Andhra Pradesh

News May 29, 2024

గుంటూరు: జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారులు

image

జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన ఎస్.చరణ్, హాసిని ఎంపికయ్యారని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గంగాధరరావు, కడియం జయరావు మంగళవారం పేర్కొన్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు పంజాబ్‌లో జరగనున్న జాతీయ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. ఈనెల 15 నుంచి 17వరకు విజయవాడలో జరిగిన రాష్ట్ర పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా వీరి ఎంపిక జరిగిందన్నారు.

News May 29, 2024

కుప్పం: బంగినపల్లి టన్ను రూ.50 వేలు

image

మామిడి పండ్లకు మార్కెట్ లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కుప్పం ప్రాంతంలో వేల ఎకరాలలో బంగినపల్లి, తోతాపురి, నీలం, చందూరా తదితర రకాల మామిడికాయలు సాగు చేస్తున్నారు. బంగినపల్లి టన్ను 42 వేల నుంచి 50 వేలు, చందూరా రకం 30 వేల నుంచి 40 వేలు వరకు ధర పలుకుతోంది. క్రిమి సంహారక మందుల ఖర్చు కూడా రావడం లేదని రైతులు అంటున్నారు.

News May 29, 2024

VZM:రూ.91,795 ఈ-చలనాలు విధింపు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఎం.దీపిక పాటిల్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, సిబ్బంది గడచిన 24 గంటల్లో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. మోటార్ వెహికల్ నిబంధనలు అతిక్రమించిన 287 మందికి రూ.91,795 ఈ-చలానాలను విధించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 11 కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై నమోదు చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం తెలిపింది.

News May 29, 2024

విజయవాడ: అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కమిషనర్!

image

విజయవాడలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురు అధికారులకు విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు వలన ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్న స్థానికుల ఫిర్యాదుల మేరకు, నీటిని పరీక్షల కోసం అధికారులు గుంటూరు ల్యాబ్స్‌కి పంపించారు. ల్యాబ్ ఫలితాల అనంతరం మీడియాకు వివరాలు వెల్లడిస్తామన్నారు.

News May 29, 2024

తూ.గో జిల్లాలో విస్తృతంగా కార్డెన్ సెర్చ్

image

తూ.గో జిల్లాలో గత పది రోజులుగా కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు విస్తృతంగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ పి.జగదీశ్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో మంగళవారం నంబర్లు, రికార్డులులేని 498 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 105 లీటర్ల సారా, 42 మద్యం సీసాలు, రూ.10,950 విలువైన మందుగుండు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ప్రతి రోజూ ఈ ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు.

News May 29, 2024

నేషనల్ టీం బాస్కెట్ బాల్ శిక్షణకు అనంత కుర్రాడు

image

అనంతపురానికి చెందిన ద్వారకానాథ రెడ్డి ఇండోర్‌లో జూన్ 6 నుంచి జులై 6 వరకు జరిగే భారత జూనియర్ బాస్కెట్ బాల్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఈ శిబిరంలో మంచి ఆట తీరును ప్రదర్శిస్తే దక్షిణాసియా జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు భారత జట్టుకు ఎంపిక చేస్తారు. ఇటీవల జరిగిన అండర్-18 జాతీయస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ఈ శిబిరానికి ఎంపిక చేసినట్లు జిల్లా బాస్కెట్ బాల్ కార్యదర్శి నరేంద్ర చౌదరి తెలిపారు.

News May 29, 2024

కే‌జీహెచ్ సూపరింటెండెంట్‌పై ఫిర్యాదు

image

కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తనను లైంగికంగా వేధించినట్లు ఇటీవల సరండర్ అయిన ఓ గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2023 జనవరి నుంచి అశోక్ కుమార్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని, కులం పేరుతో దూషించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వన్ టౌన్ పోలీసులను వివరణ కోరగా ఫిర్యాదు అందినట్లు తెలిపారు.

News May 29, 2024

VZM: ఎమ్మెల్సీ రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ

image

ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై ఈనెల 31న విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన రఘురాజు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని మండలి ఛైర్మన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం అనర్హతపై ఛైర్మన్ మోషేన్ రాజు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఎన్నికల ముందు అతని భార్య టీడీపీలో చేరగా ఆయన మాత్రం వైసీపీలో ఉంటూ టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు విమర్శలున్నాయి.

News May 29, 2024

సారవకోట: గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

సారవకోట మండలం అన్నుపురం గ్రామానికి చెందిన యడ్ల పోలీసు(65) డాబా పై నుంచి జారిపడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసు ఈ నెల 23న రాత్రి భోజనం చేసి డాబాపై నిద్రించాడు. మూత్ర విసర్జనకు కిందకు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కేజీహెచ్‌కు తరలించగా వైద్య సహాయం పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

News May 29, 2024

ప్రకాశం జిల్లాలో వేడిగాలులు

image

ప్రకాశం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఆరు గంటలు దాటినా వేడి గాలుల తీవ్రత కొనసాగుతోంది. పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత కారణంగా జనం బయటకు అడుగు పెట్టేందుకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. జిల్లాలోని 21 గ్రామాల్లో మంగళవారం 40 డిగ్రీలకు పైగా నమోదవ్వగా, మాలెపాడులో అత్యధికంగా 42.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.