India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ డివిజన్ పరిధిలో నిర్వహణ పనులు జరుగుతున్నందున కింది రైళ్లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైళ్లు జూలై 14 వరకు రద్దు చేశామని, ప్రయాణికులు గమనించాలని రైల్వే శాఖ ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేసింది.
*నం.07464 విజయవాడ- గుంటూరు
*నం.07465 గుంటూరు- విజయవాడ
*నం.07976 గుంటూరు- విజయవాడ
సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు మరికొద్ది సేపట్లో తెలియనున్నాయి. ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు 9 మంది రిటర్నింగ్ అధికారులు, 77 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 492 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 582 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 397మంది మైక్రో అబ్జర్వర్లు, 439 మంది క్లాస్-4 ఉద్యోగులు మొత్తం 1996 మంది సిబ్బంది ఎటువంటి ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 3 పార్లమెంటు స్థానాలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 42 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని కాకినాడ, అమలాపురం పార్లమెంటు నుంచి 15 మంది వంతున మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ స్థానానికి 12 మంది పోటీలో నిలిచారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధికారులు ఏర్పాటు చేశారు. మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో జిల్లా ఎస్పీ తుషార్ యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు, సిబ్బంది పనితీరు తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద సిబ్బందికి సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోనికి పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలని ఆదేశించారు.
ఒంగోలుకు చెందిన వ్యక్తి కొత్తపల్లి జంక్షన్ పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుక నుంచి బైకుతో ఢీకొట్టాడు. దీంతో నిలం శివ (35)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు హైదరాబాదులో బేల్దారి మేస్త్రిగా పనిచేస్తూ.. నేడు తన స్వగ్రామమైన ఒంగోలుకు వస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. కొత్త బైకు తీసుకుని సొంతూరికి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తొలిఫలితం రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో రానుంది. కాగా అమలాపురంలో ఎంపీ నియోజకవర్గంలో ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. కాగా రాజమండ్రిలో కూటమి నుంచి పురందీశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గూడూరి ఉమాబాల, అటు అమలాపురంలో వైసీపీ నుంచి రాపాక శ్రీనివాస్, కూటమి నుంచి గంటి హరీష్ మాదుర్ బరిలో ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తొలిఫలితం రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో రానుంది. కాగా అమలాపురంలో ఎంపీ నియోజకవర్గంలో ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. కాగా రాజమండ్రిలో కూటమి నుంచి పురందీశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గూడూరి ఉమాబాల, అటు అమలాపురంలో వైసీపీ నుంచి రాపాక శ్రీనివాస్, కూటమి నుంచి గంటి హరీష్ మాదుర్ బరిలో ఉన్నారు.
అనంతపురం జిల్లాలో 8 అసెంబ్లీ, అనంతపురం పార్లమెంట్ నుంచి 134మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో అనంతపురం పార్లమెంట్ నుంచి 21మంది, 8 అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి 113మంది అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. జూన్ 4 జరగనున్న ఎన్నికల కౌంటింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఇప్పటికే అధికారులు కౌంటింగ్కు సర్వం సిద్ధం చేశారు. మరి కొన్ని గంటల్లో భవితవ్యం తెలనుంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా 254 మంది పోటీలో నిలిచారు. 2019 ఎన్నికల్లో 19 నియోజకవర్గాల పరిధిలో 223 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అత్యధికంగా కాకినాడ నగరం, గ్రామీణం, ప్రత్తిపాడు, ముమ్మిడివరం నియోజకవర్గాల నుంచి 15 మంది వంతున అభ్యర్థులు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల లెక్కింపుకు సర్వం సిద్ధం చేశారు. శ్రీకాకుళం 8 నియోజకవర్గాలో మొత్తం 86 మంది అభ్యర్థులు వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. ఇచ్ఛాపురం అసెంబ్లీకి 9 మంది, పలాస-10, టెక్కలి-7, పాతపట్నం-10, శ్రీకాకుళం-7, ఆమదాలవలస-13, ఎచ్చెర్ల-10 నరసన్నపేట-7 మంది పోటీ చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 13 మంది నిలిచారు. తొలుత ఆమదాలవలస, చివరగా పాతపట్నం ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.