Andhra Pradesh

News January 23, 2026

ప్రొద్దుటూరు పెట్రోల్ బంక్ స్కాంలో కొత్త ట్విస్ట్..!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ గురువారం సుమారు రూ.50 లక్షల విలువైన చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశారు. వివిధ తేదీలతో సుమారు 10 చెక్కులు ఇచ్చారు. వీటిలో కొన్ని చెక్కులను గురువారం బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయ్యాయని తెలిసింది. కావాలనే బౌన్స్ అయ్యేలా చెక్కులిచ్చినట్లు మున్సిపల్ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది.

News January 23, 2026

ప్రొద్దుటూరు పెట్రోల్ బంక్ స్కాంలో కొత్త ట్విస్ట్..!

image

ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ ప్రవీణ్ గురువారం సుమారు రూ.50 లక్షల విలువైన చెక్కులను మున్సిపాలిటీకి జమ చేశారు. వివిధ తేదీలతో సుమారు 10 చెక్కులు ఇచ్చారు. వీటిలో కొన్ని చెక్కులను గురువారం బ్యాంకులో జమ చేయగా బౌన్స్ అయ్యాయని తెలిసింది. కావాలనే బౌన్స్ అయ్యేలా చెక్కులిచ్చినట్లు మున్సిపల్ వర్గాల్లో ప్రచారం కొనసాగుతోంది.

News January 23, 2026

జగన్‌ పాలనలో అన్ని వర్గాలకూ వేధింపులే: మంత్రి స్వామి

image

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్‌రెడ్డి సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు అందరినీ వేధించారని మంత్రి బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. అభివృద్ధిని విస్మరించి అమరావతి, పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను అస్తవ్యస్తం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీత్కరించినా వైసీపీ నేతల్లో మార్పు రాకపోవడం దురదృష్టకరమన్నారు. జగన్ తీరుతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన ధ్వజమెత్తారు.

News January 23, 2026

నరసాపురం: ‘తాబేళ్ల సంరక్షణకు చర్యలు’

image

తీర ప్రాంత గ్రామాల్లో సముద్ర పర్యావరణ పరిరక్షణకు దోహదపడే తాబేళ్లను సంరక్షించేందుకు, వాటి సంతతిని పెంచేందుకు అటవీ శాఖా పరంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీశాఖ అధికారి డీఏ కిరణ్ తెలిపారు. గురువారం పీఎం లంక, కేపీపాలెం సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.

News January 22, 2026

నెల్లూరు: ఆక్వా రైతులకు లైసెన్స్‌ తప్పనిసరి

image

నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుకు కరెంట్ సబ్సిడీ లబ్ధికి అనుమతులు తప్పనిసరి అని మత్స్యశాఖ అధికారిని శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. APSADA & CAA చట్ట నిబంధనల మేరకు ఆక్వా సాగు చేయు (మంచి నీటి & ఉప్పు నీటి వనరులలో) ప్రతి రైతు కరెంటు సబ్సిడీని పొందుటకు తప్పనిసరిగా మత్స్యశాఖ ద్వారా లైసెన్సు పొందాలన్నారు. అనుమతి పొందని వారు ఈనెల 31వ తేదీ లోగా సచివాలయం ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 22, 2026

ఈ నెల 29న విడుదల కానున్న ఏపీ మత్స్యకారులు

image

బంగ్లాదేశ్ జైల్లో బందీలుగా ఉన్న 23 మంది భారతీయ మత్స్యకారులను ఈ నెల 29న విడుదల చేసి భారత్‌కు పంపనున్నట్లు Bangladesh Coast Guard ప్రకటించిందని ఈస్ట్ కోస్ట్ మెకానైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జానకిరామ్ తెలిపారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన 9 మంది ఉన్నారు. అక్టోబర్ 22న విశాఖ హార్బర్ నుంచి వేటకు వెళ్లి పొరపాటున బంగ్లాదేశ్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు.

News January 22, 2026

EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

News January 22, 2026

ఏయూలో పాలన గాడి తప్పిందా?

image

ఖరగ్‌పూర్‌ ఐఐటీలో గణిత శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను ఏయూకి వీసీగా ప్రభుత్వం నియమించింది. అయితే వీసీ అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులను కలుపుకొని ముందుకు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఈడీ విద్యార్థి మృతి, వీసీని నేరుగా కలవొద్దంటూ సర్క్యులర్లు, తాజాగా ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు మెస్‌లో భోజనం నిలిపివేయడంతో వైఫల్యాలు కనిపిస్తున్నాయి.

News January 22, 2026

నరసన్నపేటలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు..వైసీపీ ఆరోపణ

image

నరసన్నపేట మండలం తామరపల్లిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్‌ నిర్మాణాలు జరుగుతున్నట్లు వైసీపీ ఆరోపించింది. ఈ కట్టడాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని, అధికార పార్టీ నాయకుల అండతోనే నిర్మాణాలు చేపడుతున్నా.. యంత్రాంగం అడ్డుకోలేదని వైసీపీ విమర్శించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆ పార్టీ ఓ వీడియోను పోస్టు చేసింది.

News January 22, 2026

కృష్ణా: 23న జిల్లాలో ‘నా ఇండియా నా ఓటు’

image

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ‘నా ఇండియా నా ఓటు’ అనే నినాదంతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు.