India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసుపత్రిలో అబార్షన్ అయిన వారి వివరాలు సేకరించడంతోపాటు ఎక్కడ స్కానింగ్ చేయించింది, ఎక్కడ అబార్షన్లు చేయించుకున్నారు తదితర వివరాలను కచ్చితంగా సేకరించి నమోదు చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ ఆదేశించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. పలువురు వైద్యులు పాల్గొన్నారు.
ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు నిర్వహించాలని అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పేర్కొన్నారు. లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బంది ప్రతి అంశంపైనా అవగాహన కలిగి ఉండాలని, సందేహాలుంటే శిక్షణ సమయంలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపుపై బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును బుధవారం HYDలోని ఆయన స్వగృహంలో ఉండి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందించారు. కాసేపు రాజకీయ అంశాలపై చర్చించారు.
తూ.గో. జిల్లా రాజానగరం నియోజకవర్గ MLAగా కూటమి(జనసేన) అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గెలుపొందాలని జనసేన అభిమాని వివేక్ విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కుకున్నాడు. ఈ మేరకు మొక్కు చెల్లించుకునేందుకు రాజానగరం నుంచి బుధవారం పాదయాత్రగా బయలుదేరాడు.
తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూం భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 24 గంటలూ ఈవీఎంల రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీటెక్ ఎనిమిదవ, బీటెక్ ఏడవ సెమిస్టర్(స్పెషల్) పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై వర్శిటీ అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తెలిపారు. బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీవ్ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో ఎన్నికల ఓట్ల లెక్కింపు, లా అండ్ ఆర్డర్ సమస్యలు తదితర అంశాలపై ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టర్ అందులో పాల్గొని పలు అంశాలను వివరించారు.
వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుల సౌలభ్యం కోసం కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే 2 ట్రైన్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.20811 విశాఖపట్నం- నాందేడ్(జూన్ 1 నుంచి 29), నం.20811 నాందేడ్- విశాఖపట్నం(జూన్ 2 నుంచి 30) ట్రైన్లకు ఒక స్లీపర్ కోచ్, 3 ఏసీ త్రీ టైర్ ఎకానమీ కోచ్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకటించిన తేదీల్లో ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేశామన్నారు.
తుగ్గలికి చెందిన ఎఫ్.పి. షాప్ డీలర్ మహమ్మద్ బాషా (70) అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను వైద్య చికిత్సల కోసం కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సలు పొందుతూ బాషా బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎఫ్.పి. సంఘానికి, పత్తికొండ నియోజకవర్గానికి బాషా ఎనలేని సేవలందించాడు. బాషా మృతితో గ్రామంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి.
మందస మండల కేంద్రంలో నివాసముంటున్న ఎల్ఐసి ఏజెంట్ వెంకటేశ్వరరావు(60) బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉన్నారు.
Sorry, no posts matched your criteria.