Andhra Pradesh

News May 31, 2024

గుంటూరు: కట్నం కోసం భార్యను కొరికిన భర్త పై కేసు

image

అదనపు కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేసిన వైనం పెనమలూరు PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీకి, కానూరు సనత్‌నగర్‌కు చెందిన షేక్‌ ముస్కాన్‌కు ఏడాది కింద వివాహమైంది. వివాహమైన మూడు నెలల తర్వాత చెడు వ్యసనాలకు అలవాటైన భర్త అదనపు కట్నం తేవాలంటూ భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 31, 2024

కనిగిరి: గుండెపోటుతో బస్సులో ఫొటోగ్రాఫర్ మృతి

image

ఒంగోలు నుంచి కనిగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సులో వెలిగండ్ల మండలం అగ్రహారానికి చెందిన ఫొటోగ్రాఫర్ రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. ఒంగోలులో చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కనిగిరి డిపోలో ఆర్టీసీ డ్రైవర్ వెళ్లి చూడగా.. సీటులో పడిపోయి ఉన్నాడు. రామకృష్ణను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 31, 2024

పెనమలూరు: కట్నం కోసం భార్యను కొరికిన భర్త పై కేసు

image

అదనపు కట్నం కోసం భార్య ఒళ్లంతా కొరికేసిన వైనం పెనమలూరు PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కానూరు సనత్‌నగర్‌కు చెందిన షేక్‌ ముస్కాన్‌కు, గుంటూరుకు చెందిన షేక్‌ మహ్మద్‌ రఫీకి ఏడాది కింద వివాహమైంది. వివాహమైన మూడు నెలల తర్వాత చెడు వ్యసనాలకు అలవాటై కట్నం తేవాలంటూ భార్య ఒళ్లు కొరికేయడం, కొట్టడం చేస్తుండడంతో పుట్టింటికి వెళ్లి గురువారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News May 31, 2024

అనంత జిల్లాలో తొలి ఫలితం విడుదల ఇక్కడే..?

image

అనంత జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గం తొలి ఫలితానికి నాంది పలకనున్నట్లు తెలుస్తోంది. ఉరవకొండకు 18 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఇక్కడ 15 రౌండ్లకే లెక్కింపు పూర్తవుతుంది. దీంతో తొలి ఫలితం విడుదల కానుంది. కళ్యాణదుర్గం 19, గుంతకల్లు, తాడిపత్రి 20, శింగనమల, అనంత, రాప్తాడు 21, రాయదుర్గం 22 రౌండ్లలో లెక్కించనున్నారు. కాగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానుండగా.. గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News May 31, 2024

నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఏర్పాటు చేశాం: కలెక్టర్

image

జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయా కౌంటింగ్ కేంద్రాలలో 14 టేబుల్ ఏర్పాటు చేశామని సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం లేపాక్షిలో కలెక్టర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ కేంద్రాల్లోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు వెళ్లేందుకు భారీ ఏర్పాటు చేశామన్నారు. ఈవీఎంల కౌంటింగ్ కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారన్నారు.

News May 31, 2024

కర్నూలు జిల్లాలో తొలిఫలితం విడుదల ఇక్కడే..?

image

కర్నూలు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రాయలసీమ వర్శిటీలో జరగనుంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గాలకు సంబంధించి 17 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉండనుంది. కాగా తొలిఫలితం మంత్రాలయానిది వెలువడే అవకాశం ఉంది. చివరన ఆలూరు నియోజకవర్గ ఫలితం తెలియనుంది. మధ్యాహ్నం 3.30గంటలకు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

News May 31, 2024

గుంటూరు: అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తులు

image

అగ్నివీర్-వాయు ఉద్యోగాలకు ఆన్లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి గుంటూరు జిల్లా స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెంది పదో తరగతి విద్యార్హత కలిగిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు agnipathvayu.cdac.in వెబ్సైట్ ద్వారా జూన్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. తాత్కాలిక అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులు మాత్రమే రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటారన్నారు.

News May 31, 2024

బొమ్మూరు: కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన

image

పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కొరకు బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం ధ్రువపత్రాలను పరిశీలించామని ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం 59,001 నుంచి 79,000 వరకు ధ్రువపత్రాలను పరిశీలిస్తామన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ మొదటి వారంలో 144 సెక్షన్ విధింపు కారణంగా పాలిసెట్ అడ్మిషన్ల షెడ్యూల్లో మార్పులు వేశామని, జూన్ 3న అన్ని పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు.

News May 31, 2024

ఈసెట్‌లో విశాఖ విద్యార్థి సత్తా

image

రెండు తెలుగు రాష్ట్రాల ఈసెట్‌లో యారాడకుకి చెందిన మనోహర్ సత్తా చాటాడు. తెలంగాణ ఈసెట్‌లో మొదటి ర్యాంకు, ఏపీ ఈసెట్‌లో రెండో ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. తండ్రి గురనాథరావు ప్రైవేట్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండగా.. తల్లి పాపాజీ గృహిణి. ఈ సందర్భంగా మనోహర్‌ను పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రల కష్టాలు తీర్చడమే లక్ష్యమని మనోహర్ తెలిపాడు.

News May 31, 2024

నెల్లూరు: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు

image

నెల్లూరు జిల్లాలో 3,14,422 మంది లబ్ధిదారులకు పింఛన్ కానుక అందజేయనున్నారు. 2,28,471 మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జూన్ 5వ తేదీలోపు జమ చేస్తారు. దివ్యాంగులు, ఆరోగ్యం సక్రమంగా లేని 85,951 మంది లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దే నగదు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టింది.