India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొండపి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేశ్ ఓడిపోతున్నారని ఆరా సర్వే అంచనా వేసింది. పరోక్షంగా డొలా బాల వీరాంజనేయస్వామి గెలుస్తారని చెప్పింది. అలాగే సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరుగు నాగార్జున స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా, శనివారం సాయంత్రం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఆరా మస్తాన్ సర్వే ప్రకారం గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారని తెలిపింది. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేశ్ గెలుస్తారని అంచనా వేసింది.
కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలకు డిపాజిట్ కూడా రాదని ఆరా సర్వే అంచనా వేసింది. పరోక్షంగా వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తారని చెప్పింది. అలాగే కడప నుంచి అంజాద్ బాషా స్వల్ప మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి..?
విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ సర్వే పేర్కొంది. ఇక్కడ ఆయన మంచి మెజార్టీతో గెలుస్తారని తెలిపింది. గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచే అవకాశం ఉందని చెప్పింది. మరోవైపు, పెనమలూరు నుంచి పోటీ చేసిన జోగి రమేశ్ గట్టి పోటీ ఎదుర్కొంటారని వివరించింది. కైకలూరులో కామినేని శ్రీనివాస్ గెలుస్తారని సర్వే చెప్పింది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని ఆరా మస్తాన్ తన సర్వేలో ఫలితాన్ని ప్రకటించారు. అలాగే పెనుకొండ వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి, గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఓడిపోతారని వెల్లడించింది.
జూన్ 4న ఫలితాలు వెలువడనుండగా, శనివారం సాయంత్రం కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి. వీటిలో ఆరా మస్తాన్ సర్వే ఉమ్మడి విజయనగరం జిల్లాలో చీపరుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ, సాలూరు నుంచి రాజన్న దొర ఘన విజయం సాధించబొతున్నట్లు తెలిపింది.
సీదిరి అప్పలరాజు పలాసలో ఓడిపోనున్నారని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. అటు ధర్మాన ప్రసాద్ శ్రీకాకుళంలో గట్టి పోటీ ఎదుర్కోనున్నారని తెలిపింది. తమ్మినేని సీతారాం అముదాలవలసలో కొద్ది ఓట్ల తేడాతో ఓటమికి అవకాశం ఉందని పేర్కొంది.
బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోతారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అక్కడి నుంచి గెలుస్తారని చెప్పకనే చెప్పింది. అలాగే పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి భారీ విజయం సాధిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి..?
సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని ఆరా మస్తాన్ తన సర్వే ఫలితాన్ని ప్రకటించింది. అదేవిధంగా వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన వి.విజయసాయిరెడ్డి ఓడిపోతారని అంచనా వేసింది.
తిరుపతి జిల్లాలో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రౌండ్ల వివరాలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు-21రౌండ్లు, సూళ్లూరుపేట-22రౌండ్లు, వెంకటగిరి-22రౌండ్లు, తిరుపతి-20 రౌండ్లు, శ్రీకాళహస్తి-21రౌండ్లు, చంద్రగిరి-20రౌండ్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 2,231మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5గంటల్లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.