India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున, క్షేత్రస్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.
నీటి కుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. కర్నూలు మండలం పసుపుల సమీపంలో నీటి కుంటలో పడి సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి శ్రీనివాసులు(17) మృతి చెందాడు. కళాశాలకు వెళ్లి ఇంటికి చేరకుండా నీటి కుంటలో శవమై తేలాడు. విద్యార్థి మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు తాలూకా పోలీసులు నలుగురు విద్యార్థులను విచారిస్తున్నారు.
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన పరీక్షా ఫీజును అక్టోబర్ 10వ తేదీలోపు చెల్లించాలని ఆర్ఐఓ వరప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో అక్టోబర్ 21వ తేదీ వరకు చెల్లించవచ్చునని, సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ నిర్ణీత తేదీలోపు పరీక్షా ఫీజులు చెల్లించాలని, ఈ విషయాన్ని అన్ని కళాశాలలు గమనించాల్సిందిగా కోరారు.
ఇంద్రకీలాద్రిపై సా.6.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు గంట పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. నివేదన, పంచ హారతుల నేపథ్యంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రోటోకాల్ మార్గంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున బయటి వ్యక్తులు వస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రోటోకాల్ గేట్కి ఎండోమెంట్ కమిషనర్ తాళం వేయించారు. మీడియా వారిని సైతం లోపలికి అనుమతించలేదు.
ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫారం-6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం-6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.
రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో సెప్టెంబర్ 27వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ప్రకటించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తిచేసిన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తిగల యువత తమ సర్టిఫికెట్లు, వాటి జీరాక్స్ కాపీలతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె సూచించారు.
కంచిలి(M) జలంతరకోట జంక్షన్ సమీపంలో హైవేపై బుధవారం రాత్రి జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కంటైనర్ డ్రైవర్ దాబాలో భోజనం చేశాడు. డబ్బులు చెల్లించే క్రమంలో హోటల్ ఓనర్ మహమ్మద్ హయాబ్తో అతనికి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హోటల్ యజమానితో పాటు మరో వ్యక్తి పై నుంచి డ్రైవర్ లారీని పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఎస్సై పారినాయుడు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ACBకి చిక్కారు. రవితేజ తన ఇంటికి సంబందించి సర్వే నంబర్ తప్పుగా ఉందని.. సర్వే చేసి సరైన రిపోర్టు ఇవ్వాలని ములగడ MRO ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్కు రూ.30 వేలు లంచం ఇవ్వాలని సర్వేయర్ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ నగేశ్ డిమాండ్ చేయడంతో ACBకి ఫిర్యాదు చేశాడు. గురువారం మహాత్ కాలనీ సచివాలయం వద్ద లంచం తీసుకుంటుండగా వీరిని పట్టుకున్నారు.
తుళ్లూరు: భూ సమీకరణ పథకంలో భూములను ఏపీ సీఆర్డీఏకు అప్పగించిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తున్నట్టు సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు గురువారం తెలిపారు. ఈ నెల26వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ జరుగుతుందన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను పంపిణీ చేయనున్నారు.
జీఎస్టీ పన్నుల తగ్గింపు గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు జీఎస్టీ గురించి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.