India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోడ్డు ప్రమాదంలో కొత్తచెరువు వైసీపీ మండల కన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి మృతిచెందిన ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. పుట్టపర్తిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సమీపాన గల రామాలయం వద్ద బైక్లో వెళుతున్న ఆయనను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మృతిచెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
కడప రిమ్స్లో శనివారం అరుదైన శస్త్ర చికిత్స జరిగింది. వెంకటమ్మ కడుపు నొప్పితో రిమ్స్లో అడ్మిట్ అయింది. వైద్యులు పరీక్షించి అది అండాశయ క్యాన్సర్ అని గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేసి తొలగించాలని వివరించారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు అమానుల్లా, జనరల్ సర్జన్ పుష్పలత, మత్తుమందు వైద్యుడు శ్రీనివాస్, స్టాఫ్ నర్సు శివకృష్ణ సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా పూర్తి చేశారు.
2024 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో గత నెల 13న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై బేతంచెర్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. దీంతో ఈ కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టును బుగ్గన ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ న్యాయస్థానం పరిశీలనలో ఉందని, త్వరలోనే విచారణకు వస్తుందని బాధితుడు పీఎన్ బాబు తెలిపారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు సీఎంఆర్ ఏకో అల్యూమినియం కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ అయ్యిందని సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 25 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. అస్వస్థతకు గురైన కార్మికులను రేణిగుంటలోని ఓ హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పట్టణంలో గుంజా లక్ష్మీ (33)అనే మహిళ శనివారం హిట్ స్ప్రే తాగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలి పర్సులో సూసైడ్ నోట్ లభించిందన్నారు. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పనిచేస్తుందని అదే కాలేజీలో ఆమె భర్త చైతన్య ఎలక్ట్రిషన్గా పనిచేస్తున్నాడన్నారు. సూసైడ్ లేఖ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాల భూములకు ఖరీఫ్ సాగు నిమిత్తం నీరు విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద శనివారం గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కలెక్టర్ మాధవీలత నీటిని వదిలారు. ధవళేశ్వరం గోదావరి డెల్టా సిస్టం చీఫ్ ఇంజినీరు ఆర్.సతీష్ కుమార్, ధవళేశ్వరం సర్కిల్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
సింగరాయకొండ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదురుగా ఉన్న బస్ షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని ఆవులవారిపాలెంకు చెందిన పోకూరి లక్ష్మమ్మ (80) కుటుంబసభ్యులు మరణించడంతో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రెండు రోజుల నుంచి ఎండలు అధికంగా ఉండడంతో ఆ ఎండల తాకిడికి తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందిందని తెలిపారు.
రామాపురం మండల పరిధిలోని గువ్వల చెరువు ఘాట్లో చిత్తూరు నుంచి నంద్యాలకు వెళుతున్న మద్యం లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే పది కేసుల మద్యం స్థానికులు తీసుకెళ్లారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మద్యం లోడులో ప్లాస్టిక్ బాటిళ్లు కావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని లారీ నిర్వాహకులు తెలిపారు.
విజయవాడలో డయేరియా మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని కోరారు. ఇతర కారణాల వల్ల ప్రజల చనిపోతున్నారని అధికారులు అనడం సరికాదని హితవు పలికారు.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో శనివారం ఈదురు గాలులకు ఓ చెట్టు విరిగి ఆటోపై పడింది. గ్రామానికి చెందిన సూరాడ బుజ్జి అనే వ్యక్తి తన ఆటోను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పెద్ద వృక్షం విరిగి ఆ ఆటోపై పడడంతో పూర్తిగా ధ్వంసమైంది. దీంతో బుజ్జి లబోదిబోమంటున్నాడు.
Sorry, no posts matched your criteria.