Andhra Pradesh

News May 29, 2024

సింహాచలం సింహాద్రి అప్పన్న మొత్తం హుండీల ఆదాయం

image

సింహాద్రి అప్పన్న హుండీల ఆదాయం మొత్తం రూ.3,56,22,159 లభించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. మొత్తం 40 హుండీలలో ఈనెల 28న <<13332978>>15 హుండీలు<<>> లెక్కించగా, బుధవారం 25 హుండీలను లెక్కించినట్లు తెలిపారు. రెండు రోజులకు కలిపి బంగారం 142.1 గ్రాములు, వెండి 28.44 కేజీలు లభించినట్లు తెలిపారు. అలాగే వివిధ దేశాల కరెన్సీ కూడా లభ్యమైందని పేర్కొన్నారు.

News May 29, 2024

పలాస-విశాఖ-పలాస రైళ్లు రద్దు

image

పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31న పలాస నుంచి విశాఖ వచ్చే పాసింజర్ రైలును, విశాఖ నుంచి పలాస వెళ్లే పాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

News May 29, 2024

చెన్నై ఆసుపత్రిలో గుత్తి యువతి మృతి

image

గుత్తి పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన న్యాయవాది నగదాని రాజశేఖర్ కుమార్తె మాధురి(26) చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కొన్ని రోజులుగా మాధురి అనారోగ్యంతో బాధపడుతుండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మాధురి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News May 29, 2024

తిరుపతి జిల్లాలో 100 మందిపై రౌడీషీట్?

image

ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లాలో జరిగిన అల్లర్లపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. దాడులకు పాల్పడిన వారితో పాటు పాత నేరస్థులపై రౌడీషీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేయనుందట. ఇప్పటికే 57 మందిని గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. త్వరలో మరికొందరి వివరాలు సేకరించి దాదాపు 100 మందిపై రౌడీషీట్ తెరుస్తారని తెలుస్తోంది.

News May 29, 2024

చిట్వేలి: 37 ఏళ్ల తర్వాత ఈ ఊర్లో జాతర

image

చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం గ్రామపంచాయతీ పరిధిలోని ఎగవూరు గంగమ్మ జాతర గురువారం జరగనున్నది. ఈ జాతర జరిగి దాదాపు 37 సంవత్సరాలు కావస్తోంది. ఊరిలో ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఈ తల్లి ఆశీసులతో ప్రారంభిస్తారని గ్రామస్థులు తెలిపారు. 37 సంవత్సరాల తర్వాత యువకులు అంతా ఎలాగైనా జాతర జరిపించుకోవాలని పట్టుబట్టి మరీ నిర్వహిస్తున్నారు. ఊరంతా బంధువులతో కళకళలాడుతోంది.

News May 29, 2024

పలాస: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం సుమ్మాదేవి రైల్వే గేట్ సమీప జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు గాయాల పాలయ్యాడు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని ఓ ప్రైవేట్ వాహనంలో పలాస ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును వెతికే పనిలో ఉన్నారు.

News May 29, 2024

శ్రీకాకుళం: ఓట్లు లెక్కింపు ప్రక్రియపై శిక్షణ

image

జూన్ 4వ తేదీన జరుగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్కింపు ప్రక్రియపై సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇచ్చారు . పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లు ఓట్లు లెక్కింపు ఎలా చేయాలన్న దానిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి మాక్ డ్రిల్ జూన్ 3వ తేదీన ఉంటుందని తెలిపారు.

News May 29, 2024

మచిలీపట్నం: లాడ్జీలలో ఎస్పీ అద్నాన్ ఆకస్మిక తనిఖీలు

image

ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మచిలీపట్నంలోని పలు లాడ్జ్‌లలో తనిఖీలు చేపట్టారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు గాను ఆయన ఆ తనిఖీలు చేస్తున్నామని తెలపారు. లాడ్జ్‌లలో ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులపై పోలీసు నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తదితరులు ఉన్నారు.

News May 29, 2024

కృష్ణా: ‘పొరపాట్లకు అస్కారం లేకుండా పోస్టల్ ఓట్ల లెక్కింపు’

image

పొరపాట్లకు అవకాశం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపును సక్రమంగా చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అవగాహన కల్పించారు. కృష్ణా వర్సిటీలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్, తర్వాత EVM ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.

News May 29, 2024

గుంటూరు: పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు

image

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ఉన్నందున జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు 144 సెక్షన్ విధింపు కారణంగా.. గుంటూరు జిల్లాలో పాలిసెట్-2024 అడ్మిషన్ల ప్రక్రియలో మార్పులు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు బుధవారం సవరణ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. జూన్ 3న జరగాల్సిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 6న నిర్వహిస్తామని పేర్కొన్నారు.