Andhra Pradesh

News June 4, 2024

గెలుపు దిశగా నంద్యాల వరదరాజుల రెడ్డి

image

ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరద రాజుల రెడ్డి గెలుపు దిశగా వెళ్తున్నారు. ఇప్పటికి 18 రౌండ్‌ ముగిసేసరిగి 22వేల ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇక కేవలం రెండు రౌండ్లు ఉండటంతో ఆయన గెలుపు లాంచనమే అని తెలుస్తోంది.

News June 4, 2024

ప.గో.: మంత్రులంతా ఓటమి దిశగా

image

ఉమ్మడి ప.గో. జిల్లాలోని తాడేపల్లిగూడెం, కొవ్వూరు, తణుకు నియోజకవర్గాల నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మంత్రులుగా సేవలందించారు. కాగా తాజాగా ముగ్గురు ఓటమి దిశగా వెళ్తుండగా.. కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతోంది.

News June 4, 2024

శ్రీకాకుళం: ముందంజలో ఎంపీ అభ్యర్థి రామ్మోహన్

image

శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందంజలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ పరిధిలోని 4వ రౌండ్లకు రామ్మోహన్ నాయుడుకు 1,38,991 ఓట్లు పోలవ్వగా.. ఇక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్‌కు 79,423 ఓట్లు పడ్డాయి. దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 59,568 ఓట్ల మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.

News June 4, 2024

కృష్ణా జిల్లాలో కూటమి అభ్యర్థుల ఆధిక్యం వివరాలు

image

తిరువూరు: శ్రీనివాస్ 11902
పామర్రు: వర్ల కుమార్ రాజా 11709
నందిగామ: తంగిరాల సౌమ్య 5855
నూజివీడు: కొలుసు పార్థసారథి 2392
జగ్గయ్యపేట: శ్రీరామ్ తాతయ్య 13236
మైలవరం: వసంత కృష్ణప్రసాద్15606
గన్నవరం: వెంకట్రావు 2002
గుడివాడ: వెనిగండ్ల రాము 15668
పెనమలూరు: బోడె ప్రసాద్ 26785
అవనిగడ్డ: బుద్దప్రసాద్ 12864
కైకలూరు: కామినేని శ్రీనివాస్ 9484
పెడన: కృష్ణప్రసాద్ 11264
మచలీపట్నం : రవీంద్ర 15001

News June 4, 2024

పోలవరంలో మళ్లీ వైసీపీ ముందంజ

image

పోలవరంలో వైసీపీ, జనసేన మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. మొదటి 4 రౌండ్ల వరకు వైసీపీ ఆధిక్యం ప్రదర్శించగా.. అప్పటి నుంచి 8 రౌండ్ల వరకు జనసేన దూసుకెళ్లింది. తాజాగా 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి 45777 ఓట్లు సాధించి 453 ఓట్ల మెజారిటీతో ముందున్నారు.

News June 4, 2024

విజయం దిశగా విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్

image

విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేసిన ఎం.శ్రీభరత్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఇప్పటివరకు 2,36,967 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ 1,12,893 ఓట్లు సాధించారు. దీంతో శ్రీభరత్ 1,24,074 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో ముందుకు వెళుతున్నారు. ఆయన విజయం దాదాపుగా ఖరారు అయినట్లే.

News June 4, 2024

ప.గో.: 50 వేల మెజారిటీ దిశగా RRR

image

ఉండి నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 18 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా.. ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి. కాగా కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజు 81931 ఓట్లు సాధించి 39390 ఓట్ల మెజారిటీతో దూసుకెళ్తున్నారు. అయితే వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజుకు 42541 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్!

image

నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తోంది. పోటీ చేసిన అన్నీ చోట్ల టీడీపి ఆధిక్యంలో కొనసాగుతోంది. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 90 వేల మెజార్టీలో దూసుకుపోతున్నారు. కాగా.. 2019లో నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది.

News June 4, 2024

ఒంగోలు: ఆధిక్యంలో మాగుంట

image

ప్రకాశం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగుతోంది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆధిక్యంలో కొనసాగున్నారు. ప్రస్తుతం 8 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మాగుంట 13,869 ఓట్లతో లీడింగులో ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరి మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉన్నా ఫలితాలు పూర్తయ్యే వరకు ఎవరు గెలుస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది.

News June 4, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో 3 విజయాలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో కూటమి అభ్యర్థుల గెలుపులు తేలిపోతున్నాయి. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ (టీడీపీ) 65,400 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధించార. అనపర్తి నుంచి చివరి నిమిషంలో బీజేపీ టికెట్ దక్కించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు.