Andhra Pradesh

News May 29, 2024

YSR పాపాలే.. చనిపోవడానికి కారణం: బీటెక్ రవి

image

మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల TDP MLA అభ్యర్థి బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘రాజశేఖర్ రెడ్డి సీఎం అవడం కోసం పులివెందులలో కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పుల వలనే ప్రకృతి కూడా పసిగట్టి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. సీఎం అయ్యాక YSR మారినారన్నారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రారని అన్నారు.

News May 29, 2024

బాపట్ల: నలుగురు యువకులు గల్లంతు

image

బాపట్ల రూరల్ పరిధిలోని నాగరాజు కాలువలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. స్థానికులు సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి సూర్యలంక తీరానికి వచ్చిన యువకులు బాపట్ల అప్పికట్ల రహదారిలో ఉన్న యార కాలువలో ఈత కోసం దిగారు. లోతు ఎక్కువ ఉండటంతో గల్లంతు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, గాలింపు చర్యలు చేపట్టారు.

News May 29, 2024

విశాఖ: ఫోన్ చూడొద్దన్నందుకు బాలిక సూసైడ్

image

విశాఖ వాంబే కాలనీలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఫోన్ చూడొద్దని తల్లి మందలించడంతో ఓ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మరణించడంతో తల్లితో కలిసి బాలిక(15) వాంబే కాలనీలో నివాసం ఉంటుంది. బాలికను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News May 29, 2024

మరో 6 రోజులే.. శ్రీకాకుళంలో ఆధిపత్యం ఎవరిది.?

image

సార్వత్రిక ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 6 రోజులే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 8 అసెంబ్లీ, టీడీపీ 1 MP, 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోన్నాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 29, 2024

జూన్ 3న మంగళగిరికి పవన్ కళ్యాణ్ 

image

జూన్ 3న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయానికి రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పవన్ పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పవన్ పిలుపునిచ్చారు.

News May 29, 2024

సింహాచలంలో నేత్ర పర్వంగా అప్పన్న నిత్య కల్యాణం

image

సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ స్వామి నిత్య కల్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండ పంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.

News May 29, 2024

వెంకటాచలం: అటువైపు వెళ్లే వారు జాగ్రత్త

image

తిక్కవరప్పాడు-కంటేపల్లి మార్గంలో తిక్కవరప్పాడు బ్రాంచ్ కెనాల్‌పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నిత్యం పలు గ్రామాల రైతులు, ప్రయాణికులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు శిథిలమై సగంపైగా కూలిపోవడంతో బైకులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి. అదుపుతప్పితే ప్రమాదం జరిగేలా ఉంది. సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News May 29, 2024

మైదుకూరు: మిస్ ఆంధ్రప్రదేశ్ రన్నర్‌గా గాయత్రిరెడ్డి

image

మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం తవ్వారుపల్లి గ్రామానికి చెందిన హోంగార్డ్ చంద్రమోహన్ రెడ్డి కుమార్తె గాయత్రి రెడ్డి మిస్ ఆంధ్రప్రదేశ్ రన్నర్‌గా ఎంపికైంది. ఈ సందర్భంగా బుధవారం మండల ప్రజలు, చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. గాయత్రిరెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

News May 29, 2024

కర్నూలు: 27,998 ఆరోగ్య శ్రీ కేసులతో ప్రథమ స్థానం

image

కర్నూలు సర్వజన వైద్యశాలలో గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది మే వరకు 27,998 ఆరోగ్యశ్రీ కింద కేసులు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటరంగారెడ్డి తెలిపారు. ఆస్పత్రిలోని ధన్వంతరీ హాలులో అన్ని విభాగాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.2 కోట్ల విలువైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

News May 29, 2024

కర్నూలు: 19 లక్షల పత్తి విత్తన ప్యాకెట్ల సరఫరాకు చర్యలు

image

కర్నూలు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 2.50 లక్షల హెక్టార్లకుపైగా పత్తి సాగయ్యే అవకాశాలున్నాయి. 450 గ్రాముల విత్తన ప్యాకెట్లు హెక్టార్ కు 8 అవసరం కాగా, జిల్లాలో సాగుకు సంబంధించి 20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరం ఉంది. జిల్లాకు 16 పత్తి విత్తన కంపెనీలు 19 లక్షల విత్తన ప్యాకెట్లను సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు నివేదించాయి.