India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కడప జిల్లాలో జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. తొలుత సైన్యంలో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించి వచ్చిన ఓట్లు, తర్వాత పోస్టల్ బ్యాలట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు. 8.30కు EVMలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. సగటున ప్రతి 30 నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఉదయం 10-11గంటల మధ్య ఫలితాలపై కొంత స్పష్టత వస్తుందన్నారు.
పాల ప్యాకెట్ కోసం బైక్పై కుమారుడితో వెళ్తూ తండ్రి మృతి చెందాడు. కొవ్వూరుకు చెందిన శెట్టి కనకప్రసాద్(35) ఉపాధి నిమిత్తం 10 రోజుల కింద హైదరాబాద్ వెళ్లాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని బైక్పై వెళ్తుండగా.. HYD ఇనాంగూడ వద్ద డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె వారపు సంత క్రాస్ వద్ద ఉండే గ్యాస్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించడంతో సిబ్బందితో వెళ్లి మంటలు అదుపు చేశామన్నారు. సకాలంలో మంటలు ఆర్పడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదన్నారు. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్ను సైదాపేటకు చెందిన భాష గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఎన్నికల ఫలితాల రోజు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే మెసేజ్లు పంపితే గ్రూప్ అడ్మిన్ మీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు గెలిచినా పాజిటివ్గా ఉండాలని అన్నారు. అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు.
పాల ప్యాకెట్ కోసం బైక్పై కుమారుడితో వెళ్తూ తండ్రి మృతి చెందాడు. కొవ్వూరుకు చెందిన శెట్టి కనకప్రసాద్(35) ఉపాధి నిమిత్తం 10 రోజుల కింద హైదరాబాద్ వెళ్లాడు. గురువారం ఉదయం పాల ప్యాకెట్ కోసం తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని బైక్పై వెళ్తుండగా.. HYD ఇనాంగూడ వద్ద డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం దగ్గరలోని మారుతీ నగర్ ఫస్ట్ క్లాస్ వద్ద గురువారం రైలులో నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల మేరకు బెంగళూరు నుంచి బళ్లారి వెళ్లే హంపి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సురేశ్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఓట్ల లెక్కింపునకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్కు సంబంధించిన సాంకేతిక అంశాలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 94 నంబర్ గల గుంటూరు వెస్ట్ అసెంబ్లీ లో మొత్తం 282 పోలింగ్ బూత్లలో ఓటింగ్ జరిగింది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో 21 రౌండ్లలో లెక్కించనున్నారు. రౌండ్ల వారీగా ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది.
చెన్నై నుంచి మిర్యాలగూడకు వెళుతున్న కారులో భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు హైవే మీద ఉన్న టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా మద్దిశెట్టి మల్లేష్ వద్ద బిల్లులు లేకుండా 112 గ్రాముల బంగారం తీసుకెళ్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఇందులో రూ.58 వేలు నగదు, రూ.89,98,220 విలువచేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని ఎస్సై పున్నారావు తెలిపారు.
జిల్లాలో జూన్ 4వ తేదీన సాయంత్రం ఐదు గంటలలోగా ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఆయన మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం వేస్తున్నట్లు, నియోజకవర్గానికి ఐదు చొప్పున టేబుల్ వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
జిల్లాలో పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఫలితాల కోసం అటు అభ్యర్థులు, ఇటు ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ఉంది. 2019లో ఉమ్మడి జిల్లాలో 10 స్థానాలను క్లీన్ స్విప్ చేసిన YCP ఈసారి అదే ధీమాతో ఉంది. అటు TDPకి ఈసారి మెజార్టీ సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటోంది. మరోవైపు కాంగ్రెస్ పట్టు సాధించాలని చూస్తుండగా, దీంతో ఎవరు గెలుస్తారా అని చర్చ నడుస్తోంది. మరి మీ MLAగా ఎవరు గెలవబోతున్నారు.
Sorry, no posts matched your criteria.