Andhra Pradesh

News September 25, 2025

కంచిలి: లారీ ఎక్కించి ఇద్దరిని చంపిన డ్రైవర్..!

image

కంచిలి(M) జలంతరకోట జంక్షన్ సమీపంలో హైవేపై బుధవారం రాత్రి జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కంటైనర్ డ్రైవర్ దాబాలో భోజనం చేశాడు. డబ్బులు చెల్లించే క్రమంలో హోటల్ ఓనర్ మహమ్మద్ హయాబ్‌తో అతనికి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హోటల్ యజమానితో పాటు మరో వ్యక్తి పై నుంచి డ్రైవర్ లారీని పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఎస్సై పారినాయుడు దర్యాప్తు చేస్తున్నారు.

News September 25, 2025

విశాఖ: ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు

image

విశాఖలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ACBకి చిక్కారు. రవితేజ తన ఇంటికి సంబందించి సర్వే నంబర్ తప్పుగా ఉందని.. సర్వే చేసి సరైన రిపోర్టు ఇవ్వాలని ములగడ MRO ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. సర్టిఫికెట్‌కు రూ.30 వేలు లంచం ఇవ్వాలని సర్వేయర్ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ నగేశ్ డిమాండ్ చేయడంతో ACBకి ఫిర్యాదు చేశాడు. గురువారం మహాత్ కాలనీ సచివాలయం వద్ద లంచం తీసుకుంటుండగా వీరిని పట్టుకున్నారు.

News September 25, 2025

26న రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు పంపిణీ

image

తుళ్లూరు: భూ సమీకరణ పథకంలో భూములను ఏపీ సీఆర్డీఏకు అప్పగించిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తున్నట్టు సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు గురువారం తెలిపారు. ఈ నెల26వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ జరుగుతుందన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను పంపిణీ చేయనున్నారు.

News September 25, 2025

కడప: ‘జీఎస్టీ తగ్గింపుపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి’

image

జీఎస్టీ పన్నుల తగ్గింపు గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు జీఎస్టీ గురించి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

News September 25, 2025

చిత్తూరు: ఎన్నిరకాల గ్రానైట్ రాళ్లు లభ్యమవుతాయో తెలుసా!

image

చిత్తూరు, పూతలపట్టు, నగరి, జీడీ నెల్లూరులో దాదాపు 400 క్వారీల్లో <<17827190>>గ్రానైట్ తవ్వకాలు<<>> సాగుతున్నాయి. చీటా బ్రౌన్, సి-గ్రీన్, మల్టీ రెడ్‌లతో పాటు అత్యంత ఖరీదైన బ్లాక్ గ్రానైట్ జీ-20 రకం జిల్లాలో లభ్యమవుతుంది. ఇక్కడ దొరికే గ్రానైట్ ఏపీలోనే కాకుండా సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. చిత్తూరు నుంచి చెన్నై, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగాతోపాటు బెంగళూరు, కేరళకు సైతం సరఫరాచేస్తారు.

News September 25, 2025

ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచన

image

ఒంగోలులో నీటి కుంటల్లో నీరు నిల్వ ఉంది. దీంతో పిల్లలు వాటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని SP హర్షవర్ధన్ రాజు అన్నారు. ఈత సరదా కోసం చిన్నారులు వెళ్లి తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చవద్దని చెప్పారు. జోరు వర్షాలతో నీటి కుంటల్లో నీరు ఉందని గమనించాలన్నారు.

News September 25, 2025

పెండింగ్ కేసులు తగ్గించండి: ఎస్పీ

image

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనకు టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతీ కేసును 60 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. వివిధ అంశాలపై చర్చించారు.

News September 25, 2025

తూ.గో: ‘ఇండియా స్కిల్స్’ పోటీలు.. త్వరపడండి..!

image

ఇండియా స్కిల్స్ కాంపిటీషన్-2025లో పాల్గొనేందుకు ఆసక్తి గల యువత ఈ నెల 30 లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తూ.గో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి మురళి తెలిపారు. 16 నుంచి 25 సంవత్సరాల వయస్సు గల యువతీయువకులు అర్హులన్నారు. యువతలోని సృజనాత్మకత, నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇదో అద్భుత వేదిక అని ఆయన పేర్కొన్నారు.

News September 25, 2025

తూ.గోలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో హౌస్ బోట్స్, క్రూయిజ్ అభివృద్ధిపై ఆమె సమీక్షించారు. గోదావరి తీరం, కడియం నర్సరీలు, దేవాలయాలు పర్యాటకులను ఆకర్షించే శక్తి కలిగి ఉన్నాయన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

News September 25, 2025

అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా అవినాష్ శెట్టి

image

అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా కర్నూలు జిల్లాకు చెందిన యోగా సంఘం అధ్యక్షుడు అవినాష్ శెట్టిని నియమిస్తూ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణ, అంతర్జాతీయ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ధర్మచారి మైత్రీవనం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025 నుంచి 2028 వరకు అవినాష్ శెట్టి పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. అవినాష్ శెట్టికి క్రీడాకారులు అభినందనలు తెలిపారు.