Andhra Pradesh

News May 28, 2024

టంగుటూరు: వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

టంగుటూరు మండలం తేటుపురంలోని పాలేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు.. 35 సంవత్సరాలు కలిగిన వ్యక్తి బ్లూ రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. ఒడ్డుకు మృతదేహం కొట్టుకు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 28, 2024

ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో పూర్వికి చోటు

image

విశాఖలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్‌కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. పొడిమట్టిని ఉపయోగించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాల సూక్ష్మ నమూనాలను ఈమె తయారు చేసింది. ఈ కళానైపుణ్యానికి పూర్వి రజాక్ పేరును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పొందుపరిచారు.

News May 28, 2024

మరో 7 రోజులే.. గుంటూరులో ఆధిపత్యం ఎవరిది.?

image

ఓట్ల లెక్కింపు తేదీ జూన్ 4 వచ్చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉండగా.. ఫలితాలకు మరో 7 రోజుల సమయమే ఉంది. ఓ వైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు బెట్టింగులు జోరందుకున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో YCP 15 అసెంబ్లీ, 2 MP స్థానాలు గెలుచుకోగా, తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఇరుపార్టీల నేతలు గెలుపుపై ధీమాగా ఉండగా, ఏ పార్టీది ఆధిపత్యం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News May 28, 2024

నంద్యాల: ప్రమాదకరంగా వక్కిలేరు వంతెన

image

నంద్యాల జిల్లా చాగలమర్రి సమీపంలోని వక్కిలేరు వాగుపై బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన వంతెన శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటుచేసిన రక్షణ గోడలు పూర్తిగా దెబ్బతిని కూలిపోవడంతో రాకపోకల సమయంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రైతులు ఈ రహదారిలో ఎక్కువగా తిరిగే అవకాశం ఉన్నందున అధికారులు చర్యలు చేపట్టి రక్షణ గోడలు నిర్మించాలని కోరుతున్నారు.

News May 28, 2024

శ్రీకాకుళం: చిన్నారిపై అత్యాచారయత్నం.. కీచకుడికి దేహశుద్ధి

image

పొందూరు మండలంలోని ఓ గ్రామంలో ఏడేళ్ల చిన్నారిపై 24 ఏళ్ల యువకుడు మద్యం మత్తులో అత్యాచారయత్నానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారికి మామిడి పండు ఆశ చూపి తన ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఇంటికి వచ్చిన చిన్నారి విషయాన్ని తల్లికి చెప్పడంతో బంధువులు యువకుడికి దేహశుద్ధి చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 28, 2024

అనంత: బీఫార్మసీ ఫలితాల విడుదల

image

బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు జేఎన్టీయూ పరీక్షల విభాగం అధికారులు కేశవ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఫలితాల కోసం జేఎన్టీయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధ్యాపక బృందం, తదితరులు పాల్గొన్నారు.

News May 28, 2024

కొవ్వూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

image

కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరుకు చెందిన స్వామినాథన్, రాజేశ్, రాధాప్రియ, స్వామి నాథన్ అన్న కుమారుడు మృతి చెందారు. తమిళనాడుకు చెందిన స్వామినాథన్ 15 ఏళ్ళ క్రితం కుటుంబంతో వచ్చి కొవ్వూరులో స్థిరపడ్డారు. కుమారుడు రాజేశ్, కూతురు రాధ తమిళనాడులో చదువుతున్నారు. వేసవి సెలవులకు కొవ్వూరు వచ్చిన వీరు తిరిగి సోమవారం కారులో తమిళనాడు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News May 28, 2024

ఏలూరు: పోలీసుల గస్తీ.. ప్రతి వాహనం పరిశీలన

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి వేళలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు అన్ని ప్రాంతాలలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

News May 28, 2024

చిత్తూరు: 1నుంచి అమల్లోకి నూతన ట్రాఫిక్ చట్టం

image

జూన్ 1 నుంచి నూతన ట్రాఫిక్ చట్టాలు అమలులోకి రానున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. నిబంధనలు పాటించిన వారిపై భారీ జరిమానా విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ. 25వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. తాగి వాహనాలు నడిపితే రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తామని వివరించారు.

News May 28, 2024

గుంటూరు: రైలు పట్టాలు తప్పిన ఘటనపై విచారణకు కమిటీ

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఆదివారం సరకుల రైలు పట్టాలు తప్పిన ఘటనపై విచారణకు కమిటీని నియమిస్తూ మండల రైల్వే అధికారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ అధికారులను నియమించారు. సీనియర్ డీఈఎన్(కోఆర్డినేషన్), సీనియర్ డీఎస్వో, సీనియర్ డీఎంఈ, సీనియర్ డీఎంవో ఉన్నారు. ఈ కమిటీ సభ్యులు తమ నివేదికను జూన్ 2 లోపు ఇవ్వాలి. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు.