Andhra Pradesh

News May 27, 2024

కృష్ణా: రేపు పాలీసెట్ కౌన్సిలింగ్ జరిగే ర్యాంకుల వివరాలు

image

ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రేపు మంగళవారం పాలీసెట్-2024లో 12,001- 27,000 వరకు ర్యాంక్ పొందినవారికి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. పైన తెలిపిన ర్యాంకులు పొందిన విద్యార్థులు విజయవాడలోని 3 హెల్ప్‌లైన్ కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ర్యాంక్, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

News May 27, 2024

ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి: ముకేశ్ కుమార్ మీనా

image

జూన్ 4న ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. నేడు నిమ్రా కళాశాలలో కలెక్టర్ ఢిల్లీ రావు, సీపీ రామకృష్ణతో కలిసి స్వయంగా స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మీనా మాట్లాడుతూ.. కీలకమైన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పలు సూచనలు సలహాలు జారీ చేశారు.

News May 27, 2024

ఎచ్చెర్ల: జూన్ 3 వరకు పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ

image

పాలిటెక్నిక్‌ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ రాష్ట్ర డైరెక్టర్ నాగరాణి తెలిపారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమవ్వగా ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. శ్రీకాకుళం మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్, టెక్కలి, ఆమదాలవలస, సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలల్లో 780 సీట్లు ఉన్నాయన్నారు.

News May 27, 2024

కృష్ణా: డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున వర్సిటీ(డిస్టెన్స్) 2024 ఫిబ్రవరి- మార్చిలో నిర్వహించిన వివిధ పరీక్షల ఫలితాలు నేడు సోమవారం విడుదలయ్యాయి. ఈ మేరకు డిప్లొమా కోర్సులు(ఇయర్ ఎండ్), డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సుల(సెమిస్టర్ ఎండ్) ఫలితాలు నేడు విడుదల చేశామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఫలితాలకు http://www.anucde.info/ వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ ట్యాబ్ చూడాలని సూచించాయి.

News May 27, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు 28 నాటికే పూర్తి చేయాలి

image

కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. డ్రై రన్ అనంతరం శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అందరూ కౌంటింగ్ అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. తప్పిదాలు జరగరాదని స్పష్టం చేశారు. ఆర్ఓ, ఎంఆర్ఓ పక్కాగా కచ్చితత్వంతో ఉండాలన్నారు.

News May 27, 2024

కౌంటింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు: కలెక్టర్

image

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సోమవారం సాయంత్రం పరిశీలించారు. మీడియా సెంటర్, కౌంటింగ్ ఏజెంట్ల భోజన ఏర్పాట్లు, పార్కింగ్ తదితర అంశాలను ఆయన పరిశీలించారు.

News May 27, 2024

మైదుకూరు: ఆటోను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. వ్యక్తి మృతి

image

మైదుకూరు మండల పరిధిలోని కేశలింగయ్య పల్లె వద్ద సోమవారం సాయంత్రం ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామానికి చెందిన సుంకర కొండయ్య(55) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానికులు మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే తలకు బలమైన గాయం తగిలి మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News May 27, 2024

శ్రీకాకుళం: పాలీసెట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేవారికి ముఖ్య సూచన

image

పాలీసెట్ కౌన్సెలింగ్‌ హాజరయ్యే అభ్యర్థులు కింది ధ్రువపత్రాలు తెచ్చుకోవాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు సూచించారు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. * ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించిన రసీదు * పాలీసెట్ హాల్ టికెట్,ర్యాంక్ కార్డు * SSC మార్కుల జాబితా * 4- 10 తరగతుల స్టడీ సర్టిఫికెట్/ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ * EWS వర్తించే వారికి సంబంధిత ధ్రువపత్రాలు * ప్రత్యేక కేటగిరిని నిర్ధారించే ధ్రువపత్రాలు.

News May 27, 2024

కృష్ణా వర్సిటీలో ఓట్లు లెక్కించేది ఈ రూమ్‌లలోనే

image

జిల్లాకు సంబంధించి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లను జూన్ 4న కృష్ణా విశ్వవిద్యాలయంలో లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపునకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రూమ్‌లను కేటాయించారు. రూమ్ నం.301Aలో గన్నవరం, రూమ్ నం.101Aలో గుడివాడ, రూమ్ నం.134Aలో పెడన, రూమ్ నం.118Aలో మచిలీపట్నం, రూమ్ నం.322Bలో అవనిగడ్డ, రూమ్ నం.129Aలో పామర్రు, రూమ్ నం.201Aలో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఓట్లను లెక్కించనున్నారు.

News May 27, 2024

సీతంపేట: ఆటో బోల్తా ఘటనలో ఒకరు మృతి

image

సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో సోమవారం ఆటో బోల్తా పడిన ఘటన తెలిసిందే. ఆటోలో 18 మంది గిరిజనులు ప్రయాణిస్తుండగా బోల్తా పడటంతో సవర కార్తీక్(10) అనే అబ్బాయి మృతి చెందాడు. ప్రయాణికులంతా సీతంపేట సంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఏడుగురిని సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఏడుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకెళ్లారు.