Andhra Pradesh

News June 4, 2024

ఎనిమిదో రౌండ్ పూర్తి..బీకే పార్థసారథి ముందంజ

image

హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ఎనిమిదో రౌండ్ పూర్తైంది. 8వ రౌండ్ పూర్తయ్యేసరికి హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి బీకే.పార్థసారథి 47,143 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్‌లో టీడీపీకి 47,143 ఓట్లు, వైసీపీకి 28,990 ఓట్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News June 4, 2024

ప.గో.: 12 మంది కూటమి అభ్యర్థులు గెలుపు

image

ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఘన విజయం సాధించారు. 44,107 ఓట్లతో ప్రత్యర్థి వాసుబాబుపై గెలుపొందారు. కాగా ఉమ్మడి ప.గో.లోని 15 స్థానాల్లో 12 చోట్ల గెలిచినట్లయింది. ఇక పోలవరం, దెందులూరు, నిడదవోలు ఫలితాలు రావల్సి ఉంది.

News June 4, 2024

20 ఏళ్ల తర్వాత సర్వేపల్లిలో టీడీపీ గెలుపు

image

సర్వేపల్లి నియోజకవర్గంలో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జయకేతనం ఎగురవేసింది. 2004 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో వరుస ఓటములు ఎదుర్కొన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 16 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

News June 4, 2024

నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబు గెలుపు

image

నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద బాబు విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై గెలిచారు. 18 రౌండ్లు పూర్తి అయ్యేసరికి, 22 వేల + ఓట్ల ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News June 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీ ఆధిక్యంలో ఉన్నది వీరే..

image

శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. పలాసలో గౌతు శిరీష 32,087 ఓట్లు, టెక్కలిలో అచ్చెన్న 32,802 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్ పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాలలో ఓటమి బాటలో ఉన్నారు.

News June 4, 2024

పెద్దాపురంలో చినరాజప్ప ఘనవిజయం

image

సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిమ్మకాయల చిన రాజప్ప ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దవులూరి దొరబాబుపై 40,815 ఓట్ల మెజార్టీ సాధించారు. రాజప్ప విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

News June 4, 2024

పుత్తా చైతన్య రెడ్డి విజయం

image

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. ఈయనకు 93898 ఓట్లు పోలవ్వగా.. ఆయన ప్రత్యర్థి పి.రవీంద్రనాథ్ రెడ్డికి 69244 ఓట్లు వచ్చాయి. దీంతో పుత్తా 24654 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయన మెదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
NOTE: పోస్టల్ బ్యాలెట్ కలపకుండా

News June 4, 2024

శ్రీకాకుళంలో టీడీపీ విజయం

image

శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తన ప్రత్యర్థి అయిన వైపీపీ ధర్మాన ప్రసాద్ రావు మీద 50,593 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

News June 4, 2024

విశాఖ దక్షిణలో వంశీకృష్ణకు 61 వేల మెజారిటీ

image

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 16 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 17 రౌండ్లు ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటివరకు జరిపిన లెక్కింపులో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 92,587 ఓట్లు సాధించగా వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ 31024 ఓట్లు సాధించారు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ 61,563 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. వంశీకృష్ణ గెలుపు దాదాపుగా ఖరారైంది.

News June 4, 2024

పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కుమార్ విజయం

image

పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయం సాధించారు. మొత్తం 19 రౌండ్లు ముగిసే సరికి ఆయనకు 20,480 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రవీణ్.. తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. భాష్యం ప్రవీణ్ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.