India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కడప ఎంపీ స్థానంపై ఉత్కంఠ పెరిగిపోయింది. ఇప్పటి వరకు 2,59,829 ఓట్ల వైఎస్ అవినాష్ రెడ్డికి పోలవ్వగా.. భూపేశ్ రెడ్డికి 2,26,373 ఓట్లతో వచ్చాయి. ఇక షర్మిలాకు 55,926 ఓట్లు పడ్డాయి. ఇప్పటి వరకు స్వల్ప మెజార్టీతో అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేన 6 చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా అన్నింటా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఒక్క పోలవరంలో తొలి 4 రౌండ్లలో వైసీపీ ఆధిక్యం ప్రదర్శించగా.. ఆ తర్వాత జనసేన పుంజుకుంది. అక్కడ ప్రస్తుతం 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవగా.. 1614 ఓట్ల మెజారిటీ నడుస్తోంది.
విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి షేక్ ఆసిఫ్సై 5149 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
ఉండి నియోజకవర్గ కూటమి MLA అభ్యర్థి రఘురామకృష్ణరాజుకు 9 రౌండ్లు పూర్తయ్యేసరికి మొత్తం 62017 ఓట్లు రాగా.. 29338 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. కాగా ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న పీవీఎల్ నరసింహరాజుకు 32679 ఓట్లు వచ్చాయి.
విజయవాడ ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి దేవినేని అవినాశ్పై 18911 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
హిందూపురం బిట్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఐదో రౌండ్ ముగిసేసరికి హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 10, 935 ఓట్లతో ముందంజలో ఉన్నారు. హిందూపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీ.ఎన్. దీపికపైన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ముందంజలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజారిటీ దూసుకెళ్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంది. అలాగే తెనాలిలో జనసేన ముందంజలో ఉంది. అలాగే మూడు ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరుత్సాహంతో మునిగిపోయారు.
తిరుపతి జిల్లాలో అన్ని చోట్లా టీడీపీ హవా ఉన్నప్పటికీ.. సత్యవేడులో మాత్రం నువ్వానేనా అన్నట్లు ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం 8,184 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేశ్కు 7,246 ఓట్లు వచ్చాయి. టీడీపీ 938 ఓట్ల మెజార్టీతో ముందుకు కొనసాగుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి జేడీ రాజశేఖర్కు కేవలం 37 ఓట్లే వచ్చాయి.
ఉమ్మడి తూ.గో జిల్లాలో రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి బోణీ కొట్టారు. తొలి విజయం నమోదు చేశారు. 18వ రౌండ్ ముగిసేసరికి ఆయన 61,564 ఓట్లు ఆధిక్యంలో ఉన్నారు. ఈయన 10వసారి పోటీ చేయగా.. 7వ సారి MLAగా గెలిచారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. వైసీపీ అభ్యర్థి చెల్లుబోయినకు 60,102 ఓట్లు వచ్చాయి.
5 రౌండ్లు ముగిసేసరికి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు సిటీలో నారాయణ 7వేలు, రూరల్లో కోటంరెడ్డి 5వేలు పైచిలుకు, కావలిలో కావ్యకి 7000 పైచిలుకు, సర్వేపల్లిలో సోమిరెడ్డికి 1500పై మెజార్టీ, ఆత్మకూరులో విక్రం రెడ్డికి 1500 ఓట్ల ముందంజ, ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి 600 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. గూడూరులో సునీల్, వెంకటగిరిలో కురుగోండ్ల, పేటలో విజయశ్రీ లీడ్లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.