India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప.గో జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరానికి చెందిన లైన్మెన్ N.శ్రీనివాసరావు శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదని తోటి ఉద్యోగులు తెలిపారు. గ్రామంలో శుక్రవారం ఓ విద్యుత్ స్తంభం ఎక్కి దిగేటప్పుడు సెటప్ బాక్స్ కింద పడిపోవడంతో స్థానికులు అతడితో వాగ్వాదానికి దిగారన్నారు. పలువురు శ్రీనివాసరావుపై దాడి చేసినట్లు తెలిపారు. మనస్తాపానికి గురైన శ్రీను లెటర్ రాసి కనిపించకుండా పోయాడని చెబుతున్నారు.
ఎచ్చెర్లలో శ్రీశివాని కళాశాలలో 4న ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్స్ వారికి నిర్దేశించిన మార్గాల్లోనే చేరుకోవాలని ఎస్పీ రాధిక ఆదివారం తెలిపారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల అసెంబ్లీలకు చెందిన వారు గేట్ నం-1 నుంచి ఫార్మసీ బ్లాక్ కౌంటింగ్ సెంటర్కు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం గేట్ నం-II నుంచి IIIT బ్లాక్ కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకోవాలన్నారు.
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు కలకలం రేపాయి. ఆదివారం పోలీసులు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా.. ఓ పార్టీకి సంబంధించిన వ్యక్తి గడ్డివామిలో నిల్వ చేసి ఉంచిన సుమారు 5 లీటర్ల పెట్రోలు, 18 సీసాలు, 9 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముడి సామగ్రికి సంబంధించిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐపై వేటు పడింది. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో పోలింగ్ రోజున ఘర్షణలు జరిగాయి. ఎస్ఐ శ్రీనివాసరావు అలసత్వం కారణంగానే ఘర్షణ చెలరేగినట్లు జిల్లా కలెక్టర్ షన్మోహన్కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్కు నివేదిక పంపారు. దీంతో ఎస్ఐ సస్పెండ్కు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడ్డాయి.
విశాఖ జిల్లా పరిధిలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రేపటి నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జున తెలిపారు. ఎన్నికల కోడ్ ఈనెల 6వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నామన్నారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, అదే విధంగా కౌంటింగ్ కూడా శాంతియుతంగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు.
కడప పార్లమెంట్ ఫలితంపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఇప్పటికే అవినాశ్రెడ్డి రెండు సార్లు MPగా విజయం సాధించారు. తొలుత 1.90 లక్షల పైగా ఓట్లతో విజయం సాధించగా, 2019లో ఏకంగా 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. మరోసారి విజయం సాధిస్తారని విశ్లేషకులు అంటుండగా, అందుకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉన్నాయి. మరి అవినాశ్ హ్యాట్రిక్ సాధిస్తారా లేక ఎగ్జిట్ పోల్స్ని కాదని వేరే వ్యక్తి గెలుస్తారో చూడాలి.
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హోంగార్డ్ భాస్కరరావు కొంత కాలంగా రేంజ్ ఐజీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజులుగా బందోబస్తు విధులకు హాజరవుతున్నాడు. శనివారం రాత్రి విధులకు హాజరై తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా నల్లపాడు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
భారత యువజన సేవలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి టేన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారానికి, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్ వెల్ సీఈవో మెహరాజ్ తెలిపారు. కైకలూరులో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. నేలపై, నీటిపై, వాయు విన్యాస సంబంధ సాహసాల్లో విజయం సాధించిన వారు ఈనెల 14వ తేదీ లోపు http://awards.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులకు రూ.15 లక్షల నగదు అందిస్తామన్నారు.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు మూడు రోజుల పాటు మద్యం షాపులు, బార్లు బంద్ కానున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం అన్ని మద్యం షాపులకు సీల్ వేస్తామని ఎక్సైజ్ అధికారి పేర్కొన్నారు.
ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్తో కలిసి జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని హెచ్చరించారు.
Sorry, no posts matched your criteria.