Andhra Pradesh

News September 24, 2024

నందం అబద్ధయ్య నేపథ్యం ఇదే..

image

మంగళగిరికి చెందిన టీడీపీ నేత నందం అబద్ధయ్య పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు మంగళవారం ప్రకటించారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన అబద్ధయ్య తొలి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్నారు. గతంలో మంగళగిరి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్‌గా చేసి నేడు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు. మంగళగిరిలో లోకేశ్ విజయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.

News September 24, 2024

సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ

image

తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించి తీవ్ర అపచారం చేశారని ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేశ్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రాయశ్చిత్తంగా సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వారు పాల్గొని సింహాద్రి అప్పన్నకు విశేష పూజలు, యాగాలు చేశారు.

News September 24, 2024

నెల్లిమర్ల మద్యం గోడౌన్ వద్ద వైన్ షాప్ ఉద్యోగుల ఆందోళన

image

జిల్లావ్యాప్తంగా వైన్ షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానిక ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ గోడౌన్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సయిజ్ సీఐ శ్రీనివాస్, నెల్లిమర్ల ఎస్సై గణేష్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

News September 24, 2024

ఏయూ: పీజీ, డిప్లమా కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

ఏయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ నాయుడు తెలిపారు. ఆసక్తి అర్హత కలిగిన వారు అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 16న కౌన్సిలింగ్ జరిపి ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు.

News September 24, 2024

VZM: వందే‌భారత్ టికెట్ రేట్లపై మీ కామెంట్

image

విశాఖపట్నం-దుర్గ్ మధ్య నడుస్తున్న వందేభారత్ టికెట్ ధరలపై ప్రయాణీకులు పెదవి విరుస్తున్నారు. విశాఖ నుంచి విజయనగరానికి రూ.435, పార్వతీపురం-రూ.565, రాయగడ- రూ.640, రాయ్‌పూర్‌-రూ.1435, దుర్గ్‌కు రూ.1495 ఛార్జ్ చేస్తున్నారు. భారీగా ఉన్న ఈ ధరలతో వందే భారత్ ఎక్కేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదని విమర్శలొస్తున్నాయి. ధరలు తగ్గించాలని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. మరి ఈ టికెట్ రేట్లపై మీ కామెంట్

News September 24, 2024

ప.గో. జిల్లాలో 118.6 మి.మీ. వర్షపాతం

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 118.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. జిల్లాలో అత్యధికంగా కాళ్ల మండలంలో 52.2, ఉండి 22.2, ఇరగవరం 19.0, పెనుమంట్ర 14.2, పెనుగొండ 4.2, నరసాపురం 2.8, యలమంచిలి, పెంటపాడు 1.4, ఆకివీడు 1.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు కాగా మిగిలిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు.

News September 24, 2024

ఒంగోలు: 108లో ఖాళీ పోస్టుల భర్తీకి మోక్షం

image

ప్రకాశం జిల్లాలోని 108 వాహనాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మోక్షం లభించింది. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు 108 జిల్లా మేనేజర్ విజయకుమార్ తెలిపారు. డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) పోస్టుల భర్తీకి అర్హులైన వారు ఈనెల 29 లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 26న పాత రిమ్స్‌‌లోని కార్యాలయం దగ్గర డ్రైవింగ్ పరీక్ష కోసం హాజరుకావాలన్నారు.

News September 24, 2024

నెల్లూరు జిల్లా 108లో ఉద్యోగ అవకాశాలు

image

నెల్లూరు జిల్లాలోని 108 వాహనాల్లో పైలెట్, ఈఎంటీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎస్. విజయ్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 25వ తేదీలోపు నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, దిశ మహిళా పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న 108 కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

News September 24, 2024

పోలీస్ స్టేషన్‌లో చిత్తూరు జిల్లా వాసి ఆత్మహత్యాయత్నం

image

చిత్తూరు జిల్లా SRపురానికి చెందిన కుమార్ ఒంగోలు PSలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అందిన సమాచారం..అప్పులు చేసి పరారై ఒంగోలు వచ్చి క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. అప్పులోళ్లు శనివారం ఒంగోలు వచ్చి టీడీపీ నేత సాయంతో ఘర్షణకు దిగారు. పోలీసులు అందరినీ స్టేషన్‌కు పిలిపించి సర్ది చెప్పారు. మళ్లీ వారు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణకు పిలిచి.. SI చేయిచేసుకున్నాడంటూ ఆత్మహత్యాయత్నం చేశాడు.

News September 24, 2024

కంచరపాలెం వద్ద యాక్సిడెంట్.. ఇద్దరు యువకుల మృతి

image

విశాఖ నగరం కంచరపాలెం ఇందిరానగర్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఊర్వశి జంక్షన్ నుంచి తాటిచెట్లపాలెం వైపు బైక్ మీద వెళుతున్న ముగ్గురు యువకులు కిందపడగా.. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వెళ్తూ అదుపుతప్పి కింద పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.