India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించి 19 రౌండ్లు ఉండగా 15 రౌండ్ల లెక్క ముగిసింది. ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకట్రావుకు 70,000 ఓట్లు రాగా.. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణకి 60,084 ఓట్లు పడ్డాయి. దీంతో బొత్స 9,916 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.
విశాఖపట్నం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీ భరత్ భారీ ఆధిక్యతతో దూసుకు వెళుతున్నారు. ఇప్పటివరకు ఆయనకు 5,60,792 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీలక్ష్మికి 2,54,739 ఓట్లు లభించాయి. దీనితో శ్రీభరత్ 3,60,53 ఓట్ల భారీ మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సత్యా రెడ్డికి 18956 ఓట్లు లభించి 3వ స్థానంలో ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ఖాతా తెరిచే అవకాశం కనిపించడం లేదు. ఒక్కొక్కటిగా జిల్లా మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ వస్తోంది. మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ ఇప్పటికే 9 స్థానాల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన 10 స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొద్దిసేపట్లో వాటిపైనా క్లారిటీ రానుంది.
ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. సంతనూతలపాడు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బిఏన్ విజయ్ కుమార్ ఘన విజయం సాధించారు. తమ సమీప అభ్యర్థి, మంత్రి మేరుగా నాగార్జునపై 30,385 ఓట్ల తేడాతో గెలుపొందారు. సంతనూతలపాడును టీడీపీ కైవసం చేసుకోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించారు. కాల్వ శ్రీనివాసులు మొదటి రౌండ్ నుంచి ఆధిక్యత కనబరుస్తూ ముందంజలో దూసుకెళ్లారు. వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై 22 రౌండ్లు పూర్తయ్యేసరికి 37,268 ఓట్ల తేడాతో గెలుపొందారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇంకా కలపాల్సి ఉంది.
ప.గో. జిల్లా తణుకు నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 72121 భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో రాష్ట్రంలోనే ఇదే అత్యధికం కావడం విశేషం. ఆరిమిల్లికి మొత్తం ఓట్లు 1,29,547 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పార్టీ వైసీపీ నుంచి బరిలో నిలిచిన కారుమూరి వెంకట నాగేశ్వర రావుకు 57426 ఓట్లు వచ్చాయి.
చిలకలూరిపేటలో టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కావటి మనోహర్ నాయుడిపై 32,098 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులను మంగళవారం జిల్లా ఎస్పీ తుషార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ అనంతరం జిల్లాలోని పరిస్థితులను నాగార్జున యూనివర్సిటీలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం ఆవరణతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు.
నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్ రెడ్డిపై 11,950 మెజార్టీతో విజయం సాధించారు. ఫరూక్ గెలవడంతో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. దీంతో నంద్యాల పట్టణం పసుపు మయంగా మారింది.
గురజాల కూటమి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు సమీప ప్రత్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై 25వేల + ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1994 నుంచి రాజకీయాలలో ఉన్న యరపతినేని గురజాల కు ఒకే పార్టీ నుండి నుంచి ఏడు సార్లు పోటీ చేసి రికార్డ్ సృష్టించారు. తాజా గెలుపుతో ఆయన నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. దీంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Sorry, no posts matched your criteria.