Andhra Pradesh

News May 28, 2024

ఎస్కేయూలో రెండు నూతన కోర్సులు

image

శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు నూతనంగా రెండు కోర్సులు మంజూరైనట్లు వైస్ ఛాన్సలర్ హుసేన్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ సైన్స్‌కు అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ మిషిన్ లర్నింగ్, కంప్యూటర్ సైన్సు డేటా కోర్సులకు ఏఐసీటీఈ అనుమతించిందని తెలిపారు. ఒక్కొక్క కోర్సుకు 60 సీట్లు ఉన్నట్లు తెలిపారు.

News May 28, 2024

టెక్కలితో ఎన్టీఆర్‌కు ప్రత్యేక అనుబంధం

image

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు టెక్కలితో ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడిగా 1994లో జరిగిన ఎన్నికల్లో ఆయన టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టెక్కలి పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యం కోసం అప్పట్లో టెక్కలికి ప్రాంతీయ ఆసుపత్రిని మంజూరు చేశారు. పట్టణంలోని పాత జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఒక మహావృక్షం ఎన్టీఆర్ గుర్తుగా ఉంది. నేడు ఆయన జయంతి.

News May 28, 2024

పి.గన్నవరం: 75 కేజీల పనసకాయ

image

పి.గన్నవరం మండలంలోని యర్రం శెట్టివారిపాలెంలో అడబాల రంగారావు తోటలో ఒక పనసచెట్టుకు 75.200 కేజీల బరువుతో పనసకాయ కాసింది. దానిని అంబాజీపేట మార్కెట్ కు తరలించారు. ఈ బరువైన పనసకాయను చూసిన ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రూ.7 వేలకు పైబడి కొనుగోలు చేస్తారని స్థానిక వ్యాపారులు తెలిపారు.

News May 28, 2024

నందిగామ ఫలితం 4 గంటల్లోనే..

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలో తొలి ఫలితం నందిగామ నుంచి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 4 గంటల్లోనే ఇక్కడ విజేత ఎవరో తేలిపోనుంది. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నిమ్రా, నోవా కాలేజీల్లో లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే.

News May 28, 2024

నెల్లూరు: బాలికను రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నం

image

సంగం మండలంలోని ఓ బాలికను ఆటో డ్రైవర్ రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన బాలిక పక్క గ్రామంలో ఉన్న పాఠశాలకు షేక్ బాదుషా అనే వ్యక్తి ఆటోలో వెళ్తుండేది. కాగా వివాహం జరిగి ఇద్దరు పిల్లలున్న అతను.. బాలికపై కన్నేసి తన ఆటోలో పక్కనే కూర్చొబెట్టుకుని అశ్లీల వీడియోలు చూపిస్తూ అసభ్యకరకంగా ప్రవర్తించేవాడు. చివరికి వివాహం చేసుకునే కుట్రకు పాల్పడ్డాడు.

News May 28, 2024

కురిచేడు: కరెంట్ షాక్‌తో నాలుగు గేదెల మృతి

image

కరెంట్ షాక్‌తో నాలుగు గేదెలు మృతి చెందిన ఘటన కురిచేడు మండలంలో సోమవారం జరిగింది. గంగదొనకొండ గ్రామంలో గోదాల సుబ్బారెడ్డి, కర్నాటి పెద్ద వెంకటరెడ్డి, బెండయ్య గేదెలు పొలాల్లో గడ్డి తింటుండగా మధ్యాహ్నం అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో సమీపంలో ఉన్న పొలాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గేదెలు వాటిని తగలండంతో నాలుగు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

News May 28, 2024

చిత్తూరు: 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

image

ఎన్నికల విధులకు గైర్హాజరైన 65 మందిని సస్పెండ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ సోమవారం పేర్కొన్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, కొందరు రాతపూర్వక సంజాయిషీ ఇచ్చారని తెలిపారు. సంతృప్తికర సమాధానం ఇవ్వని సిబ్బందిని ఎన్నికల నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

News May 28, 2024

వేంపల్లి: విద్యుత్ షాక్‌తో బాలుడి మృతి

image

వేంపల్లిలో సోమవారం విషాదం నెలకొంది. కడప రోడ్డులో ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేస్తున్న స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఊటుకూరు మనోజ్ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. కారుకు నీటితో సర్వీసింగ్ చేస్తుండగా పొరపాటున నీరు మోటార్‌పై పడి మనోజ్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో చికిత్స కోసం బాలుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News May 28, 2024

ఉమ్మడి అనంత జిల్లాలో రానున్న 5 రోజుల పాటు వర్షాలు

image

నైరుతి రుతుపవనాల రాక నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు. ఐదు రోజుల్లో రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం మీదుగా లక్షద్వీప్, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. ఈ ప్రభావంతో జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

News May 28, 2024

గుంటూరులో వ్యభిచార ముఠా అరెస్ట్

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను సోమవారం గుంటూరు నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీనివాసరావుపేటలో లత అనే మహిళ ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తోంది. సోమవారం సీఐ మధుసూదన్ రావు ఆ ఇంటిపై తనిఖీలు చేసి ఇద్దరు మహిళలు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.