Andhra Pradesh

News June 4, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీ ఆధిక్యంలో ఉన్నది వీరే..

image

శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతున్నారు. పలాసలో గౌతు శిరీష 32,087 ఓట్లు, టెక్కలిలో అచ్చెన్న 32,802 ఆధిక్యంలో ఉన్నారు. కాగా మాజీ మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాద్ పలాస, శ్రీకాకుళం నియోజకవర్గాలలో ఓటమి బాటలో ఉన్నారు.

News June 4, 2024

పెద్దాపురంలో చినరాజప్ప ఘనవిజయం

image

సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిమ్మకాయల చిన రాజప్ప ఘన విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దవులూరి దొరబాబుపై 40,815 ఓట్ల మెజార్టీ సాధించారు. రాజప్ప విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

News June 4, 2024

పుత్తా చైతన్య రెడ్డి విజయం

image

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు. ఈయనకు 93898 ఓట్లు పోలవ్వగా.. ఆయన ప్రత్యర్థి పి.రవీంద్రనాథ్ రెడ్డికి 69244 ఓట్లు వచ్చాయి. దీంతో పుత్తా 24654 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దీంతో ఆయన మెదటి సారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.
NOTE: పోస్టల్ బ్యాలెట్ కలపకుండా

News June 4, 2024

శ్రీకాకుళంలో టీడీపీ విజయం

image

శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తన ప్రత్యర్థి అయిన వైపీపీ ధర్మాన ప్రసాద్ రావు మీద 50,593 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

News June 4, 2024

విశాఖ దక్షిణలో వంశీకృష్ణకు 61 వేల మెజారిటీ

image

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 16 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 17 రౌండ్లు ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇప్పటివరకు జరిపిన లెక్కింపులో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 92,587 ఓట్లు సాధించగా వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ 31024 ఓట్లు సాధించారు. దీంతో వంశీకృష్ణ శ్రీనివాస్ 61,563 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. వంశీకృష్ణ గెలుపు దాదాపుగా ఖరారైంది.

News June 4, 2024

పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కుమార్ విజయం

image

పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయం సాధించారు. మొత్తం 19 రౌండ్లు ముగిసే సరికి ఆయనకు 20,480 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రవీణ్.. తొలి రౌండ్ నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. భాష్యం ప్రవీణ్ గెలుపుతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

News June 4, 2024

శ్రీకాకుళం టీడీపీ ఎంపీ ఆధిక్యం

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 13 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 4,56,076 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 2,60,369 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 1,95,707 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.

News June 4, 2024

జనసేనానికి 70,354 ఓట్ల మెజార్టీ

image

పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు మొత్తం 70,354 ఓట్ల మెజార్టీ లభించింది. మొత్తం 18 రౌండ్లకు గానూ 69,169 ఓట్లు మెజార్టీ లభించగా.. పోస్టల్ బ్యాలెట్లు 1671 వచ్చాయి. దీంతో మొత్తం పవన్ కళ్యాణ్‌కు 70,354 ఓట్ల మెజార్టీ లభించింది. తొలి రౌండ్ నుంచి పవన్‌ భారీ ఆధిక్యతతో దూసుకెళ్లగా.. వంగా గీత ఓటమిని చవిచూశారు.

News June 4, 2024

నెల్లూరు రూరల్‌లో టీడీపీ అధ్యిక్యం

image

నెల్లూరు రూరల్‌లో 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 13087 ఓట్ల ఆధ్యిక్యంలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి ఆదాల ప్రబాకర్ రెడ్డికి 28320 ఓట్లు రాగా.. కోటంరెడ్డికి 41407 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

కృష్ణా: రాష్ట్రంలో 2వ స్థానంలో కేశినేని చిన్ని

image

రాష్ట్రంలో టీడీపీ కూటమి తరఫున ఆధిక్యంలో ఉన్న ఎంపీ అభ్యర్థులలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని 2వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం చిన్ని 2,43,850 ఓట్ల ఆధిక్యంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా కూటమి ఎంపీ అభ్యర్థులలో నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ 2,56,235 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నారు.