Andhra Pradesh

News June 4, 2024

శ్రీకాకుళం: లక్ష మెజారిటీకి చేరువుగా రామ్మోహన్ నాయుడు

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 6 రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 2,08,852 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 1,18,857 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 89,995 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.

News June 4, 2024

ప.గో.లో ఆరుగురు కూటమి అభ్యర్థుల విజయం

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగిస్తున్నారు. మొత్తం 15 సీట్లలో ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడి, తణుకు స్థానాల్లో పాగా వేయగా.. నరసాపురంలోనూ జనసేన అభ్యర్థి 49096 భారీ మెజారిటీతో విజయం సాధించారు.

News June 4, 2024

రికార్డు బ్రేక్ దిశగా గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి

image

గుంటూరు జిల్లాలో టీడీపీ ఎంపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డులు బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన 195189 ఓట్ల ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 344736 ఓట్లు నమోదయ్యాయి. వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య 2,32,467 ఓట్లు నమోదయ్యాయి. కాగా గుంటూరు ఎంపీ పరిధిలో అన్ని నియోజకవర్గాలలో కూటమి స్పష్టమైన మెజారిటీ రావడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైనది.

News June 4, 2024

ప.గో.లో ఐదుగురు కూటమి అభ్యర్థుల గెలుపు

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరు, చింతలపూడిలో విజయం సాధించగా.. తాజాగా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ 71059 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

News June 4, 2024

9వ రౌండ్: చీపురుపల్లిలో వెనుకబడ్డ బొత్స

image

9వ రౌండ్ పూర్తయ్యేసరికి చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ మరింత వెనుకబడ్డారు. ఇక్కడ టీడీపీ నుంచి కళా వెంకట్రావుకి 39,328 ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణకి 35,051 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన 4,277 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

జనసేన బోణీ.. తొలి టికెట్, విజయం బత్తులదే

image

తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ బోణీ కొట్టింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన తొలి టికెట్ రాజానగరం. ఇక్కడ కూటమి తరఫున పోటీ చేసిన బత్తుల బలరామకృష్ణ 34,048 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తొలి టికెట్ ఈయనదే, విజయం ఈయనదే కావడం విశేషం

News June 4, 2024

సేఫ్ జోన్‌లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,764, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి 6,363 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో 36,207 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పుంగనూరులో 4, తంబళ్లపల్లెలో 10 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

News June 4, 2024

ఆరోసారి గెలచిన నంద్యాల వరదరాజులరెడ్డి

image

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడపీ జెండా పాతింది. 21353 ఓట్ల మెజారటీతో నంద్యాల వరదరాజుల రెడ్డి గెలిచారు. మొత్తం 1,04,272 ఓట్లు ఆయనకు పోలవగా.. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి 82,919 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన 6వ సారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

News June 4, 2024

ప.గో.: మరో కూటమి అభ్యర్థి విజయం

image

ప.గో. జిల్లాలో కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది. ఇప్పటికే పాలకొల్లు, భీమవరం, కొవ్వూరులో విజయం సాధించగా.. తాజాగా చింతలపూడిలో కూటమి అభ్యర్థి సొంగారోషన్ 26972 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

News June 4, 2024

భీమవరంలో పులపర్తి గెలుపు

image

భీమవరంలో కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 64037 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాగా ఉమ్మడి ప.గో.లో ఇప్పటివరకు కొవ్వూరు, పాలకొల్లులో కూటమి అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే.