India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఆయేషాబేగం తెలిపారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగవని పేర్కొన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో శనివారం కూడా జిల్లాలో మద్యం దుకాణాలు మూసేశారు.
పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేయగా.. వైసీపీ అభ్యర్థి రాంభూపాల్ రెడ్డి గెలుస్తారని మరో సర్వే చాణక్య X పేర్కొంది. ఇక్కడ టీడీపీ నుంచి గౌరు చరితా రెడ్డి, వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇప్పటికే రాంభూపాల్ రెడ్డి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సర్వేలపై మీ COMMENT
బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పెరపాడు గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బొబ్బిలిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శనివారం బొబ్బిలి ఎస్సై చదలవలస సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో గల రాముడువలస గ్రామ శివారులో తోటపల్లి కెనాల్ గట్టు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభించింది. అతని వయస్సు సుమారు 45 నుంచి 50 సంత్సరాలు ఉంటుందని తెలిపారు. స్థానిక వీఆర్వో అలజంగి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు.
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం బంధంచర్ల అటవీ ప్రాంతంలో వారం రోజులుగా పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బంధంచర్ల – చింతలపూడి సరిహద్దు అడవిలో పులి అడుగు జాడలను శనివారం బీట్ అధికారిణి భవానీ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఆయా ప్రాంతాల్లో కనిపించిన కాలి ముద్రలను గుర్తించి జిల్లా ఫారెస్ట్ అధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.
హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ, వైసీపీ నుంచి కురబ దీపిక పోటీలో ఉన్నారు. కాగా.. మరో సర్వే చాణక్య X కూడా బాలకృష్ణ గెలుస్తారని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.
ట్రాఫిక్ నిర్వహణ పనుల నిమిత్తం శనివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు 2 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం తెలిపారు. రాజమహేంద్రవరం- విజయవాడ (07767), విజయవాడ- రాజమహేంద్రవరం (07459) రైళ్లు ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండవని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు.
– SHARE IT
భార్య మరణం తట్టుకోలేక భర్త కూడా మరణించిన ఘటన కావలి పట్టణంలో చోటు చేసుకుంది. కావలి పట్టణం వైకుంఠాపురం అనపగుంత సమీపంలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు(71) వరలక్ష్మి (65)భార్య భర్తలు. జ్వరంతో బాధపడుతూ వరలక్ష్మి మృతి చెందగా ఆమె మరణ వార్తను తట్టుకోలేక భర్త శ్రీనివాసరావు కూడా మృతిచెందాడు. ఈ దంపతుల మృతదేహాలు పక్కపక్కనబెట్టి ఉండడం చూసి పలువురు కంటతడి పెట్టారు.
మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ వైసీపీ నుంచి వై.బాలనాగిరెడ్డి, టీడీపీ నుంచి రాఘవేంద్ర పోటీ పడ్డారు. మరో సర్వే చాణక్య X కూడా బాలనాగిరెడ్డే గెలుస్తారని పేర్కొంది. ఈయన 2009లో టీడీపీ నుంచి, 2014, 2019లో వైసీపీ నుంచి గెలిచారు. ఈ సర్వేలపై మీ COMMENT.
పామర్రులో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, వైసీపీ నుంచి కైలే అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. మరోవైపు, చాణక్య X సర్వే ప్రకారమూ వైసీపీ అభ్యర్థే గెలుస్తారని పేర్కొంది. ఈ సర్వేలపై మీ COMMENT.
Sorry, no posts matched your criteria.