India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలనూ వైసీపీ కైవశం చేసుకుంటుందన్న ఈ సర్వేపై మీ COMMENT.
కడప ఎంపీగా వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో వైసీపీ సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.
ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పలు సర్వేలు కూటమి అధికారంలోకి రాబోతోందని వెల్లడించగా.. మరికొన్ని మరోసారి YCP ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పాయి. మరోపక్క లోక్సభ స్థానాల్లోనూ చాలా వ్యత్యాసంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అనంతపురం, హిందూపురం MP స్థానాలను TDP కైవసం చేసుకుంటుందని చాణక్య X సర్వే.. YCP ఖాతాలో పడతాయని సీ-ప్యాక్ సర్వే పేర్కొన్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్తో ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ గెలుపొందుతుందని సీ ప్యాక్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కింజరావు రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. మరో సర్వే చాణక్య X అక్కడ టీడీపీనే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.
విజయవాడ ఎంపీగా వైసీపీ అభ్యర్థి కేశినేని నాని గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ విజయం సాధిస్తారని పేర్కొంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 2 ఎంపీ స్థానాల్లో రెండూ.. వైసీపీనే సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.
ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పలు సర్వే ఏజెన్సీలు కూటమి అధికారంలోకి రాబోతోందని వెల్లడించగా.. మరికొన్ని మరోసారి YCP ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పాయి. మరోపక్క లోక్సభ స్థానాల్లోనూ చాలా వ్యత్యాసంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కర్నూలు, నంద్యాల MP స్థానాలను YCP కైవసం చేసుకుంటుందని చాణక్య X సర్వే.. కర్నూలు YCP, నంద్యాల TDP ఖాతాలో పడతాయని సీ-ప్యాక్ సర్వే పేర్కొన్నాయి.
ఉమ్మడి ప.గో. జిల్లాలోని ఏలూరు, నరసాపురం ఎంపీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని సీ-ప్యాక్ సర్వే అంచనా వేసింది. కాగా నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస శర్మ, వైసీపీ నుంచి గూడూరి ఉమాబాల బరిలో ఉన్నారు. అటు ఏలూరులో కూటమి నుంచి పుట్టా మహేశ్, వైసీపీ- కారుమూరి సునీల్ పోటీ చేస్తున్నారు.
– మరి మీ కామెంట్..?
గుంటూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గెలవనున్నట్లు సీప్యాక్ సర్వే ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది. అలాగే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయులు విజయం సాధిస్తారని పేర్కొంది. మరోవైపు, బాపట్ల ఎంపీగా నందిగం సురేశ్ గెలవనున్నట్లు సర్వే స్పష్టం చేసింది. ఉమ్మడి జిల్లాలోని 3 ఎంపీ స్థానాల్లో 2 టీడీపీ, ఒకటి వైసీపీ సొంతం చేసుకుంటాయన్న ఈ సర్వేపై మీ COMMENT.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొంచెం బార్డర్కు అటు ఇటుగా వచ్చే అవకాశం ఉందని, చివరిగా వైసీపీ గెలిచే చాన్స్ ఉందని చాణక్య X సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. అటు పోస్ట్ పోల్ సర్వే టీడీపీయే గెలుస్తుందని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.
ఉమ్మడి తూ.గో. జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి MP స్థానాల్లో YCP, అమలాపురంలో TDP విజయం సాధిస్తుందని సీ-ప్యాక్ సర్వే అంచనా వేసింది. కాగా కాకినాడలో కూటమి నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వైసీపీ నుంచి చలమలశెట్టి సునీల్ బరిలో ఉన్నారు. అటు రాజమండ్రిలో కూటమి- పురందీశ్వరి, వైసీపీ- గూడూరి శ్రీనివాస రావు, అమలాపురంలో కూటమి నుంచి గంటి హరీశ్ మాధుర్, వైసీపీ- రాపాక వరప్రసాద్ పోటీ చేస్తున్నారు.
– మరి మీ కామెంట్..?
Sorry, no posts matched your criteria.