India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని మంత్రి కొలుసు పార్థసారధి స్పష్టం చేశారు. శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ రైస్మిల్లును సంప్రదించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే జిల్లాలో ఇప్పటికే 7 లక్షల గోనెసంచులు అందుబాటులో ఉంచామన్నారు.
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సవరణలకు సంబంధించి సెప్టెంబరు నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను రెండు రోజులలోగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఆర్.శ్రీలత సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ నెల 29వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబరులో ఆమె సమీక్ష నిర్వహించారు.
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.
మడకశిర నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన ముఖ్య దేవాలయాలను సినీ దర్శకుడు ధనరాజ్ శుక్రవారం సందర్శించారు. హేమావతిలోని ఎంజీఆర్ సిద్దేశ్వరస్వామి టెంపుల్, రోళ్ళలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, రత్నగిరి కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయం, చెందకచర్ల ఆంజనేయస్వామి టెంపుల్, మడకశిరలోని పూజమ్మ, శివాలయం, తదితర ఆలయాలను సందర్శించి ధూప, దీప నైవేద్యాలను కానుకగా సమర్పించారు. ప్రజలందరూ సంతోషంగా జీవించాలని కోరారు.
నంద్యాల నందమూరి నగర్కు చెందిన మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయ్యారు. డెలివరీ అయిన 8 రోజులకు ఆరోగ్యం సరిగాలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు 14 రోజులు ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందించారు. అయితే ఆ మహిళ మృతి చెందారు. వైద్య సేవలకు రూ.3.30 లక్షల బిల్లు అయింది. డబ్బులు ఇస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. దీంతో ఆసుపత్రి ఎదుట బాధితులు నిరసన చేపట్టారు.
రాజకీయాలు అంటే ఇప్పటికే ప్రజల్లో ఒక చులకన భావంతో చూస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఒక ఉన్నత పదవిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించాలి కానీ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఒక వ్యక్తి యొక్క కుటుంబ విషయాలను, వ్యక్తిగత విచారణ వాడుకోవడం ఒక నీచమైన చర్య అంటూ Xలో పోస్ట్ చేశారు.
కర్నూలు: రైతులకు మేలు చేకూరే విధంగా పత్తిని కొనుగోలు చేసి రైతులకు చెల్లించాల్సిన మొత్తం వెంటనే చెల్లించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య CCI (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో DLP కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. పత్తి నాణ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.
బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం బోదవాడలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. దసరా సెలవులకు తాత గారి ఊరు వచ్చిన చిన్నారులు సాయంత్రం ఆడుకుంటూ ఇంటి వెనక ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కందుల బ్రహ్మారెడ్డి (8), కందుల సిద్ధార్థ రెడ్డి (6) మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని మార్కెట్ యార్డు వద్ద ఉరివేసుకుని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి రఫీక్(67) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గోరంట్ల మండలంలో ఓ భూ వివాదామే తమ తండ్రి మృతికి కారణమని మృతుడి కుమారులు రియాఫత్, హిదయాత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెనుకొండ పోలీసులు తెలిపారు.
వైఎస్సార్ జిల్లా పేరును మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. YCP ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కడప జిల్లా చారిత్రక నేపథ్యం, వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్..
Sorry, no posts matched your criteria.