India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో జరగుతున్న సార్వత్రిక ఎన్నికల ఓట్లు కౌంటింగ్ సరళిని మంగళవారం మధ్యాహ్నం విశాఖ రేంజ్ DIG విశాల్ గున్ని సందర్శించారు. అనంతరం బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించి, కౌంటింగ్ జరగుతున్న తీరుపై అధికారులును అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం నందు ఆయన పర్యవేక్షించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఆయనకు భారీ భద్రత కల్పించేలా అధికారులు ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్నారు. కాగా ప్రస్తుతం 155 స్థానాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అటు టీడీపీ కేంద్ర కార్యాలయానికి, చంద్రబాబు నివాసానికి టీడీపీ కూటమి శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.
కమలాపురంలో టీడీపీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, తదితరులు పోటీలో ఉన్నారు.
➠ 8వ రౌండ్లో ఓట్లు ఇలా..
➢ చైతన్య రెడ్డి: 40562
➢ రవీంద్రనాథ్ రెడ్డి: 28244
➠ 8వ రౌండ్ ముగిసే సరికి పుట్టా చైతన్య రెడ్డి 12318 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు వచ్చిన ఓట్ల కంటే టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు వచ్చిన ఆధిక్యత అధికంగా ఉంది. ఏడో రౌండ్ ముగిసే సరికి వెలగపూడికి 47,410 ఓట్లు రాగా.. ఎంవీవీకి 22,821 ఓట్లు లభించాయి. దీంతో వెలగపూడి 24,589 ఓట్ల మెజారిటీతో దూసుకు వెళ్తున్నారు.
కడప ఎంపీ స్థానంపై ఉత్కంఠ పెరిగిపోయింది. ఇప్పటి వరకు 2,59,829 ఓట్ల వైఎస్ అవినాష్ రెడ్డికి పోలవ్వగా.. భూపేశ్ రెడ్డికి 2,26,373 ఓట్లతో వచ్చాయి. ఇక షర్మిలాకు 55,926 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు స్వల్ప మెజార్టీతో అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేన 6 చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా అన్నింటా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఒక్క పోలవరంలో తొలి 4 రౌండ్లలో వైసీపీ ఆధిక్యం ప్రదర్శించగా.. ఆ తర్వాత జనసేన పుంజుకుంది. అక్కడ ప్రస్తుతం 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. 1614 ఓట్ల మెజారిటీ నడుస్తోంది.
విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి షేక్ ఆసిఫ్సై 5149 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు 9 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం 62017 ఓట్లు రాగా.. 29338 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పీవీఎల్ నరసింహరాజుకు 32679 ఓట్లు వచ్చాయి.
విజయవాడ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్పై 18911 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఐదో రౌండ్ ముగిసేసరికి హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 10, 935 ఓట్లతో ముందంజలో ఉన్నారు. హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీ.ఎన్. దీపికపైన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.