Andhra Pradesh

News September 24, 2024

కర్నూలు జిల్లాలో భారీగా MPDOల బదిలీ

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీగా ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. ఒకేసారి 42 మంది ఎంపీడీవోలకు స్థానాలు కేటాయిస్తూ జెడ్పి సీఈవో నాసరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ముగ్గురు ఎంపీడీవోలను కడప జిల్లా నుంచి జిల్లాకు కేటాయించగా, మరో ఆరుగురు ఎంపీడీవోలను అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు కేటాయించారు.

News September 24, 2024

ప్రకాశం జిల్లాలో మెగా జాబ్ మేళా.. వివరాలివే.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335 కు సంప్రదించాలన్నారు.

News September 24, 2024

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు: కలెక్టర్

image

రానున్న 24 గంటల్లో జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. మంగళవారం ఆయన ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాజ్‌వే, వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు జాగ్రత్తగా ఉండాలన్నారు.

News September 24, 2024

కర్రోతు బంగార్రాజును అభినందించిన ఎంపీ

image

AP మార్క్ ఫెడ్ ఛైర్మన్‌గా నూతనంగా నియమితులైన నెల్లిమర్ల టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కుర్రోతు బంగార్రాజును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవులలో సామాన్య కార్యకర్తలకు, యువతకు పెద్ద పీట కూటమి ప్రభుత్వం వేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

News September 24, 2024

బేతంచెర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

బేతంచెర్ల మండలం ముచ్చట్ల దేవాలయానికి వెళ్లే రహదారిపై మంగళవారం ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బేతంచెర్లకు చెందిన యువకులు బైకుపై వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంచే శ్రీనివాసులు(22) అక్కడికక్కడే మృతి చెందగా, గణేష్‌కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News September 24, 2024

శ్రీకాకుళం: మార్క్‌ఫెడ్ డైరెక్టర్‌‌గా సిక్కోలు వాసి

image

కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లో బూర్జ మండలాన్ని డైరెక్టర్ పోస్టులు వరించాయి. ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం పెద్దపేట గ్రామానికి చెందిన ఆనపు రామకృష్ణనాయుడు మార్క్ ఫెడ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గతంలో రాష్ట్ర జడ్పీటీసీల సంఘ అధ్యక్షుడిగా, పంచాయతీరాజ్ ఛాంబర్ కార్యదర్శిగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధినేత తన సేవలు గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

News September 24, 2024

ప్రొద్దుటూరు: తండ్రి హత్య కేసులో.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష

image

ఆస్తి, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కేసులో మంగళవారం ప్రొద్దుటూరు 2nd ADJ జడ్జి GS రమేశ్ కుమార్ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కడప హోటల్ లక్ష్మీ భవన్ యజమాని ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యను ఆయన చిన్న కొడుకు శివ ప్రసాద్, జనార్ధన్, పెద్దకోడలు సుప్రజ, 2014 డిసెంబర్ 30న హత్య చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ముగ్గురికి యావజ్జీవ శిక్ష, రూ.4 లక్షలు జరిమానా విధించారు.

News September 24, 2024

తొలి జాబితాలో కడప జిల్లాకు నో ఛాన్స్.. రెండో జాబితాపై ఆశలు!

image

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీని ప్రారంభించింది. ఇవాళ 20 మందితో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో కడప జిల్లా నేతలకు చోటు దక్కలేదు. నామినేటెడ్ పదవులపై ఆశ పెట్టుకున్న జిల్లా నేతలకు నిరాశే ఎదురైంది. బీటెక్ రవి, ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, భూపేశ్ రెడ్డి, బత్యాల చెంగల్ రాయుడు వంటి వారు పదవులు ఆశిస్తుండగా రెండో జాబితాలో జిల్లా నేతలకు చోటు దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

News September 24, 2024

కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీకాకుళం నేత.. నేపథ్యం ఇదే

image

ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వజ్జ బాబురావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు, నాయకులు అభినందనలు తెలిపారు. గతంలో ఈయన పలాస మున్సిపాలిటీ ఛైర్మన్‌గా చేశారు. టీడీపీలో ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఈ పదవి వరించినందుకు సీఎం చంద్రబాబుకు అభినందనలు తెలిపారు.

News September 24, 2024

ATP: క్రికెట్ బెట్టింగ్.. 19 మంది అరెస్ట్

image

అనంతపురం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు ఉక్కు పాదం మోపారు. బెట్టింగ్‌కు పాల్పడిన 19 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పారు. వీరిలో ఏడుగురు హరియాణాకు చెందిన వారని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ.8,60,000ల నగదు, 19 సెల్ ఫోన్లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటుకులపల్లి సీఐ హేమంత్ కుమార్, రాప్తాడు సీఐ వెంకట శ్రీ హర్ష, ఎస్ఐ విజయ్ కుమార్‌లను అభినందించారు.