Andhra Pradesh

News September 10, 2025

ఆందోళన చెందవద్దని.. ప్రకాశం కలెక్టర్ పిలుపు!

image

రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు పంపిణీ చేస్తామని, ఎరువుల పంపిణీ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం ముండ్లమూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో యూరియా సరఫరా, పంపిణీపై రైతులకు అవగాహన కలిగించే ఉద్దేశంతో చేపట్టిన మెగా అవుట్ రీచ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు కలెక్టర్ పలు సూచనలు జారీ చేశారు.

News September 10, 2025

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: VZM SP

image

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.వెయ్యి జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. 2023లో కొత్తవలసలోని కుమ్మరివీధిలో సూర్యకాంతం ఇంట్లోకి ఎల్.కోట (M) జమ్మాదేవిపేటకు చెందిన కృష్ణ చొరబడి ఆమెను గాయపరిచి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.

News September 10, 2025

కడప జిల్లా పోలీసు శాఖకు నూతన జాగీలం

image

జిల్లా పోలీసు శాఖకు నూతన జాగిలం సోనును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం నూతన జాగీలాన్ని పరిశీలించారు. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ జాగీలం వచ్చిందని ఎస్పీ తెలిపారు. నేర పరిశోధన, పేలుడు పదార్థాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ పొందిందన్నారు. బిల్జియం మల నాయిస్ జాతికి చెందిన జాగీలమని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ సిబ్బందికి సూచనలు చేశారు.

News September 10, 2025

గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

image

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News September 10, 2025

పనులు పెండింగ్‌లో ఉంటే చర్యలు తప్పవు: కలెక్టర్

image

జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లను తప్పనిసరిగా EPTS పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రికార్డులను వెంటనే అప్‌లోడ్ చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

News September 10, 2025

‘కర్నూల్‌లో రూ. 112 కోట్ల బకాయిలను వసూలు చేయాలి’

image

కర్నూల్ నగరపాలక కార్యాలయంలో బుధవారం కమిషనర్ విశ్వనాథ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆస్తి పన్ను నీటి పన్ను వసూలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. పట్టణంలో ఆస్తి పన్ను రూ. 91 కోట్లు, నీటి పన్ను రూ.21 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. వీటిని వసూలు చేసేందకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది 95% తాగునీటి పన్నును వసూలు చేసిన అధికారులను అభినందించారు.

News September 10, 2025

మెంటాడ: పురుగుమందు తాగి ఆత్మహత్య

image

మెంటాడ మండలం గుర్ల గ్రామంలో మద్యానికి బానిసైన కుమిలి సంతోశ్ మంగళవారం రాత్రి పురుగుమందు తాగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆసుపత్రిలో చేర్చామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆండ్ర ఎస్‌ఐ సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 10, 2025

దేవనకొండలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

image

దేవనకొండ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రంజిత్ బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. అనంతరం మండలంలోని మన గ్రోమోర్, యూరియా షాపుల్లో సోదాలు చేశారు.ఆయా షాపుల్లో యూరియా పంపిణీ రిజిస్టర్‌ను ఆయన పరిశీలించారు.

News September 10, 2025

ప్రకాశం: పోస్టల్ స్కాలర్‌షిప్ పొందాలని ఉందా?

image

ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఏటా దీన్ దయాల్ స్పర్శ్ యోజన స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 6 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. విద్యార్థులు అర్హత పొందేందుకు రాత పరీక్ష, ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 30న రీజనల్ స్థాయి పరీక్ష ఉండగా, ఆసక్తి కలవారు ఈ నెల 16లోగా స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించాలి.

News September 10, 2025

13న గుంటూరులో జాతీయ లోక్ అదాలత్

image

గుంటూరు జిల్లాలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. వాహన ప్రమాద బీమా, చెక్ బౌన్స్, చిన్న క్రిమినల్, కుటుంబ వివాదాలు, సివిల్, బ్యాంక్, భూ వివాదం, విభజన వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.