India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురువారం సాయంత్రం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ముందుగా కంట్రోల్ రూమ్ సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాటుకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కమిషనర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఉన్నారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ తెలిపారు. నేడు విజయవాడలో సీపీ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిదిలోని నిమ్రా, నోవా కళాశాలలో జూన్ 4వ తేదిన జరుగు ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
ఏలూరు: ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణ సాధించి మెయిన్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ వెల్లడించారు. ఏలూరు బీసీ స్టడి సర్కిల్లోని అంబేద్కర్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో జూన్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సూళ్లూరుపేటలో స్నేహితుడిని కట్టేసి యువతిపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడి.. యువతికి ప్రభుత్వ వసతి సదుపాయం కల్పించి, కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.
విదేశీ పర్యటన ముగించుకుని సీఎం జగన్ దంపతులు శుక్రవారం తెల్లవారు జామున 4:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. జగన్కు రక్షణ కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన క్యాంపు కార్యాలయానికి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్లో కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
బైక్ వెనకాల నంబర్ లేకుండా మంత్రి తాలుకా అంటూ స్టిక్కర్లు వేయించుకుంటే వాటిని సీజ్ చేస్తామని అద్దంకి పట్టణ సీఐ కృష్ణయ్య తెలిపారు. పట్టణంలో గొట్టిపాటి రవి మంత్రి తాలూకా అని, మరొకరు అద్దంకి ఎమ్మెల్యే హనిమిరెడ్డి తాలూకా అని బైక్ నంబర్ ప్లేట్లపై పేర్లు రాయించుకుని తిరగడం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ క్రమంలో సీఐ వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
మండలంలోని నాగరాజు కాలవలో బుధవారం గల్లంతు అయిన వారిలో నాలుగో వ్యక్తి మృతదేహం గురువారం లభ్యం అయింది. మండలంలోని మూలపాలెం గ్రామం వద్ద కాలవలో నాలుగో వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అధికారులు రెండు రోజులు పాటు కృషి చేసి 4 మృతదేహాలను వెలికి తీశారు.
జూన్ 4 తేదీన జరుగనున్న కౌంటింగ్ సర్వం సిద్ధం చేశామని, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని రాజమండ్రి సీటీ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ కె.దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలోని 50- రాజమండ్రి సీటీ అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ హాలులో అన్ని విభాగాల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ రోజున విధి విధానాలను కమిషనర్ వివరించారు.
జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు ఎర్నాకులం టాటానగర్ మధ్య నడిచే రైలును విజయనగరం, కుర్థరోడ్, కటక్, జక్కాపుర, జరోలి మీదుగా మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 7 నుంచి 14 వరకు టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ జరోలీ, ఖాజాపూర్, కటక్, కుర్థరోడ్, విజయనగరం మీదుగా మళ్లించారు. సంబల్పూర్ డివిజన్లో జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రైళ్లు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.