Andhra Pradesh

News May 31, 2024

VZM: ఒక్కసారే ఛాన్స్.. అయినా ఆమెదే ఎక్కువ మెజారిటీ

image

విజయనగరం నియోజకవర్గంలో బీసీ సామాజిక ర్గం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారే బరిలో నిలుస్తున్నారు. 2014లో బీసీ వర్గానికి చెందిన మీసాల గీతకు టీడీపీ అవకాశం ఇవ్వగా.. ఆమె 15,404 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2004లో 1,126 ఓట్లతో కోలగట్ల, 2009లో 3,282 ఓట్లతో అశోక్, 2019లో 6,400 ఓట్లతో కోలగట్ల గెలిచారు. ప్రస్తుతం మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.

News May 31, 2024

మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల ఫైన్: రాజాం CI 

image

నిబంధనలు పాటించకుంటే ‘భరత్ అనే నేను’ మూవీలో ఫైన్స్ ఎంత కఠినంగా ఉన్నాయో మనం చూశాం. ఇకపై మన శ్రీకాకుళంలోనూ అదే జరగనుంది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నట్లు రాజాం CI మోహన్ రావు తెలిపారు. ఓవర్ స్పీడ్‌తో పట్టుబడితే రూ.1000-రూ.2000, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్-రూ.500, మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల ఫైన్‌తో పాటు మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ఛాన్స్ ఉండదన్నారు.

News May 31, 2024

తూ.గో: బైక్ లోయలో పడి తండ్రి, కొడుకు మృతి

image

రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం సీతాపురానికి చెందిన తండ్రి, కొడుకులు శుక్రవారం బైక్ యాక్సిడెంట్‌లో మరణించారు. వెలమ రాంబాబు, ఆయన భార్య, కుమారుడు ప్రశాంత్(5), కుమార్తె నిన్న కొయ్యూరు మండలం బూదరాళ్లలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఉదయం ఇంటికి తిరిగి వస్తుండగా.. చింతవానిపాలెం మలుపు వద్ద బైక్ అదుపు తప్పి లోయలో పడింది. తండ్రి, కొడుకు మృతి చెందగా.. గాయాలపాలైన తల్లి, కూతురు చికిత్స పొందుతున్నారు.

News May 31, 2024

విజయనగరం ఆసుపత్రిలో చేరిన MLC 

image

జిల్లాలోని ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఉన్నట్టుండి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీలో ఉంటూనే టీడీపీకి మద్దతు ఇచ్చారనే ఆరోపణలతో మండలి ఛైర్మన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు అనర్హత పిటిషన్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. గ్లాండ్ బ్లేడర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరానంటూ రఘురాజు సంకేతాలు పంపారు.

News May 31, 2024

అనంత: పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఎన్ని రౌండ్లలో తెలుస్తాయంటే..!

image

అనంత జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లోక్ సభ పరిధి, 8అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలైన ఓట్లను వేరుగా లెక్కిస్తారు. అసెంబ్లీ స్థానాల కొస్తే ఒక్క తాడిపత్రి మాత్రమే 6 టేబుళ్లు, మిగతా స్థానాలకు 4 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అనంతపురం అర్బన్ 5 రౌండ్లు, రాప్తాడు 3, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, కళ్యాణదుర్గంలో 2 రౌండ్లు చొప్పున, తాడిపత్రి, రాయదుర్గం 1 రౌండ్లోనే లెక్కింపు పూర్తి కానుంది.

News May 31, 2024

కృష్ణా: ఒక పెళ్లి.. రెండు ట్విస్ట్‌లు

image

నూజివీడు మండలం గొల్లపల్లిలో జరగాల్సిన ఓ పెళ్లిలో ట్విస్ట్ నెలకొంది. తాళికట్టే వేళ వధువు కళ్లు తిరిగి పడిపోయింది. భయాందోళనకు గురైన కుటుంబీకులు, పెళ్లి పెద్దలు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే.. పెళ్లి ఇష్టం లేక కావాలనే ఇలా చేసినట్లు వధువు చెప్పడంతో వారంతా ఖంగుతిన్నారు. దీంతో 2 కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వధువు మైనర్‌. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 31, 2024

విశాఖ: బాధిత మహిళకు వైద్య పరీక్షలు

image

కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధిత మహిళకు కేజీహెచ్ ప్రసూతి విభాగంలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగిక ఆరోపణలపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు ఆమెను కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పరీక్షలు చేశారు. పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.

News May 31, 2024

చీమకుర్తి: రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

image

చీమకుర్తిలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ఇసుక వాగుకు చెందిన గుంటూరు రమేశ్ (43) పొదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తూర్పు బైపాస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో సీఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 31, 2024

నెల్లూరు: 43 బైకులు స్వాధీనం

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వేదాయపాళెం, విడవలూరు, సీతారామపురం, కలిగిరి, వింజమూరు, ఉదయగిరి, వరికుంటపాడు తదితర పోలీసుస్టేషన్ల పరిధిలో సమస్యాత్మక, శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసు అధికారులు తమ సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 43 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

News May 31, 2024

కడప: అంధుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

కడప శంకరాపురంలోని ప్రభుత్వ అంధుల ఉన్నత పాఠశాలలో 2024 – 25 విద్యా సంవత్సరానికి 1 నుండి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల హెడ్మాస్టర్ శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోని ఏ ప్రాంతం నుంచి అయినా ఈ ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులు చేరవచ్చని తెలిపారు. జూన్ 1 నుండి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు.