Andhra Pradesh

News March 18, 2024

విశాఖలో ‘టైగర్‌ ట్రయాంఫ్‌–2024’ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ మధ్య రక్షణ బంధం బలోపేతానికి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖలో టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 31 వరకూ రెండు ఫేజ్‌లలో విన్యాసాలు జరగనున్నాయి. యూఎస్‌కు చెందిన యూఎస్‌ఎస్‌ సోమర్‌సెట్‌ యుద్ధ నౌకతో పాటు ల్యాండింగ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, హెలికాఫ్టర్లు, యూఎస్‌ మెరైన్‌ కార్ప్స్, ఎమ్మార్కెడ్‌ దళాలు విశాఖకు చేరుకున్నాయి.

News March 18, 2024

VZM: సచివాలయ ఉద్యోగి మృతి.. ఎక్స్‌గ్రేషియా అందజేత

image

వేపాడ(M) <<12875448>>కుంపల్లి<<>>కి చెందిన డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్‌ తొలగిస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతిచెందాడు. బాధిత కుటుంబానికి కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుని మృతుడి భార్య హేమలతకు అందజేశారు.

News March 18, 2024

SVU: ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది నవంబర్‌లో బీ ఫార్మసీ (B.Pharmacy) రెండవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News March 18, 2024

కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణ: కలెక్టర్

image

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను వివిధ మాధ్యమాల ద్వారా స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఫిర్యాదులను సీ-విజిల్ యాప్‌లో కానీ, హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కానీ, కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7755కు కానీ, కాల్ సెంటర్ 08518-220125కు కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసే వారు డిఐపిఆర్ఓ_కర్నూలు ట్విట్టర్ అకౌంట్‌కు ఫిర్యాదును ట్యాగ్ చేయవచ్చన్నారు.

News March 18, 2024

అమలాపురం అల్లర్లు.. జీవోపై హైకోర్టు స్టే

image

అమలాపురం అల్లర్లపై కేసులు తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు ఈరోజు స్టే ఇచ్చింది. దళిత నాయకులు జంగా బాబురావుతో పాటు మరో ఆరుగురు నేతలు వేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2022లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటు విషయమై గొడవలు జరిగాయి. అప్పట్లో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు కొంతమంది నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 300 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 18, 2024

విశాఖ: ‘ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలి’

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రతి అంశంపైనా సంపూర్ణ అవగాహనతో విధులు సక్రమంగా నిర్వర్తించాలని అధికారులను జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. ఎన్నికల నిర్వాణపై జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్సులో ఏర్పాటు చేసిన వివిధ మానిటరింగ్ కేంద్రాలను సోమవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నెరవేర్చాలన్నారు.

News March 18, 2024

కర్నూలు: పీజీ సెమిస్టర్‌కు 90శాతం హాజరు

image

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షకు సోమవారం నాడు 90 శాతం విద్యార్థులు హాజరైనట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 558 మంది విద్యార్థులకు గాను.. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.

News March 18, 2024

శెట్టూరు మండలంలో చిరుత మృతి

image

శెట్టూరు మండలం ఐదుకల్లు అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందింది. వారం కిందట అనారోగ్యంతో మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు సోమవారం నిర్ధారించారు. వన్యప్రాణులకు తాగునీరు లేక మైదాన ప్రాంతంలోకి వచ్చి వ్యవసాయ పొలాల్లో నీళ్లు తాగి వెళ్తున్నాయని రైతులు చెప్తున్నారు. నీరు లేక చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి దాహంతో అనారోగ్యానికి గురవుతున్నాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

News March 18, 2024

యువతిని నమ్మించి మోసం.. యువకుడికి జైలు శిక్ష

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసిన కేసులో యువకుడికి జైలు శిక్షతో పాటు ఫైన్ విధిస్తూ ఏలూరు 5వ అదనపు జిల్లా కోర్టు కమ్ మహిళా కోర్టు జడ్జి జి.రాజేశ్వరి తీర్పునిచ్చారు. వారి వివరాల ప్రకారం.. 2019లో నరేష్ అనే యువకుడు పాలకొల్లుకు చెందిన యువతని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం నిరూపితం కావడంతో నరేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.2వేల ఫైన్ విధించారు.

News March 18, 2024

పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి: కలెక్టర్

image

సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్‌ను ఆమె తనిఖీ చేశారు.