Andhra Pradesh

News May 30, 2024

వై.పాలెం: విధులు మరిచి తన్నుకున్న పోలీసులు

image

పోస్టల్ బ్యాలెట్ బాక్సుల వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు తమ విధులను మరిచారు. మంగళవారం రాత్రి పూటుగా మద్యం సేవించి ఆ మత్తులో మాట మాట పెరిగి వాగ్వాదానికి దిగి కొట్టుకున్న సంఘటన వై.పాలెంలోని అర్వో కార్యాలయం వద్ద జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారి అక్కడికి చేరుకుని పరిశీలించి మద్యం పరీక్ష నిర్వహించి తాగినట్లు గుర్తించి విధుల నుంచి తొలగించారు.

News May 30, 2024

ఆరో రౌండ్‌తో తేలనున్న పొదలకూరు లెక్క

image

సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో పొదలకూరు మండలం హాట్ టాపిక్ గా మారింది. ఈ మండలమే విజేత ఖరారులో కీలకం కానుంది. పొదలకూరు మండలంలో 73 పోలింగ్ కేంద్రాలున్నాయి. సూరాయపాళెంతో మొదలై బ్రాహ్మణపల్లి ఈవీఎంతో ఈ మండలం కౌంటింగ్ ముగుస్తుంది. ఐదు రౌండ్ల వరకు పూర్తిగా పొదలకూరు మండలానికి సంబంధించిన ఈవీఎంల కౌంటింగే జరుగుతుంది. ఆరో రౌండ్ కు కేవలం మూడు ఈవీఎంలు మిగులుతాయి.

News May 30, 2024

ధర్మవరంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సమీపంలోని ధర్మవరం చెరువు రెండవ మరువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం స్థానికులు సమాచారం అందించడంతో ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అయితే ఆయన ఎవరు అనేది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

News May 30, 2024

బాపట్ల: భవనం పైనుంచి పడి బాలుడి మృతి

image

చుండూరు మండలం ఆలపాడుకు చెందిన చేబ్రోలు సురేంద్ర (15) ఈనెల 20న స్నేహితులతో ఆడుకుంటూ.. స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాల భవనంపైకి ఎక్కాడని బంధువులు తెలిపారు. ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద గచ్చు మీద పడిపోయాడన్నారు. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు తీవ్ర గాయమవ్వగా.. గుంటూరులోని సర్వజన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.

News May 30, 2024

కర్నూలు : డిగ్రీ పరీక్షలకు 350 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లాలోని రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలకు బుధవారం 350 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాస్తూ డిబార్ అయినట్లు వీసీ ప్రకటించారు. నాలుగో సెమిస్టర్‌లో మొత్తం 3,709 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 3,359 మంది హాజరయ్యారని వీసీ సుధీర్ ప్రేమ్ కుమార్ వెల్లడించారు.

News May 30, 2024

పుంగునూరు: తగ్గుతున్న టమాటా ధరలు

image

టమోటా ధరలు మూడు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. 15 కిలోల బాక్సు ధర సోమవారం రూ.600 పలికింది. అప్పటి నుంచి రోజుకు వంద చొప్పున తగ్గుతూ బుధవారం నాటికి రూ.350 అధిక ధర పలకగా.. మొత్తంగా రూ.300కు చేరింది. ప్రస్తుతం కోతల దశలో తోటలు ఉండడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

News May 30, 2024

నాగార్జున యూనివర్సిటీకి జాతీయ ర్యాంక్

image

ది వీక్- హన్సా రీసెర్చ్ – బెస్ట్ యూనివర్సిటీ సర్వే – 2024 ర్యాంకింగ్స్ మల్టీడిస్సిప్లినరీ యూనివర్సిటీ కేటగిరిలో, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 16వ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకును కైవసం చేసుకుంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కృషి వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని వీసీ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇటువంటి ర్యాంకుల ద్వారా విశ్వవిద్యాలయ కీర్తి మరింత ఉన్నత స్థాయికి చేరుతుందన్నారు.

News May 30, 2024

కోనసీమ: రికార్డు స్థాయిలో ‘పనస’ విక్రయాలు

image

కోనసీమ జిల్లా అంటే గుర్తొచ్చేవి కొబ్బరి తోటలు. వీటి మధ్యే అంతర్ పంటగా వేసే ‘పనస’ సైతం మంచి దిగుబడితో లాభాలు తెచ్చిపెడుతోంది. అంబాజీపేట మార్కెట్‌కు రోజూ 500-700లకు పైగా పనసకాయలు వస్తుంటాయి. జిల్లా నుంచి HYD, ఇతర నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈఏడాది జిల్లాలో 79.36 ఎకరాల్లో సాగు కాగా.. ఇప్పటికే రూ.7 కోట్ల వ్యాపారం జరిగినట్లు సమాచారం. 10-15 కాయలు కాసే చెట్టుకు ఈసారి 25 కాసినట్లు రైతులు చెబుతున్నారు.

News May 30, 2024

కృష్ణా: జూన్ 7తో ముగియనున్న రీవాల్యుయేషన్ గడువు

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలో ఫిబ్రవరి/మార్చి 2024లో నిర్వహించిన డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలకు (సెమిస్టర్ ఎండ్) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా నిర్ణీత ఫీజు రూ.770 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News May 30, 2024

ప.గో: విషాదం.. భార్యపై అలిగి భర్త ఆత్మహత్య

image

భార్యపై అలిగి భర్త సూసైడ్ చేసుకున్న ఘటన ప.గో జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది. SI నాగబాబు వివరాల ప్రకారం.. అమృతరావు కాలనీకి చెందిన బాలుప్రసాద్(31) ఓ ఖాళీ స్థలాన్ని కొని అప్పులపాలయ్యాడు. అవి తీర్చేందుకు కువైట్ వెళ్తానని భార్యకు చెప్పగా ఆమె ఒప్పుకోలేదు. కోపంతో పుట్టింటికి వెళ్లిపోవడంతో బాలు ప్రసాద్ ఈనెల 24న పురుగు మందు తాగాడు. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28న మృతి చెందాడు.