Andhra Pradesh

News September 25, 2024

ఇంజనీరింగ్ పనులు కారణంగా పలు రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు గుంటూరు, సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్, గుంటూరు (12706), గుంటూరు, సికింద్రాబాద్ (12705) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 25, 2024

నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో YS జగన్ భేటీ

image

ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీ నేతలతో నేడు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం అవ్వనున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో ఉన్న జిల్లా ఇన్‌ఛార్జులు హాజరవునుఉన్నట్లు సమాచారం. ఇటీవల జగ్గయ్యపేట వైసీపీ ఇన్‌ఛార్జ్ సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో జగ్గయ్యపేటకు నూతన ఇన్‌ఛార్జ్‌ను జిల్లాకు చెందిన దేవినేని అవినాశ్‌ను నియమించినట్లు సమాచారం.

News September 25, 2024

శ్రీకాకుళం: హోంగార్డుల సస్పెన్షన్: ఎస్పీ

image

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు హోంగార్డులను SP మహేశ్వరరెడ్డి మంగళవారం రాత్రి సస్పెండ్ చేశారు. మరో ఐదుగురిపై నెల రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. గత నెల 21న రూ.5 వేలు లంచం తీసుకున్నడనే కారణంతో పాతపట్నం కానిస్టేబుల్ శ్యామలరావును తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా హోంగార్డుల పనితీరును పరిశీలించి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న 17 మందికి నోటీసులు కూడా జారీ చేసిన విషయం విధితమే.

News September 25, 2024

నాడు MLA టికెట్ వచ్చినా మంతెన త్యాగం.. నేడు ప్రతిఫలం

image

ఎన్నికల వేళ TDP తొలి జాబితాలో ఉండి MLA టికెట్ మంతెన రామరాజుకు కేటాయించిన విషయం తెలిసిందే. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల వల్ల పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన టికెట్ త్యాగం చేశారు. అక్కడ రఘురామకృష్ణ రాజు గెలుపునకు కృషి చేశారు. నాటి త్యాగానికి ప్రతిఫలంగా నిన్న ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో ఆయనకు ప్రాధాన్యం దక్కింది. కీలకమైన APIIC ఛైర్మన్ పదవి కేటాయించి పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించింది.

News September 25, 2024

‘ఎనలేని సేవలు అందిస్తున్న విశాఖ ఐఎండీ’

image

విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఎన్నలేని సేవలు అందిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం ఏయూలో నిర్వహించిన విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్వర్ణోత్సవాల్లో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పాల్గొన్నారు. సాంకేతిక సహాయాన్ని మరింత పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో సంభవించే ప్రమాదాలను నివారించాలని కలెక్టర్ సూచించారు.

News September 25, 2024

కర్నూలు: వర్షానికి కూలిన మట్టి మిద్దె

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల నిన్న రాత్రి వరకు కురిసిన వర్షానికి లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నందవరం మండలం కనకవీడు గ్రామంలో నరసింహుడు అనే వ్యక్తి మట్టి మిద్దె వర్షానికి కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకుపోవడంతో ప్రమాదం తప్పింది. పలు చోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

News September 25, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి మంగళవారం సాయంత్రం 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 13700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని చెప్పారు.

News September 25, 2024

అనంతలో ‘లేపాక్షి’ పేరు అలా.. వచ్చిందట!

image

అబ్బురపరిచే శిల్ప సంపదకు నిలయం అనంతలోని లేపాక్షి ఆలయం. నందీశ్వరుడి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. ఉట్టిపడే రాజసం ఈ విగ్రహం సొంతం. ఈ ఆలయంలో వేలాడే స్తంభం ముఖ్య ఆకర్షణ. పర్యాటకులు ఈ అద్భుతాన్ని చూసి పరీక్షిస్తుంటారు. 7 పడగల భారీ నాగేంద్రుడు వంటి ఎన్నో ఆశ్చర్యపరచే వింతలు ఇక్కడున్నాయి. రాముడు జటాయు పక్షిని ‘లే పక్షీ’ అని పిలవడంతో ఈ ఊరికి ‘లేపాక్షి’ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

News September 25, 2024

ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి ఆటల పోటీలు

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయిలో ఈనెల 26 నుంచి నిర్వహించే స్కూల్స్, జూనియర్ కళాశాలల క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దేముడు బాబు తెలిపారు. అండర్-14, అండర్-17 బాల బాలికల అథ్లెటిక్స్ ఏయూ గ్రౌండ్‌లోను, రెజ్లింగ్ పోటీలు అల్లూరి జిల్లా కొయ్యూరులో జరుగుతాయన్నారు. 27న ఆనందపురంలో అండర్-17 బాల బాలికల మోడరన్ పెంటాథిలిన్ పోటీలు నిర్వహిస్తామన్నారు.

News September 25, 2024

ప్రకాశం జిల్లా నేతలకు కీలక పదవులు

image

ప్రకాశం జిల్లాలో నలుగురు కూటమి నేతలకు కీలక పదవులు దక్కాయి.
1. ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్- దామచర్ల సత్యనారాయణ
2. నూకసాని బాలాజీ – ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్
3. లంకా దినకర్ – 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్
4. పాకనాటి గౌతమ్ రాజు- ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ సభ్యుడు