India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బెంగళూరుకు చెందిన ఇంపాన(23), చేతన్ ల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచింది. వీరికి పెద్దలు పంచాయతీ చేసి నగదు ఇచ్చేలా ఒప్పందం రాయించారు. తరువాత చేతన్ మరొకరిని వివాహం చేసుకుని చీమకుర్తిలో బేకరీ నిర్వహిస్తున్నాడు. బుధవారం చీమకుర్తికి వచ్చిన ఇంపాన పెళ్లి చేసుకోవాలని చేతన్ను అడగ్గా, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వర్షం కోసం రైతు ఎదురు చూస్తుంటాడు. పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తుంటారు. అయితే ఏ రంగానికి సంబంధం లేకుండా అందరూ ఎదురు చూసే ఫలితాలు ఎన్నికల ఫలితాలు. దీంతో జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాల్లో తమ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని పలువురు బెట్టింగ్లు కాస్తున్నారు. ఈ ఉత్కంఠకు తెరలేవాలంటే 4వ తేదీ వరకు ఆగాల్సిందే.
కళ్యాణదుర్గం మండలంలోని హులికల్లు బీసీ కాలనీ సమీపంలో గురువారం
చిరుత సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి వచ్చి దాడి చేస్తుందోనని పొలాలకు వెళ్లే రైతులు, కాలనీవాసులు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. చిరుతను బంధించి అడవిలో వదలాలని కోరుతున్నారు. అటవీ అధికారి నాగే నాయక్ సిబ్బందితో రాత్రి గస్తీ నిర్వహించారు.
ప.గో జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో 216వ జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. బైక్ను కారు ఢీకొట్టడంతో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. 216వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం పాలకొల్లు వైపు నుంచి నరసాపురం వైపు వెళ్తున్న దంపతుల బైక్ను ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దంపతులకు గాయాలు కాగా.. స్థానికులు పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.
మండలంలోని మోర్సపూడిలో శ్రీనివాస హాజరి కంపెనీలో గురువారం గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ మృతదేహానికి సుమారు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ కంపెనీలో ఉత్తరపు గేటు సమీపంలో ఈ మృతదేహం ఉన్నట్లుగా నూజివీడు రూరల్ ఎస్సై తెలిపారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ <<13346298>>సాగర్ నగర్<<>> కారు ప్రమాద ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రగుంట్ల క్రాంతికుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్కు భయపడ్డ నిందితుడు మద్యం మత్తులో రాంగ్రూట్లో వచ్చి బైక్ను ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం పాల్తేరుకు చెందిన డెలవరీ బాయ్ ఎస్.గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని KGHకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మాధవరాయుని పేటకు చెందిన పిల్లి ధరణి సత్య(23) చెన్నైలో రైలు ఢీకొని మృతి చెందింది. చెన్నైలోని ఓ కంపెనీలో ధరణి 8 నెలలుగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుందని కుటుంబీకులు తెలిపారు. సహోద్యోగులతో కలిసి లోకల్ ట్రైన్ దిగి విధులకు వెళుతున్న క్రమంలో పట్టాలు దాటుతుండగా.. మరో రైలు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మాధవరాయునిపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కోసిగి మండలంలోని దొడ్డి గ్రామానికి చెందిన అడివప్ప(48) గ్రామ శివారులోని మాలబండ వద్ద మృతి చెందాడు. భార్య తెలిపిన వివరాల మేరకు కోసిగిలో కట్టెల మిషన్లో పనిచేసేవాడని తెలిపింది. రోడ్డుమీద రక్తపు మడుగులో పడి ఉన్నాడని, పక్కనే బైకుకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆరోపించారు. భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు జూన్ 2,3,4,5 తేదీలలో షాపులు పూర్తిగా మూసి వేయనున్నట్లు, నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొత్తూరి కిషోర్ బాబు తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్థులు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. శనివారం ఐదు గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించి అనంతరం షాపులు మూసి వేయవలసిందిగా కిషోర్ కోరారు.
ఎచ్చెర్లలోని శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 2కి.మీ పరిధి వరకు రెడ్ జోన్ అమలు చేస్తున్నట్లు SP రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. రెడ్ జోన్ అమలు చేస్తున్న నేపథ్యంలో డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడం నిషేధించినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమించరాదన్నారు.
Sorry, no posts matched your criteria.