India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భర్తపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. హనుమయ్య నగరకు చెందిన వెంకటరమణ అనే మహిళ తన భర్త వెంకటేశ్వర్లు తరచూ గొడవ పెట్టుకుని కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత కూడా కేసు వెనక్కి తీసుకోమని గడ్డపార తీసుకుని తల పగలగొట్టాడని భార్య వెంకటరమణ పోలీసుల ఎదుట వాపోయింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రెవిన్యూ శాఖలో వివిధ క్యాడర్లకు చెందిన 462 మందిని బదిలీ చేస్తూ విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 462 మందికి బదిలీ జరిగింది. బదిలీలు జరిగిన వారిలో MRO-1, DT -69, సీనియర్ అసిస్టెంట్-50, జూనియర్ అసిస్టెంట్-21, వీఆర్వో గ్రేడ్ I -238, వీఆర్వో గ్రేడ్ II-81, ఒక రికార్డ్ ఆసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినెటర్ ఉన్నారు.
రాజంపేట పరిధిలోని సానిపాయ నిషేధిత అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్న 15 మందిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు వారి నుంచి రంపాలు, గొడ్డళ్లు, నాలుగు కార్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. వారిలో నలుగురు అన్నమయ్య జిల్లాకు చెందిన వారు కాగా.. 11మంది తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ఆర్ఎస్ఐ సురేశ్ అటవీశాఖ అధికారులతో కలిసి కూంబింగ్ చేపట్టారు. ఆ సమయంలో వీరు పట్టుబడ్డారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఓల్డ్ రెగ్యులేషన్ సప్లిమెంటరీ డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫలితాలను జ్ఞానభూమి పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మొత్తం 1154 మంది హాజరు కాగా 822 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 71.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మొదలుకొని ఇచ్చాపురం వరకు రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసే విధంగా సంబంధిత అధికారులను నియమించడం జరిగింది.
లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (L.H.M.S)ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజల ఆస్థుల పరిరక్షణకు L.H.M.S రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని, ఈ యాప్ను అందరూ అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చోరీలు జరగకుండా ఈ యాప్ ఉపకరిస్తుందని అన్నారు.
బేతంచెర్ల పట్టణానికి చెందిన డీజే మధు డాన్స్ బృందం విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి ప్రథమ స్థానం కైవసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి డాన్స్ పోటీలకు 17 జట్లు హాజరయ్యాయి. ఈ పోటీల్లో బేతంచెర్ల డీజే మధు బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా పట్టణవాసులు బృందం సభ్యులను అభినందించారు.
కనిగిరిలోని పామూరు రోడ్డులో అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ భూముల్లో అక్రమ వెంచర్లు వేసిన వారిపై చర్యలు తీసుకొని, అసైన్మెంట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున వరద బాధితుల కోసం రూ.కోటి విలువ చేసే చెక్కును ఏసీఏ పాలకవర్గం సభ్యులు మంగళవారం సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి సానా సతీశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకట రమణ ప్రశాంత్, కోశాధికారి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ డి.గౌర్ విష్ణు తేజ్లు విజయవాడలో సీఎం చంద్రబాబును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం చెక్కును అందజేశారు.
అక్టోబరు 13న విజయనగరం ఉత్సవాల ప్రారంభ ర్యాలీని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించి, అయోద్యా మైదానం వరకు నిర్వహించాలని కలెక్టర్ అంబేడ్కర్ మంగళవారం తెలిపారు. ఈ ర్యాలీని వివిధ జానపద కళారూపాలతో సుమారు 15వేల మందితో గొప్పగా నిర్వహించాలన్నారు. 13,14 తేదీల్లో 2 రోజులు సాయంత్రం మెగా కల్చరల్ ఈవెంట్ను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.