Andhra Pradesh

News June 3, 2024

కడప: రేపు మద్యం దుకాణాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మంగళవారం కడప జిల్లాలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోపాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ సిబ్బంది గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచారని తెలిపారు.

News June 3, 2024

ఘోరం.. మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపేశాడు

image

గంగవరం మండలం నూగుమామిడిలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లి తలను గోడకు కొట్టడంతో ఆమె మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆదమ్మ(51) అకౌంట్‌లో డబ్బులు ఉండగా, అవి విత్‌డ్రా చేసి ఇవ్వాలని కొడుకు కృష్ణ ఆమెతో గొడకు దిగాడు. తల్లి ఒప్పుకోకపోవడంతో ఆమె బలంగా గోడకు నెట్టేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తాగుడుకు బానిసై తరచూ తల్లితో గొడవ పడుతూ ఉండేవాడని తెలిపారు.

News June 3, 2024

రేపు నెల్లూరులో ట్రాఫిక్ ఆంక్షలు

image

ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు టౌన్, రూరల్ పరిధిలలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని నెల్లూరు రూరల్ DSP పి.వీరాంజనేయ రెడ్డి పేర్కొన్నారు. ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. ప్రియదర్శిని కాలేజ్ మీదుగా కనుపర్తిపాడు వెళ్లే మార్గంలో వాహనాలకు అనుమత లేదన్నారు. గొలగమూడి దేవాలయానికి వెళ్లే భక్తులు కాకుటూరు మీదుగా వెళ్లాలని సూచించారు.

News June 3, 2024

టెక్కలి: అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలి – అచ్చెన్నాయుడు

image

రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఈసీకి తాజాగా లేఖ రాశారు. కొందరు గుత్తేదారుల బిల్లుల చెల్లింపునకు ఇష్టానుసారం ప్రభుత్వం అప్పులు చేస్తోందని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు. సీఈసీ జోక్యం చేసుకుని అప్పులు, చెల్లింపులు లేకుండా చూడాలని, సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

News June 3, 2024

కౌంటింగ్ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ సుడిగాలి పర్యటన

image

అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్నికల కౌంటింగ్ జరగనున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ గౌతమి శాలి సుడిగాలి పర్యటన చేశారు. అధికారులతో కలిసి అన్ని నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాలని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకునే వారిని ఊపేక్షించవద్దని తెలిపారు.

News June 3, 2024

శ్రీకాకుళం: 1459 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. 1459 మంది పోలీసు సిబ్బందిని ఈ బందోబస్తులో వినియోగిస్తున్నారు. జిల్లా పోలీసులతో పాటు ఆర్మడ్ రిజర్వు, ఏపీఎస్పీ, కేంద్ర బలగాలను ఎక్కడికక్కడా మోహరించారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. కౌంటింగ్ ఏజెంట్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేసిన తర్వాతనే లోపలకి అనుమతించనున్నారు.

News June 3, 2024

రాయచోటి: ఇంటి గోడ కూలి వాలంటీర్ మృతి

image

రాయచోటి పట్టణం మాసాపేటలో మూడవ అంతస్తులో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఇంటి గోడ కూలి మార్జాల లక్ష్మీప్రసన్న(40) అనే వాలంటీర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుగవాసి ప్రసాద్ బాబు మృతదేహాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

News June 3, 2024

కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులు భారీ వర్షాలు

image

నైరుతి ఋతుపవనాలు రాయలసీమను తాకడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు పాటు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

News June 3, 2024

RTV ఎగ్జిట్ పోల్స్‌.. జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే..!

image

సత్యసాయి జిల్లాలో టీడీపీ-3 వైసీపీ-3 కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని RTV అంచనా వేసింది. ➢ రాప్తాడు: YCP తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ➢ ధర్మవరం :YCPకేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ➢ హిందుపురం: TDP నందమూరి బాలకృష్ణ ➢పెనుకొండ :TDPసవితమ్మ ➢ కదిరి :TDPకందికుంట వెంకట ప్రసాద్➢ మడకశిర :congress సుధాకర్ ◆పుట్టపర్తి: YCPదుద్దకుంట శ్రీదర్ రెడ్డి గెలుస్తారని తెలిపింది.

News June 3, 2024

మచిలీపట్నం: మంగినపూడి బీచ్‌లో యువకుడి మృతి

image

మంగినపూడి బీచ్‌లో సోమవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బీచ్‌కి వచ్చిన ఓ యువకుడు గల్లంతయ్యాడని పోలీసులు తెలిపారు. సోమవారం ఉదయం ఉయ్యూరు నుండి మంగినపూడి బీచ్‌కి 9 మంది స్నేహితులు వచ్చారు. వారంతా కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా అలలు రావడంతో యువకుడు బీచ్‌లోకి కొట్టుకుపోయాడన్నారు. గల్లంతయిన యువకుడు ఉయ్యూరుకి చెందిన భానుగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.