Andhra Pradesh

News September 25, 2024

వైసీపీకి రాజీనామా చేస్తున్నా: రెహమాన్

image

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఏ రహమాన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ హయాంలో విశాఖ-1 ఎమ్మెల్యేగా 1994లో గెలిచారు. 2001 నుంచి 2004 వరకు ఉడా ఛైర్మన్‌గా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన.. 2020 మార్చిలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. ఆయన మంత్రి లోకేశ్ లేదా మంత్రి ఫరుఖ్ సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ రాజకీయ నేపథ్యం ఇదే..

image

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో 1947 జూలై 27న జన్మించారు. 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో వివాహం జరిగింది. 1996 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

News September 25, 2024

కాకినాడ: ‘వైసీపీలోనే ఉంటా.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు’

image

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేనలోకి చేరుతున్నారన్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఆరోగ్య సమస్యల రీత్యా హైదరాబాద్‌లో ఉన్నానని, ఇలాంటి సమయంలో లేనిపోనివి ప్రచారం చేశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నాననే మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే పార్టీ నేతలను కలుస్తానని చెప్పారు.

News September 25, 2024

చిరుత జాడపై మంత్రి దుర్గేష్ ఆరా

image

కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రి కందులు దుర్గేష్ బుధవారం కడియపులంక నర్సరీ ప్రాంతానికి వెళ్లి చిరుత జాడపై ఫారెస్ట్ అధికారులను ఆరా తీశారు. నర్సరీ ప్రాంతాలలో చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News September 25, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

ఇచ్చాపురం, సోంపేట, పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు 2 రోజులపాటు వికారాబాద్(TG)లో స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. వికారాబాద్ సమీపంలోని కణ్హ శాంతివనంలో ఆధ్యాత్మిక అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నందున ఈ నెల 29, 30వ తేదీలలో నంబర్11020 భువనేశ్వర్- CST ముంబై మధ్య ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ వికారాబాద్‌లో ఆగుతుందన్నారు.

News September 25, 2024

విజయనగరం ప్రోహిబిషన్&ఎక్సైజ్ ESగా బీ.శ్రీనాథుడు

image

జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ESగా బీ.శ్రీనాథుడుని నియమిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. ఈయన ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా DEPOగా విధులు నిర్వహించారు. స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరోను ప్రభుత్వం రద్దు చేయడంతో ఎక్సైజ్ ఈఎస్‌గా ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో పార్వతీపురం ఏఈఎస్‌గా విధులు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.

News September 25, 2024

కడియంలో చిరుత.. వారికి సెలవు

image

కడియం నర్సరీ ప్రాంతంలో చిరుత అడుగు జాడలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా నేడు నర్సరీ కార్మికులకు నర్సరీ సంఘ సభ్యులు సెలవు ప్రకటించారు. ఆలమూరు మండలం గోదావరి తీరం వైపు చిరుత వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు.

News September 25, 2024

అన్నవరం ప్రసాదానికి నెయ్యి సరఫరాకు గడువు పూర్తి

image

అన్నవరం ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ అంశం రాష్ట్రంలో వివాదాస్పదం కావడంతో అన్నవరం సత్యదేవుని ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిపై ఆలయ ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది. ఇక్కడ ఏడాదికి 2 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో నెయ్యికి రైతు డెయిరీకి రూ.538.60 చెల్లిస్తున్నారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు నెల్లూరులో

image

ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ MLA మాగుంట పార్వతమ్మ నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహాన్ని నెల్లూరు జిల్లా సరస్వతినగర్‌లోని ఆమె స్వగృహానికి తీసుకెళ్లనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మాగుంట అభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు. 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News September 25, 2024

కోడూరు: నామినేటెడ్ పోస్టు వద్దంటూ సీఎంకు లేఖ

image

ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుడిగా ఇచ్చిన పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనని రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్, సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2019 ఎన్నికల్లో ఈయన కోడూరు నుంచి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.