India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అనంతపురం కలెక్టరేట్లో గురువారం సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాలు, తెగల వర్గాల నుంచి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అర్జీలు స్వీకరించారు. అర్జీలను స్వీకరించిన ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఎస్పీ జగదీష్, DRO ఏ.మలోల, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్, అనంతపురం ఆర్డీఓ కేశవ నాయుడు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఏరినాలో మహిళల రక్షణ, POCSO చట్టంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ప్రేమ ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలవుతున్నారన్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, నిరంతరం కష్టపడుతున్న తల్లిదండ్రులు కోసం ఒక్క క్షణం ఆలోచించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. CP శంకబ్రాత బాగ్చి ఉన్నారు.
తాటి చెట్టు పై నుంచి కింద పడటంతో తీవ్ర గాయాల పాలైన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో గురువారం చోటుచేసుకుంది. దిగువమెట్టకు చెందిన సిరివల్ల రామచంద్రుడు (42) తాటి చెట్టు ఎక్కి తాటి నుంజలు కోస్తూ ఉండగా జారి కింద పడటంతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్లోని గోదాంను రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. గోదాములో అమలులో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
నెల్లూరు జిల్లాలో 10వేల హెక్టార్లలో నిమ్మపంట సాగవుతోంది. వివిధ రకాల తెగుళ్లు ఆశించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తోటలు పాడైపోతున్నాయి. ముఖ్యంగా ఈపంటపై ఆకు ముడత, పండ్ల రసాన్ని పీల్చే రెక్కల పురుగులు, బంక, వేరుకుళ్లు, గజ్జి, మొజాయిక్ తెగుళ్లు ఆశించాయి. వీటి నివారణకు రైతులు సస్యరక్షణ చర్యలు పాటించాలని పొదలకూరు ఉద్యాన అధికారి ఆనంద్ సూచించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం పునాదిపాడులో పర్యటించనున్నారు. అనంతరం పెనమలూరు మండలం వణుకూరులోని దాన్యం సేకరణ కేంద్రాలను పరిశీలిస్తారు. ఈ పర్యటనలో మంత్రి వెంట సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, సంభందిత ఆధికారులు పాల్గొంటారు.
నూతన నెల్లూరు జిల్లా జడ్జిగా శ్రీనివాసును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం కలెక్టర్ ఓ.ఆనంద్ జాయింట్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి స్వాగం పలికారు. అనంతరం జిల్లాల్లోని పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట జిల్లా అధికారులు ఉన్నారు.
కృష్ణా జిల్లాలో నీటి తీరువా పన్నును అత్యధిక ప్రాధాన్యతతో వసూలు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్లోని క్యాంపు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి రెవెన్యూ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.32కోట్ల నీటి తీరువా పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.9కోట్లు వసూలు చేశారన్నారు.
చిత్తూరు జిల్లాలో రేషన్ పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎస్వో శంకరన్ తెలిపారు. ఇప్పటి వరకు 87 శాతం రేషన్ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అధిక శాతం మంది కార్డుదారులు రేషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో పంపిణీని ఈనెల 20వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించినట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.