India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని.. కలెక్టర్ హరి నారాయణన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం కౌంటింగ్ ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్స్, మీడియా సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రణాళికాబద్ధంగా జరపటానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ పోటీల్లో ఆదివారం విశాఖపట్నం-తూర్పుగోదావరి జిల్లా జట్లు మధ్య మ్యాచ్ జరగగా విశాఖ జట్టు 97 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేశారు. తదుపరి బ్యాటింగ్ చేసిన తూ.గో జట్టు 45.5 ఓవర్లకు 182 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో విశాఖ జట్టు విజయం సాధించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో పండుగప్ప చేపలకు ధర లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. 4 నెలల క్రితం పండుగప్ప కేజీ 580 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం కేజీ రూ.380కి పడిపోవడంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. చేపల చెరువుల రైతులు అధికంగా పండుగప్ప జాతి చేపలను పెంచేందుకు ఆసక్తి చూపుతారు. దళారుల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు.
కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ డా.సృజన తనిఖీ చేశారు. నాల్గో తేదీ జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బందోబస్తు విషయంలో ఎక్కడ రాజీ పడొద్దని అనంత ఎస్పీ గౌతమిశాలి అధికారులను హెచ్చరించారు. ఈ మేరకు ఆమె సిబ్బందితో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని ఎవరు అతిక్రమించకుండా చూడాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.
596 జీవోను రద్దు చేయడంతో పాటు లావాదేవీలను నిలిపివేయాలని కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వందలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని అడ్డంగా కొట్టేసిన వైసీపీ నేతలు, అధికార యంత్రాంగం వ్యవహారంపై మాజీ ఐఏఎస్లు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా జరగని వివిధ విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4న జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ఈ సెక్షన్ను విధిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు ఐదుగురు కంటే ఎక్కువమంది గుమిగూడకూడదని, ఎవరూ ఎటువంటి ఆయుధాలను ధరించకూడదని స్పష్టం చేశారు.
విధులకు హాజరయ్యే సిబ్బంది 4వ తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ సెంటర్కు వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఏలూరులో ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులతో ఆదివారం కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ.. కౌంటింగ్ హాలులోకి సెల్ ఫోన్లు అనుమతించవద్దన్నారు.
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు డ్రైడేగా ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. 5వ తేదీ వరకు మద్యం విక్రయాలు నిర్వహించరాదని, నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడైనా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి రాజకీయ పార్టీల అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు సహకరించాలని, జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లత్కర్ పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్లో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో ఈ నెల 4న సార్వత్రిక ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా తీసుకున్న చర్యలు కౌంటింగ్ కేంద్రాలలో అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు పాటించాల్సిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Sorry, no posts matched your criteria.