India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్తో కలిసి జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని హెచ్చరించారు.
అద్దంకి పట్టణంలో ఆదివారం మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఏల్చూరు గ్రామానికి చెందిన కుంచాల మంజుల అనే మహిళ కొంతకాలంగా అద్దంకిలో ఉంటున్నారు. అయితే ఆమె కుటుంబ కలహాల నేపథ్యంలో పట్టణంలో జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చి ఆపిల్ జ్యూస్లో వాస్మాయిల్ కలుపుకొని తాగింది. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ఆమెను హుటా హుటిన అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.
జిల్లా ఎడిషనల్ ఎస్పీ సెబ్ జెడీ డి.గంగాధరం ఆదేశాల మేరకు శనివారం టెక్కలి ఎస్ఈబీ సీఐ రాజశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో మెలియాపుట్టి మండలం నేలబొంతు గ్రామానికి తూర్పు వైపు ఉన్న కొండపై సుమారుగా 1800 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలను, 30 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయనతోపాటు పలాస డీఎఫ్టీ సీఐ రామచంద్ర కుమార్ టెక్కలి ఎస్ఐ జి.గణేష్ సిబ్బంది పాల్గొన్నారు.
మతిస్థిమితం లేని యువతి(22) పై ముగ్గురు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 26న నగరి పట్టణానికి చెందిన యువతిని పక్కింటి యువకులు నమ్మకంగా మాటలు కలిపి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అప్పటి నుంచి బాధితురాలు నొప్పితో బాధపడుతుండగా.. నగరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంధువు ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటనారాయణ కేసు నమోదు చేశారు.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆరా సంస్థ సర్వేతో పాటు ఇతర సర్వేల్లోనూ అదే చెప్పారు. దీంతో అందరి దృష్టి పవన్ మెజారిటీపై పడింది. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వస్తుందని కూటమి పార్టీ నేతలు చెబుతుండగా.. తమదే విజయం అంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ పవన్ గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది.
– మీ కామెంట్..?
బావిలో ఈత కొట్టేందుకు వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా, బోనకల్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఆరిమేనిపాడు గ్రామానికి చెందిన నాగూర్ బోనకల్ సమీపంలో నిర్మిస్తున్న మొక్కజొన్న పరిశ్రమలో 3 నెలలుగా పనిచేస్తున్నాడు. సూపర్వైజర్తో కలిసి సమీపంలో ఉన్న బావిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. నీట మునిగి చనిపోయాడు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఈ నెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజులు మద్యం దుకాణాలను మూసి వేయనున్నట్లు ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పోలీస్ అధికారి జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( ఎస్ఈబీ) అదనపు ఎస్పీ డి.గంగాధరం తెలిపారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశామని చెప్పారు. కౌంటింగ్ సమయంలో ఎక్కడ మద్యం అక్రమ నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన టేబుల్స్ ఇతర సామాగ్రిని ఆదివారం అధికారులు సిద్ధం చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్కు సర్వ సిద్ధం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో అసెంబ్లీ నియోజవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్, పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ సిద్ధం చేసినట్లు తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 4న జరగనున్న నేపథ్యంలో 3, 4వ తేదీల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ డాక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేవలం 4వ తేదీ మాత్రమే మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు మూసివేయాలని ఆదేశిస్తూ కలెక్టర్ మరో ఉత్తర్వు జారీ చేశారు.
సార్వత్రిక ఎన్నికల ఆఖరి ఘట్టం కౌంటింగ్ ప్రక్రియకు కేవలం 48 గంటల సమయమే మిగిలి ఉంది. గత ఎన్నికల కంటే ఈ దఫా జిల్లాలో 2.39 శాతం పోలింగ్ పెరిగింది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను, నెల్లూరు, తిరుపతి పార్లమెంటు స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం గెలుపుపై వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.