ఓట్లు వచ్చాయి. కాగా పెమ్మసాని అమెరికా నుంచి గుంటూరు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు. గుంటూరు జిల్లాలో టీడీపీ జెండా ఎగరవేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
కింజరాపు కుటుంబం నుండి తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు నాయకులు గెలుపొందారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీ, సోదరుడు అచ్చెన్న టెక్కలి అసెంబ్లీ, అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. 2019లో సైతం అచ్చెన్న, రామ్మోహన్తో పాటు రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుండి టీడీపీ తరపున గెలిచారు.
విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున లోక్సభకు పోటీ చేసిన ఎం.శ్రీభరత్ 5 లక్షల భారీ మెజారిటీకి చేరువులో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన 8,93,613 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 3,97,555 ఓట్లు సాధించారు. దీనితో ప్రస్తుతం భరత్ మెజారిటీ 4,96,058కి చేరింది. మరి కొద్దిసేపట్లో ఐదు లక్షల మెజారిటీని శ్రీభరత్ చేరుకోనున్నారు.
ఉమ్మడి తూ.గో జిల్లాలోని 19 నియోజకవర్గాలనూ కూటమి ఉడ్చేసింది. టీడీపీ-13, జనసేన-5, బీజేపీ-1 స్థానంలో విజయకేతనం ఎగురవేశాయి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీ కాకినాడ రూరల్ JSP అభ్యర్థి పంతం నానాజీ సాధించారు. పిఠాపురం నుంచి బరిలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు 70,279+ ఓట్ల మెజార్టీ రాగా.. నానాజీ 72,040+ ఓట్ల మెజార్టీతో పవన్ కంటే ముందంజలో ఉండటం గమనార్హం.
NOTE: మెజార్టీ కాస్త అటూ ఇటుగా మారొచ్చు.
తిరుపతి పార్లమెంట్ కౌంటింగ్ హోరాహోరీగా జరిగింది. తొలుత వైసీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి వెనుకబడ్డారు. తర్వాత ప్రతి రౌండ్లోనూ బీజేపీ వరప్రసాద్ వరప్రసాద్తో హోరాహోరీ తలపడ్డారు. చివరకు గురుమూర్తికి 6,32,228 ఓట్లు దక్కాయి. సమీప ప్రత్యర్థి వరప్రసాద్ రావు 6,17,659 ఓట్లు సాధించారు. ఈక్రమంలో గురుమూర్తి 14,569 ఓట్లతో గట్టెక్కారు. ఉప ఎన్నికలో ఆయన 2,30,572 ఓట్లతో గెలవడం విశేషం.
విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో ట్రాఫిక్ నిర్వహణ కారణంగా కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 1 నుంచి జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని తెలియచేస్తూ.. తాజాగా రైల్వే వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.
*నం.17329 హుబ్లీ- విజయవాడ
*నం.17330 విజయవాడ- హుబ్లీ
జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి
ప్రొద్దుటూరు – నంద్యాల వరద రాజుల రెడ్డి
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
బద్వేల్ – దాసరి సుధ
పులివెందుల- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్
కడప – రెడ్డప్పగారి మాధవి రెడ్డి
రాయచోటి- మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
రైల్వే కోడూరు – అరవ శ్రీధర్
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ (వైసీపీ)పై 2,16,938 ఓట్ల మెజార్టీ సాధించారు. బాలశౌరికి 7,12,149 ఓట్లు రాగా సింహాద్రి చంద్రశేఖర్ కు 4,95,211 ఓట్లు వచ్చాయి.
ఎమ్మిగనూరు నియోజకవర్గం ఓటర్ల మద్దతు టీడీపీకి లభించింది. మంగళవారం కర్నూలులోని రాయలసీమ యునివర్సిటీలో ఎమ్మిగనూరు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరిగింది. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి అఖండ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకపై 14,816 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు.
Sorry, no posts matched your criteria.