Andhra Pradesh

News September 25, 2024

గుంటూరు: ‘డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి’

image

108 వాహనాల్లో పైలట్స్ (డ్రైవర్లు) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు 108 జిల్లా మేనేజర్ నాగదీప్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, హెవీ లైసెన్స్ కలిగి, 35 సం. లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 26వ తేదీలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని, 108 కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News September 25, 2024

నెల్లూరు విజయ డెయిరీ ఎన్నికలు ఏకగ్రీవం

image

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ)కి సంబంధించి జరగాల్సిన మూడు డైరెక్టర్ పోస్టుల ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి హరిబాబు మంగళవారం పేర్కొన్నారు. అన్నం శ్రీహరి (అన్నారెడ్డిపాళెం), కోట చంద్రశేఖర్ రెడ్డి (నారికేళపల్లి), గంగా శ్రీనివాసులు (వాసిలి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. వారి పదవీకాలం ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందన్నారు.

News September 25, 2024

సీఎం చంద్రబాబుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్

image

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకరంగా, దూషణలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఆగస్టు నెలలో జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ టీడీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా దర్యాప్తు చేపట్టి.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, జడ్జి అతనికి రిమాండ్ విధించారు.

News September 25, 2024

లడ్డూ వివాదంపై CBIతో విచారణ జరిపించాలి: MP మిథున్

image

తిరుమల లడ్డూ ఘటనపై CBIతో విచారణ జరిపించాలని MP మిథున్ రెడ్డి అన్నారు. తిరుమలలో నెయ్యి ఆర్డర్ ఇచ్చింది, శాంపిల్ టెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వంలోనే అని ఎంపీ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నిజం బయటికి రావాలంటే CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. టీటీడీ ఈఓ శ్యామల రావు భిన్న సమాధానాలు చెబుతున్నారని, ఆఫీసర్ల మీద ఒత్తిడి తెస్తున్నారన్నారు.

News September 25, 2024

జనసేనలో చేరనున్న బొత్స సోదరుడు..!

image

విజయనగరం జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేనలో చేరనున్నారు. వచ్చే నెల 3న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో మంగళవారం రాత్రి ఆయన భేటీ అయ్యారు. ఆయనతో పాటు నెల్లిమర్ల నియోజవర్గంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

News September 25, 2024

సోమిరెడ్డి పల్లె వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు

image

అల్పపీడన ప్రభావంతో నిన్న రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మంగారిమఠం సోమిరెడ్డి పల్లె వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. మండలంలోని రహదారులు బురదమయంగా మారాయి. బ్రహ్మంగారిమఠం బద్వేల్ రహదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

News September 25, 2024

పెద్దకడబూరు: బాలికలకు అసభ్యకర వీడియోలు పంపిన HM

image

పెద్దకడబూరులోని ఆది ఆంధ్ర MPP స్కూళ్లో పనిచేస్తున్న HM సుప్రసాద్ పై పోక్సో కేసు నమోదైనట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. కాగా ఆయన ఈ ఏడాది ఆగస్టులో బాలికలకు ఫోన్లో అసభ్యకర వీడియోలను పంపించారు. దీనిపై MEO సువర్ణల సునియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంగళవారం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

News September 25, 2024

అన్నవరం ప్రసాదానికి నెయ్యి సరఫరాకు గడువు పూర్తి

image

అన్నవరం ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ప్రస్తుతం తిరుమల లడ్డూ అంశం రాష్ట్రంలో వివాదాస్పదం కావడంతో అన్నవరం సత్యదేవుని ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిపై ఆలయ ఉద్యోగులు ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ నడుస్తోంది. ఇక్కడ ఏడాదికి 2 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో నెయ్యికి రైతు డెయిరీకి రూ.538.60 చెల్లిస్తున్నారు.

News September 25, 2024

గుంటూరులో జాబ్ మేళా.. ఈ కంపెనీల్లో ఉద్యోగాలు

image

ఈనెల 27న నైపుణ్యభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రణయ్ పేర్కొన్నారు. ఇలా అగ్రిసర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్, పయనీర్ ఆటోమోటివ్స్, కేఎల్ గ్రూపు అమెజాన్ వేర్ హౌస్, Way2news, మాస్టర్ మైండ్స్ తదితర సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 18-35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు 98663366187, 9505719172 నంబర్లను సంప్రదించాలన్నారు.

News September 25, 2024

తగ్గిన శ్రీవారి భక్తుల రద్దీ..

image

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ తగ్గింది. దీంతో భక్తులు వేచి ఉండే అవసరం లేకుండా డైరెక్ట్‌గా స్వామి వారి దర్శనానికి వెళుతున్నారు. కాగా నిన్న శ్రీ వారిని 67,166 వేల మందికి పైగా దర్శించుకన్నట్లు అధికారులు తెలిపారు.