Andhra Pradesh

News May 30, 2024

మట్టపర్రులో దర్శకుడు సుకుమార్ సందడి

image

ప్రముఖ దర్శకుడు, పుష్ప-2 దర్శకుడు సుకుమార్ తన స్వగ్రామం రాజోలు మండలం మట్టపర్రులో గురువారం సందడి చేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సొంత ఊరుకు వచ్చిన సుకుమారుడు పలువురు అభిమానులు కలిసి ఆయనతో సెల్ఫీలు దిగారు. అభిమానుల రాకతో సుకుమార్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇంతవరకు విడుదల చేసిన పుష్ప-2 చిత్రంలోని రెండు పాటలు అద్భుతంగా ఉన్నాయని పలువురు అభిమానులు సుకుమార్ కు అభినందనలు తెలిపారు.

News May 30, 2024

ఎచ్చెర్లలో నో ఫ్లయింగ్ జోన్

image

సార్వత్రిక ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎచ్చెర్ల శ్రీ శివాని ఇంజినీరింగ్‌లో జూన్ 4వ తేదిన స్ట్రాంగ్ రూముల చుట్టు పక్కల పరిసర ప్రాంతాల నుంచి 2 KM వరకు రెడ్ జోన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ జి.ఆర్.రాధిక గురువారం తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ ఎచ్చెర్ల శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద జరగనున్న సంగతి తెలిసిందే.

News May 30, 2024

పామర్రు: కడుపు నొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య

image

మండలంలోని కొండిపర్రు గ్రామంలో ఓ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి భరించలేక ఆటో డ్రైవర్ వెంకటేశ్ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.

News May 30, 2024

కొత్త లుక్‌లో మంత్రి పెద్దిరెడ్డి

image

ఎన్నికల పోలింగ్ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు.తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ చోట్ల వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పోలింగ్ ముగియడంతో రిలాక్స్ కోసం విహార యాత్రలకు వెళ్లారు. ఈక్రమంలో ఆయన కొత్త లుక్‌లో దర్శనం ఇచ్చారు. సాధారణంగా ఆయన ఎప్పుడూ తెల్లదుస్తుల్లో ఉంటారు. విహార యాత్రలో టీషర్టు ధరించి కళ్లజోడు పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది.

News May 30, 2024

స్వేచ్ఛగా ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

స్వేచ్ఛాయుతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పర్యవేక్షించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలకు కాట్రేనికోన మండలం చేయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేస్తామన్నారు.

News May 30, 2024

పుట్లూరు: బైక్‌ను ఢీకొన్న టిప్పర్.. వ్యక్తి దుర్మరణం

image

పుట్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి క్రాస్ వద్ద బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి రామలింగయ్యపల్లి గ్రామానికి చెందిన ధనాచారిగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు.

News May 30, 2024

శ్రీకాకుళం: బాలికపై లైంగిక వేధింపులు

image

జలుమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు పక్క గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఉంది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో శ్రీకాకుళం నగరంలో నివాసముంటూ కుమార్తెను చదివిస్తున్నారు. ఆ యువకుడు బాలికను మళ్లీ కలుస్తుండేవాడు. తనతో తీసుకున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసుదేవరావు తెలిపారు.

News May 30, 2024

ప.గో: జీవశాస్త్రం పరీక్షకు 2,748 మంది హాజరు

image

పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా గురువారం జీవశాస్త్రం పరీక్ష నిర్వహించారు. 7,058 మంది విద్యార్థులకు గాను 4,310 మంది హాజరయ్యారు. 2,748 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్‌వి.రమణ తెలిపారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని అన్నారు.

News May 30, 2024

విశాఖ: స్కూల్ బస్సుల ఫిట్నెస్‌పై ఆదేశాలు

image

జూన్ 12వ తేదీలోగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చేసుకోవాలని ఉప రవాణా కమీషనర్ రాజరత్నం అన్నారు. గురువారం ఉపరవాణా కమీషనర్ కార్యాలయంలో స్కూల్ బస్సుల యాజమాన్యంతో సమావేశమై మాట్లాడారు. స్కూల్, కళాశాల బస్సులలో డ్రైవర్లకు కనీసం ఐదేళ్ల అనుభవంతో పాటు 50 ఏళ్లు మించకుండా ఉండాలన్నారు. డ్రైవర్లకు విధిగా కంటి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు. స్కూల్ బస్సులో తప్పనిసరిగా ఒక సహాయకుడు ఉండాలని చెప్పారు.

News May 30, 2024

శ్రీకాకుళం: పొరపాట్లు లేకుండా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

image

పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులు నిర్వహించాలని, EC నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా పరిషత్ మందిరంలో బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలన్నారు.